Wednesday 31 January 2024

4 న గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష

 గురుకుల ప్రతిభ కళాశాలలో 2024 25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి 4న నిర్వహించనున్నట్లు ప్రాంతీయ సమన్వయ అధికారి అలివేలు బుధవారం తెలిపారు జిల్లాలోని ధర్మారం బి కంజర ఆర్మూర్ బి శుద్ధపల్లి పోచంపాడు నవీపేట్ కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి భిక్కనూరు దోమకొండ తాడువాయి తాడుకు కొయ్యగుట్ట తక్కడపల్లి పెద్ద కోడప్పగల్ కామారెడ్డి డిగ్రీ కళాశాల పెద్దయకులారా బాన్సువాడ బోర్లా నిర్మల్ జిల్లాలో ముధోల్ లెఫ్ట్ పోచంపాడు జాం కడెం భయంసాలోని పరీక్ష కేంద్రాలలో ప్రవేశపరీక్ష ఉంటుందని తెలిపారు విద్యార్థులు తప్పనిసరిగా పరీక్ష కేంద్రాన్ని ఒకరోజు ముందుగానే సందర్శించాలని అన్నారు పరీక్షా కేంద్రాలను గుర్తించడంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే హాల్ టికెట్లో ముద్రించిన ముఖ్య పర్యవేక్షకుని ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం పొందాలని తెలిపారు.




ఓ టి ఎస్ గడువు మార్చి 31 వరకు పొడగింపు

 జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు ఏకకాల పరిష్కార పథకం వన్ టైం సెటిల్మెంట్ గడువు మార్చి 31 వరకు పొడిగించినట్లు ఉమ్మడి జిల్లా డీసీసీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు సొసైటీ చైర్మన్లు బ్యాంకుల్లో రుణాలు పొందిన రైతుల అభ్యర్థుల మేరకు ప్రవేశపెట్టిన ఓ టి ఎస్ పథకం జనవరి 31తో గడువు ముగియనున్న విషయం తెలిసిందే దీంతో ఈ పథకాన్ని ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు పొడగించి నట్లు పేర్కొన్నారు మార్చి 31 2023 నాటికి కాలపరిమితి ముగిసి బ్యాంకు ద్వారా బట్వాడా చేసిన సొసైటీలో తీసుకున్న రుణాలపై అపరాధ వడ్డీ 100% మాది వాయిదా మీరిన వడ్డీ పైన 30% వడ్డీ మాఫీ చేస్తామన్నారు దీర్ఘ కాలిక జేఎల్సి ఎస్ హెచ్ జి రుణాలపై వాటి 32 శాతం మాఫీ చేయనున్నట్లు తెలిపారు కావున అర్హులైన రుణ గ్రహీతలు ఏకకాల పరిష్కార పథకాన్ని సద్వినియోగం చేసుకుని బ్యాంకు అభివృద్ధికి సహకరించాలని కోరారు మిగతా వివరాల కోసం సంబంధిత సొసైటీలు బ్రాంచ్ మేనేజర్లను సంప్రదించాలని భాస్కర్ రెడ్డి సూచించారు



రగ్బీ పోటీలకుచిన్న మల్లారెడ్డి విద్యార్థుల ఎంపిక

 కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి లోని శాంతినికేతన్ విద్యాలయ పాఠశాల విద్యార్థులు నలుగురు యాదాద్రి భువనగిరిలో నిర్వహించబోయే రగ్బీ పోటీలకు ఎంపికయ్యారు పాఠశాల విద్యార్థులు రిషిక దివ్య అభిలాష్ రిషిత గౌడ్లు ఎంపిక కావడం పట్ల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు ప్రిన్సిపాల్ మరియన్ ఉపాధ్యాయులు శ్రీధర్ పటేల్ స్వామి రాజు శివాజీ ఉన్నారు



హనుమాన్ పండరీనాథ్ ట్రస్ట్ కార్యవర్గం ఏర్పాటు

 హనుమాన్ పండరీనాథ్ ట్రస్ట్ కార్యవర్గం 2024 ఏర్పాటు

తాడ్వాయి మండల కేంద్రంలో హనుమాన్ శబరిమాత పండరీనాథ్ మహారాజ్ ట్రస్ట్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా మద్దిమహేందర్ రెడ్డి ఉపాధ్యక్షుడిగా ఆకిటి రాజిరెడ్డి కోశాధికారిగా అంబీర్ శ్యామ్ రావు ప్రధాన కార్యదర్శిగా వాంకోజి శ్యామ్ రావు తదితరులను ఎన్నుకున్నారు సర్పంచ్ సంజీవులు వైస్ ఎంపీపీ నర్సింలు బీడీసీ చైర్మన్ రాజు గ్రామ పెద్దలు సాయి రెడ్డి వెంకట్రామిరెడ్డి స్వామి రెడ్డి ఉన్నారు.



సదరం క్యాంపుల తేదీలు ఖరారు

 కామారెడ్డి జిల్లాలో దివ్యాంగుల నిర్ధారణ ధ్రువీకరణ పత్రాల కోసం ఫిబ్రవరి మార్చి నెలలో సదరం క్యాంపులు నిర్వహించనున్నారు ఈ విషయాన్ని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సాయన్న బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ నెల 7 8 21 22 తేదీలతో పాటు మార్చిలో ఆరు ఏడు 20 21 తేదీలలో జిల్లా కేంద్ర ఆస్పత్రిలో సదరం క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు అర్హులైన వారు మీ సేవ కేంద్రాలలో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు.




స్వాతంత్ర సమరయోధుడికి 13 ఏళ్ల వయసులో మూడు పెళ్లి

 మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కు చెందిన నూట మూడు ఏళ్ల స్వాతంత్ర సమరయోధుడు హబీబ్ నజర్ 49 ఏళ్ల ఫిరోజ్ జహాన్ ను మూడో పెళ్లి చేసుకున్నారు హబీబ్ కు గతంలో రెండు వివాహాలు జరిగాయి ఇద్దరు భార్యలు మరణించారు సంతానం లేని ఆయనను తర్వాత పట్టించుకునే వారు లేకుండా పోయారు ఒంటరితనంతో బాధపడుతూ తన వయసులో దాదాపు సగం ఈడున్న ఫిరోజ్ను మూడో పెళ్లి చేసుకున్నారు ఈమె భర్తను కోల్పోయిన మహిళ ప్రతిడా అదే వీరి పెళ్లి జరిగిన ఆ ఫోటోలు వీడియోలు తాజాగా నేటింటా వైరల్ గా మారాయి తలదాచుకునేందుకు ఇల్లు ఉన్న హాబీకు ప్రభుత్వం నుంచి వచ్చే పించనే ఆధారం



పోస్టల్ పథకాలపై అవగాహన

 రాజంపేట పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో మంగళవారం పోస్టల్ కు సంబంధించిన వివిధ రకాల సేవలు పథకాల గురించి ఏఎస్పీ భూమన్న ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు 400 రూపాయలకే 10 లక్షల రూపాయల యాక్సిస్టెంట్ ఇన్సూరెన్స్ తదితర అంశాలపై వివరించారు ఈ కార్యక్రమంలో ఎంఓ రాంరెడ్డి మహబూబ్ రెడ్డి ఎస్పీఎం బిక్షపతి బిపిఎంలు పాల్గొన్నారు



త్వరలో రాష్ట్రపతి నిలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు

 త్వరలో రాష్ట్రపతి నిలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు రాష్ట్రపతి నిలయం ఎస్టేట్ మేనేజర్ రజనీప్రియ వెల్లడి

రాష్ట్రపతి నిలయం సందర్శనకు వచ్చేవారిని ఆకట్టుకునేలా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో త్వరలో సాయంత్రం వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట్రపతి నిలయం ఎస్టేట్ మేనేజర్ రజిని ప్రియ తెలిపారు రాష్ట్రపతి నిలయంలో సందర్శకులకు అనుమతి ఇచ్చిన అప్పటినుండి ఇప్పటివరకు లక్ష మంది వచ్చారన్నారు రాష్ట్రపతి నిలయం ప్రత్యేకతలు సందర్శకులు అనుమతికి సంబంధించి పలు వివరాలు మంగళవారం మీడియా సమావేశంలో రజనీప్రియ అడ్మిన్ ఆఫీసర్ దులార్ మింగ్ అసిస్టెంట్ అడ్మిన్ ఆఫీసర్ రాజేష్ యాదవ్ వెల్లడించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటర్ వరకు ప్రభుత్వ స్కూళ్ళు కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఉచిత ప్రవేశ సదుపాయం ఉందని తెలిపారు సాధారణ పౌరులకు 50 రూపాయలు విదేశీయులకు 250 ప్రవేశ రుసుముగా నిర్ణయించినట్లు చెప్పారు ప్రతిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శకులకు అనుమతి ఉంటుందని సోమవారం సెలవు అని పేర్కొన్నారు రాష్ట్రపతి నిలయ సందర్శన విద్యార్థులకు విహారయాత్రతో పాటు విజ్ఞాన యాత్రగా కూడా నిలుస్తుందని అన్నారు పిల్లలకు జంక్ ఫుడ్ ఇవ్వకుండా ఇక్కడి క్యాంటీన్లో ఆర్గానిక్ ఆహారం అందిస్తున్నామని రజనీప్రియ వెల్లడించారు హైదరాబాద్ పర్యాటక ప్రాంతాల జాబితాలో రాష్ట్రపతి నిలయం చేర్చేందుకు త్వరలో పర్యాటకశాఖ అధికారులతో చర్చించి ఒప్పందం కుదుర్చుకొని ఉన్నట్లు చెప్పారు నిలయం ఆవరణలో ప్రతి కట్టడం విశేషాలు వివరించేందుకు గైడ్లు అందుబాటులో ఉన్నారని రజనీ ప్రియ తెలిపారు.



ఇల్లు కొంటె భార్య ఫ్రీ

 ఇల్లు కొంటె భార్య ఫ్రీ చైనాలో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ వింత ప్రచారం ఎందుకంటే ప్రేయసిక బంగారం అంటూ మరో కంపెనీ నిర్మాణం పూర్తయిన ఇండ్లను విక్రయించడానికి ఆఫర్లు చైనాలో రియల్ ఎస్టేట్ ద మాల్ 72 లక్షల ఇళ్లు కాళీ గానే ఘోస్ట్ సిటీలో దర్శనమిస్తున్న నగర శివారు ప్రాంతాలు

చైనాలో రియల్ ఎస్టేట్ సంక్షోభం తారాస్థాయికి చేరుకున్నది ఎంతలా అంటే ఇల్లు కొనండి భార్యను ఉచితంగా పొందండి అంటూ నిర్మాణ సంస్థలు ప్రకటనలు ఇచ్చి కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి మరి టియాంజన్ కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ఈ తరహా వింత ప్రచారం ప్రారంభించింది చైనాలో గతంలో బాగా ప్రాచుర్యం పొందిన ఇల్లు కొని మీ భార్యకు కానుకగా ఇవ్వండి వాక్యాలను మార్చిన సదరుకంపిని ఇల్లు కొనండి వైఫ్ ను ఫ్రీగా పొందండి అంటూ హోరెత్తించింది చైనాలో ఇండ్లకు గిరాకీ లేకపోవడంతో పాటు అక్కడి యువకులు వివాహాలు సంతానం పట్ల అనాసక్తితో ఉన్నారు. దీంతో ఈ కంపెనీ ఇలాంటి వింత ప్రచారానికి తెరతీసింది ఈ విషయం కథ సెప్టెంబర్ లో ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో సదరు కంపెనీకి తాజాగా 4184 డాలర్ల జరిమానా విధించింది నిర్మాణం జరిగిన తమ ఇండ్లను విక్రయించడానికి తూర్పు జియాంగ్ ప్రావించకు చెందిన మరొక కంపెనీ ఇల్లు కొని వ్యక్తి ప్రేయసి లేదా ప్రియుడికి 10 గ్రాముల బంగారు గొలుసు బహుమతిగా ఇస్తామంటూ మరో ఆఫర్ ను ప్రకటించింది

ఎందుకు ఈ రియల్ ఎస్టేట్ సంక్షోభం అంటే చైనా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉండే స్థిరాస్థిరంగం ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది 2021లో స్థిరాస్థిరంగా దిగజం ఎవరి గ్రాండే సంక్షోభంలో పడిన నాటి నుంచి ఈ రంగం తీవ్రబోడుదుడుకులను చవిచూస్తున్నట్టు స్థిరాస్థిరంగా నిపుణులు చెబుతున్నారు ఎవర్ గ్రాండ్ తర్వాత కంట్రీ గార్డెన్ హోల్డింగ్స్ వంటి సంస్థలు కూడా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం నిరుద్యోగం ఆర్థిక మాంద్యం భయాలు ఆర్థిక స్థిరత్వం లేకపోవడంతో యువత పెండ్లిలకు విముఖత చూపిస్తుండటం బ్యాంకు ల నుంచి గృహ రుణాలు తీసుకోవడంలో అనాసక్తి వేరసి కథ ఆగస్టు చివరి నాటికి దేశవ్యాప్తంగా 9 చదరపు అడుగులు ఆపై విస్తీర్ణం కలిగిన దాదాపు 72 లక్షల కొత్త ఇండ్లు ఇక్కడయాలు జరగకుండా ఉన్నట్టు నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ గణాంకాల్లో తేలింది గృహ విక్రయాలు ఆరు శాతం మేర పడిపోయాయని బీజింగ్ సాంగ్ శంజన్ తదితర ప్రధాన నగరాల్లో ఒక్క డిసెంబర్ నెలలోనే ఇండ్ల అమ్మకాలు 11 శాతం నుంచి 14% మేరా పడిపోయినట్టు వెల్లడించింది

చివరకు ఘోస్ట్ సిటీలుగా చైనాలో పారిశ్రామిక విప్లవం నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున నగరాలు పట్టణాలకు వలస రావడం ప్రారంభించారు దీంతో వారికి అవసరమైన ఆవాసాలను ఏర్పాటు చేయడానికి రియల్ ఎస్టేట్ కంపెనీలు పుట్టగొడుగుల్లా వెలిశాయి నగర శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇండ్ల నిర్మాణాలు చేపట్టాయి ఇలా జీడీపీలో ప్రత్యక్షంగా పరోక్షంగా కలిపి రియల్ ఎస్టేట్ వాటా 29 శాతం వరకు ఎగబాకింది ఈ సమయంలోనే దేశంలోని చాలామంది సంపన్నులు వారికి చెందిన కంపెనీలు ఇండ్లు ఆకాశ హామీలను కొనుగోలు చేశాయి అయితే గృహ కొనుగోళ్లపై వినియోగదారులు ఆసక్తి కనపరచకపోవడంతో అటు రియల్ ఎస్టేట్ సంస్థలు ఇటు సంపన్నుల కంపెనీలు కొనుగోలు చేసిన ఇండ్లన్నీ ఖాళీగా ఉండి పోవాల్సిన దుస్థితి ఏర్పడింది అలా కన్భాషియంలో బెన్హై న్యూ ఏరియా జంతువులోని జంగాంగ్ న్యూ డిస్ట్రిక్ట్ ఇన్నర్ మంగోలియా లోని క్వీన్స్ ప్రావిన్స్ లోని పలు పట్టణాల శివారు ప్రాంతాల్లో నిర్మించిన గేటెడ్ కమ్యూనిటీలోని ఇండ్లు మఖాలు జరగక ఘోస్ట్ సిటీలుగా మిగిలిపోయాయి.



సైన్స్ ల్యాబ్ పరికరాల అందజేత

 పాల్వంచ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సైన్స్ ల్యాబ్ పరికరాలను మంగళవారం అందజేశారు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు పాలబోయిన సత్యం మాట్లాడారు గురు విద్యాసంస్థల చైర్మన్ గురువేందర్ రెడ్డి సహకారంతో 25వేల రూపాయల విలువైన సైన్స్ ల్యాబ్ పరికరాలను పాఠశాలకు అందజేశామని అన్నారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి రాజనర్సింహారెడ్డి ఫౌండేషన్ చైర్మన్ కాశీనాథం కాశీనాథ్ రావు గంగారెడ్డి కృష్ణమూర్తి లక్ష్మీపతి దాత గురువేందర్ రెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోవర్ధన్ రెడ్డి ఉప సర్పంచ్ జితేందర్ రెడ్డి కూచని శేఖర్ తదితరులు పాల్గొన్నారు



న్యాయ పాలనలో శిక్షణ

 న్యాయ పాలన అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ జస్టిస్ లో 2023 24 సంవత్సరంలో శిక్షణ పొందడానికి జిల్లాలోని అర్హులైన బీసీ న్యాయ శాస్త్ర పట్టభద్రులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ఒకటిన్నర లక్షలు గ్రామీణ ప్రాంతాల్లో రెండు లక్షలు మున్సిపల్ లో ఉన్నవారికి మించకూడదని అన్నారు శిక్షణ కాలంలో మూడు సంవత్సరాల పాటు నెలకు 1000 రూపాయల చొప్పున సబ్సిడీ రూపేనా ఆర్థిక సహాయం అందజేస్తారని తెలిపారు మొదటి సంవత్సరంలో పుస్తకాలు ఫర్నిచర్ కొనుగోలు నిమిత్తం 3000 రూపాయలు మంజూరు చేస్తారని తెలిపారు ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కార్యాలయం కామారెడ్డిలో ఈ నెల 31వ తేదీ వరకు స్వయంగా అందించాలని సూచించారు



Tuesday 30 January 2024

ఉచిత నేత్ర వైద్య శిబిరం

 లైన్స్ క్లబ్ ఆఫ్ బీర్కూర్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక క్లబ్ కార్యాలయంలో ఉచిత నేత్రవైద్య శిబిరం ఏర్పాటు చేశారు 30 మందికి కంటి పరీక్షలు చేయగా నలుగురికి దృష్టిలోపం ఉన్నట్లు నిర్ధారించామని వైద్యుడు సతీష్ తెలిపారు క్లబ్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ విటల్ గాలయ్య కిషోర్ సంతోష్ హనుమాన్లు సూర్యప్రకాష్ ఉన్నారు

టిపిజెఎంఏ రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక

 టీ పి జేఎంఏ రాష్ట్ర నూతన కార్యవర్గం 2024 ఎన్నిక

తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర నూతన కార్యవర్గ ఎన్నిక మంగళవారం సుందరయ్య కళానిలయంలో జరిగింది కొత్త 33 జిల్లాల కమిటీ సభ్యులు పాత పది జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మొత్తం 53 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. 40 ఓట్లు సాధించి అధ్యక్షుడిగా గౌరీ సతీష్ 27 ఓట్లతో ప్రధాన కార్యదర్శిగా విష్ణువర్ధన్ రెడ్డి ఎన్నికయ్యారు ఈ సందర్భంగా సతీష్ మీడియాతో మాట్లాడుతూ ప్రైవేట్ జూనియర్ కళాశాలల విద్యార్థుల బోధనా రుసుము బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అన్నారు.



క్రీడాకారిణులకు సన్మానం

 భిక్కనూరు ఎస్జిఎఫ్ ఆధ్వర్యంలో అండర్ 14 విభాగం జాతీయ రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో పాల్గొన్న విద్యార్థినులను జంగంపల్లి సర్పంచి నర్సింలు యాదవ్ సన్మానించారు శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయురాలు కల్పన మానస లను సన్మానించి అభినందించారు ప్రధానోపాధ్యాయుడు రాజేంద్రప్రసాద్ ఎం జె పి ప్రిన్సిపల్ ప్రమోద వార్డు సభ్యుడు సంతోష్ ప్రదీప్ రమేష్ పాల్గొన్నారు.



రెండున వివేక స్ఫూర్తి జిల్లా స్థాయి పోటీలు

 స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 2వ తేదీ శుక్రవారం రోజున జిల్లా కేంద్రం శివాజీ నగర్ రామకృష్ణ విద్యానికేతన్ లో జిల్లాస్థాయి ఉపన్యాస పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు ప్రథమ బహుమతి 5000 రూపాయలు ద్వితీయ బహుమతి మూడువేల రూపాయలు తృతీయ బహుమతి వెయ్యి రూపాయలు ప్రశంసా పత్రాలు అందిస్తామన్నారు ఆసక్తి గలవారు 9.2 9 0 4 4 9 3 8 9 నెంబర్లు సంప్రదించాలని తెలిపారు. నిజామాబాద్ ..


జాతీయ స్థాయికి ఎంపిక

 నిజామాబాద్ నగరంలోని విజయ్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఆకాంక్ష మహిళా ఉషూ పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల కార్యదర్శి అమృతలత తెలిపారు మంగళవారం ఉపాధ్యాయ బృందం క్రీడాకారిణిని అభినందించారు కోయంబత్తూర్ లో ఈనెల 18 21 తేదీల్లో నిర్వహించిన సౌత్ జోన్ అస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ ఉషు లీగ్ లో కాంస్య పతకం సాధించినట్లు తెలిపారు.



కామారెడ్డి జిల్లా ప్రభుత్వ లెక్చరర్స్ అసోసియేషన్ 2024

 


సీతాయి పేట పద్మ శాలి సంఘం కార్య వర్గం 2024.

 


మహా గాం ఆరె మరాఠా సంఘం కార్య వర్గం 2024

 


సాక్షి డిజిటల్ అవార్డులు..

 




Maxi care eye,dental multi speciality hospital

 Maxi care eye dental multi speciality hospital

Beside Anil printers

Siricilla road

Kamareddy..




30న సాప్ట్ బాల్ క్రీడా కారుల ఎంపిక..

 నిజామాబాద్ జిల్లా సాఫ్ట్ బాల్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 30న జిల్లా జూనియర్ సాఫ్ట్బాల్ బాలబాలికల జట్ల ఎంపిక నిర్వహించనున్నట్లు జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు వి ప్రభాకర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్ తెలిపారు బాలుర ఎంపిక సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాల ఆర్మూర్ క్రీడా మైదానంలో బాలికల ఎంపిక సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల సుద్దపల్లి క్రీడా మైదానంలో ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు జనవరి 1 2006 తర్వాత జన్మించిన వారు అర్హులని అన్నారు.




మూడున జిల్లాస్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్

 బాన్సువాడలో వచ్చే నెల మూడున జిల్లాస్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నారు ఈ విషయాన్ని తెలంగాణ సోషల్ టీచర్స్ ఫోరం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రసూన్ కుమార్ నూతిపల్లి బాలరాజ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు జిల్లాలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు కేజీబీవీలు గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న వారు ఈ సోషల్ టాలెంట్ టెస్ట్ కు అర్హులని పేర్కొన్నారు ఆసక్తి గల విద్యార్థులు తమ తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ చూపే విద్యార్థులు రాష్ట్రస్థాయి టాలెంట్ టెస్ట్ కు అర్హత సాధిస్తారని పేర్కొన్నారు ఇతర వివరాలకు 9 0 5 9 9 0 9 0 9 8, 9 4 9 0 5 1 11 5 3 నంబర్లలో సంప్రదించాలని సూచించారు

విజేతలకు బహమతుల ప్రదానం

 ఏబీవీపీ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో ఈనెల 19 20వ తేదీల్లో నిర్వహించిన యువజన వారోత్సవాల క్రీడా పోటీల్లో విజేతలకు సోమవారం అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త బహుమతులు అందజేశారు నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో కాబట్టి క్రికెట్ వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు విద్యార్థి దశ నుంచే గెలుపోటములు అలవాటు చేస్తూ గెలిచినవారు మరింత ముందుకు వెళుతూ ఓడిన వారు గెలవడానికి ప్రయత్నం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు రేంజర్ల నరేష్ విభాగ్ సంఘటన కార్యదర్శి రాజు సాగర్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మనోజ్ జిల్లా కన్వీనర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.

జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్షిప్ గా కస్తూర్బా విద్యార్థులు

జాతీయస్థాయి కరాటే కుంగ్ ఫు పోటీలో ఓవరాల్ ఛాంపియన్షిప్ గా కస్తూర్బా విద్యార్థులు గెలిచారని కస్తూర్బా గాంధీ పాఠశాల స్పెషల్ ఆఫీసర్ వినోద తెలిపారు ఈ సందర్భంగా హైదరాబాదులో జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీలో అండర్ 12 కట్టర్స్ లో విభాగంలో మహేశ్వరి ఆర్ హర్షవర్ధీని జి రశ్మిత శృత కీర్తి శాలిని గోల్డ్ మెడల్ సాధించారు రెండవ విభాగంలో అండర్ 12 ఎస్ శివ నందిని జి అఖిల అండ్ దివ్యశ్రీ సిహెచ్ అశ్విత ఎస్ ఆరాధ్య వనస్విని సిల్వర్ మెడల్ సాధించారని శ్రీ రష్మిత యు వర్ష టి నందిని ఎస్ రూప వి శ్రీ నిత్య బ్రాంచ్ మెడల్ సాధించారు ఓవరాల్ ఛాంపియన్షిప్ కప్పును కేజీబీవీ పాఠశాలకు లభించడం పాఠశాల ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు వీరిని తస్మో ఇండియా సిస్ సత్య శంకర్ సంతోష్ మాస్టర్ శ్రీకాంత్ టోర్నమెంట్ ఆర్గనైజర్




ముగిసిన వాలి బాల్ పోటీలు

 జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ట్రస్ట్ ఓపెన్ వాలీబాల్ పోటీలు సోమవారం ముగిశాయి ఈ సందర్భంగా బాగా రెడ్డి తనయుడు రాష్ట్ర భాజపా నాయకుడు జైపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి మొదటి స్థానంలో గెలుపొందిన తాడ్వాయి జట్టుకు 30 వేల రూపాయలు ద్వితీయ స్థానంలో నిలిచిన గుడి వెనక తండా జట్టుకు 20వేల రూపాయలు తృతీయ స్థానం కైవసం చేసుకున్న మోతె జట్టుకు పదివేల రూపాయల నగదు బహుమతులను అందజేశారు ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రత్యేక నగదు బహుమతులు ఇచ్చారు ఈ పోటీలో మొత్తం 40 జట్లు తలపడ్డాయి భాజపా నాయకులు యువజన నాయకులు క్రీడాకారులు పాల్గొన్నారు.




జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

బీర్కూర్ బిసి గురుకుల పాఠశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ చదువుతున్న సర్దార్ అనే విద్యార్థి జాతీయస్థాయి నెట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ మాధవి ఏటీపీ జ్యోతి పి ఈ టి అమీర్ సోమవారం తెలిపారు ఇటీవల నల్గొండలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికైనట్లు చెప్పారు.
మూడున సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్
కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో ఫిబ్రవరి మూడవ తేదీన 9వ జిల్లా స్థాయి సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించనున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జైపాల్ రెడ్డి డాక్టర్ అనిల్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు అండర్ 8,10 ,12,14సంవత్సరాల బాలబాలికలకు వేరువేరుగా పోటీల నిర్వహణ ఉంటుందని తెలిపారు

ఉమ్మడి జిల్లా అండర్ 17 బాల బాలికల విభాగాల్లో వెయిట్ లిఫ్టింగ్ ఎంపికలు ఈనెల 30న ఉదయం పదిగంటలకు నిజామాబాద్ డిఎస్ఏ ఈత కొలనులోని హాలులో నిర్వహిస్తామని ఎస్ జి ఎఫ్ కార్యదర్శి సంగీత్రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు బాలురకు 50 56 62 69 77 85 94 94 ఆపై కిలోల విభాగాల్లో బాలికలకు 44 48 53 58 63 69 69 ఆపై కిలోల విభాగాల్లో ఎంపికలు ఉంటాయని తెలిపారు.



 

దోమకొండలో సంకష్టహర చతుర్థి పూజలు

 దోమకొండ మండల కేంద్రంలోని చాముండేశ్వరి ఆలయంలో సోమవారం సంకష్టహర చతుర్థి సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వినాయకుడికి పూలతో అందంగా అలంకరించారు అనంతరం భక్తులు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి ముక్కులు చెల్లించుకున్నారు అనంతరం శావతీశారు కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు పాలకుర్తి శేఖర్ తో పాటు పూజారి శరత్చంద్ర భక్తులు పాల్గొన్నారు




ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ నిజామాబాద్ 2024

 నిజామాబాద్ ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ 2024 జిల్లా అధ్యక్షులు సిహెచ్ సుకున్ ప్రధాన కార్యదర్శి ఎల్ శ్రీధర్ కార్యదర్శిలు కే నర్సింహారావు ఎం మల్లేశం అశోక్ యాదవ్ ఎం మురళి  రవీంద్రారెడ్డి సుభాష్ రెడ్డి



డిడిఎన్ అర్చక జిల్లా అధ్యక్షుడిగా యోగేష్ శర్మ

 ధూప దీప నైవేద్య అర్చక నిర్మల్ జిల్లా అసోసియేషన్ 2024


ధూప దీప నైవేద్య అర్చక జిల్లా అధ్యక్షుడిగా యోగేష్ శర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆదివారం నిర్మం నిర్మల్ పట్టణంలోని దేవరకోట శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో రాష్ట్ర నాయకులు ఎన్నికల పరిశీలకుల ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించి ఏకగ్రీవంగా జిల్లా కమిటీని ఎన్నుకున్నారు జిల్లా ప్రధాన కార్యదర్శిగా జిల్లా గౌరవాధ్యక్షులు సిరిగే నరేష్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా జంగం లక్ష్మణప్ప జిల్లా అధికార ప్రతినిధిగా కులకరిని సంతోష్ ఉపాధ్యక్షుడిగా దేవ్ అర్జున్ జంగం మహంతి రాజేశ్వర్ సహాయ కార్యదర్శిగా జంగం మహేష్ కోశాధికారులుగా విజయకుమార్ జంగం విశాల్ ప్రచార కార్యదర్శిగా నరసింహస్వామి సోషల్ మీడియా కన్వీనర్ గా ప్రశాంత్ కుమార్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షునిగా ఎన్నికైన యోగేష్ మాట్లాడుతూ సంఘ బలోపేతానికి కృషి చేస్తానని అర్చకుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర నాయకత్వంతో కలసి పోరాడుతామని తెలిపారు