దేశవ్యాప్తంగా ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాల కోసం కేంద్ర తపాలా శాఖ ఆధ్వర్యంలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆర్థిక సాధికారత కల్పించడానికి ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ఎండి సీఈఓ విశ్వేశ్వరన్ ప్రకటించారు. ఈ ఖాతాలలో కనీస ప్రాథమిక డిపాజిట్ అవసరం లేదు. నెలవారి సగటు బ్యాలెన్స్ కూడా నిర్వహించాల్సిన అవసరం ఉండదు. గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు బ్యాలెన్స్ ఉంచుకోవచ్చు. ఆ మొత్తానికి అమల్లో ఉన్న సేవింగ్స్ రేట్స్ ప్రకారం మూడు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. నగదు డిపాజిట్, ఉపసంహరణకు ఎలాంటి చార్జీలు ఉండవు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి