Monday, 4 March 2024

త్వరలో కల్లు బార్లు

 రాష్ట్రంలో రానున్న రోజులలో కళ్ళు బార్లు ఏర్పాటు చేసే దిశగా తమ ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు గౌడ సంఘం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఏఎస్ఎన్ ఫంక్షన్ హాల్లో గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలం గుణంగా కులవృత్తులు మారుతున్నాయని అన్ని రకాల వ్యాపారాల తీర్మారుతోందన్నారు ఈ నేపథ్యంలో అనాదిగా వస్తున్న కళ్ళు గీత వృత్తి నేడు కనుమరుగవుతుందని ఈ వృత్తిని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు గీత కార్మికుల వృత్తిని కూడా ఆధునికీకరించాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు అందులో భాగంగా కల్తీ కళ్ళు లేకుండా గౌరవప్రదంగా విక్రయించే దిశగా ప్రభుత్వపరంగా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు రానున్న రోజులలో ఇది కార్యరూపం దాల్చిన అవకాశం ఉందని దీనివలన ఎంతోమందికి మేలు చేకూరుతుందని అభిప్రాయ పడ్డారు సర్వాయి పాపన్న విగ్రహం ట్యాంక్ బండ్పై ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పలువురు ఎమ్మెల్యేలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి మహబూబ్నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ నాయకులు పాల్గొన్నారు 

No comments:

Post a Comment