TEMPLES లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
TEMPLES లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, మార్చి 2024, బుధవారం

16 నుంచి మల్లికార్జున స్వామి ఉత్సవాలు

 దోమకొండ మండల కేంద్రంలోని మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం 16 నుంచి 18 వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు మంగళవారం తెలిపారు 16న శనివారం సాయంత్రం ఐదు గంటలకు గంగ భవనం 17న ఆదివారం రాత్రి మంద గంపలతో ఊరేగింపు 18న సోమవారం శ్రీ మల్లన్న స్వామి గొల్ల కేతమ్మ మేడాలమ్మల కళ్యాణం రేణుక ఎల్లమ్మ మునిరాజుల కళ్యాణం మధ్యాహ్నం అన్నదానం అనంతరం అగ్నిగుండాల కార్యక్రమం ఉంటుందని తెలిపారు కార్యక్రమంలో నేత్ర నాగరాజు యాదవ్ కట్ట లక్ష్మణ్ యాదవ్ సిరబోయిన ప్రవీణ్ యాదవ్ గొర్ల రమేష్ యాదవ్ ఎల్లయ్య యాదవ్ రమేష్ యాదవ్ లింగం యాదవ్ పరిసరం యాదవ్ తదితరులు పాల్గొన్నారు

10, మార్చి 2024, ఆదివారం

ఘనంగా రథోత్సవం

 దోమకొండ మండల కేంద్రంలోని శివరామ మందిరంలో శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట నుంచి మూడు గంటల వరకు ఉమామహేశ్వరులు సీతారాముల రథాలతో శోభాయాత్ర నిర్వహించారు భక్తులు వ్రతాలను బస్టాండ్ వరకు లాగారు అనంతరం మహారాష్ట్ర బృందం లంకా దహనం కార్యక్రమాన్ని నిర్వహించింది దోమకొండ తో పాటు చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన వేలాదిమంది ప్రజలు ఈ కార్యక్రమాన్ని తిలకించారు ఉత్సవాల ముగింపు సందర్భంగా శనివారం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు ఆలయ కమిటీ అధ్యక్షుడు అభ్రమైన రాజు డైరెక్టర్లు చెన్నం రవి బత్తిని సిద్ధరాములు అర్చకులు భవి కృష్ణమూర్తి శర్మ జన్మంచి రామకృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు



6, మార్చి 2022, ఆదివారం

శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం

దోమకొండ లోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈనెల 5 6 7 తేదీలలో శ్రీ మల్లికార్జున స్వామి  కల్యాణ మహోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ కమిటీ ,
యాదవ సంఘం, దోమకొండ.