SPIRITUAL NEWS లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
SPIRITUAL NEWS లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, ఫిబ్రవరి 2026, మంగళవారం

శివరాత్రి మహోత్సవాలు ,దోమకొండ 2026

 



శ్రీ శివరామ మందిరము ,గ్రామము మరియు మండలము దోమకొండ,

 కామారెడ్డి జిల్లా, 

శివరాత్రి బ్రహ్మోత్సవాలు మరియు శ్రీ గంగా అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి కళ్యాణ రథోత్సవ సమాహ్వా న పత్రిక .



శివరాత్రి బ్రహ్మోత్సవాలు 

స్వస్తిశ్రీ విశ్వవస్తునామ సంవత్సర మాఘ బహుళదశమి తేదీ 12 ఫిబ్రవరి 2026 గురువారం నుండి  మాఘ బహుళ అమావాస్య తేదీ 16 ఫిబ్రవరి 2026 సోమవారం వరకు

 శ్రీ గంగా అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి కళణోత్సవము మరియు రథోత్సవ పంచాహ్నిక కార్యక్రమములు అత్యంత వైభవంగా జరుగును.

ముఖ్య అతిథులు ..గౌరవనీయులు శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు, శాసనసభ్యులు, కామారెడ్డి నియోజకవర్గం.

 గౌరవ అతిథులు.. గౌరవనీయులు శ్రీ మహమ్మద్ షబ్బీర్ అలీ గారు ,రాష్ట్ర ఎస్టీ ,ఎస్సీ, బీసీ, మైనారిటీ శాఖల ప్రభుత్వ సలహాదారులు.

 అతిథులు ..గౌరవనీయులు శ్రీ సురేష్ షెట్కర్ గారు, పార్లమెంటు సభ్యులు ,జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం, 

 శ్రీ ఐరేని నరసయ్య గారు ,సర్పంచ్ దోమకొండ.

 శ్రీ బొమ్మెర శ్రీనివాస్ గారు ,ఉప సర్పంచ్ దోమకొండ.

 శ్రీ కదిరే గోపాల్ రెడ్డి గారు, ఏఎంసీ డైరెక్టర్.

 సర్వ శ్రీ వార్డు సభ్యులు, జిపి దోమకొండ.

 ధర్మకర్తలు..

 నగరం నరసింహులు, నాయిని లింగారెడ్డి, చింతల చిరంజీవి, చెన్నం స్వాతి శేఖర్.

 దేవాలయ మాజీ చైర్మన్ లు.. 

శ్రీ కర్రోల్ల భీమా గౌడ్, శ్రీ చెన్నం లక్ష్మీకాంతం, శ్రీ తోట శేఖరయ్య, శ్రీ అబ్రబోయిన యాదగిరి ,శ్రీ ఐరేని నరసయ్య, శ్రీమతి దీకొండ శారద ,శ్రీ పెద్దిరెడ్డి నారాయణరెడ్డి, అబ్రబోయిన రాజేందర్.

 భక్తులు మరియు గ్రామ ప్రజలు. దోమకొండ

 శ్రీ కొండ అంజయ్య, చైర్మన్.



 కార్యక్రమ వివరాలు ..

12-2-2026 గురువారం రోజున..

 ఉదయము 10 గంటల 15 నిమిషాల నుండి ప్రదోష పూజ, గణపతి పూజ ,పుణ్యహవచనము, అఖండ దీపారాధన, రుత్విక్ వరణము, హారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వినియోగము, శేష సాయిపై స్వామివారి ఊరేగింపు.

 13 -2-2026 శుక్రవారం రోజున ..

ఉదయం నుండి ప్రాతఃకాల పూజ , మాతృకా యోగిని, వాస్తు ,క్షేత్రపాలక ,నవగ్రహ మండల స్థాపనలు, అగ్ని ప్రతిష్ట, స్థాపిత దేవత హవనములు, రుద్రహవనము, ధ్వ జారోహణము , భేరీ పూజ, బలిహరణ ,సాయంత్రం నంది వాహన ఊరేగింపు .

14వ తేదీ శనివారం రోజున..

 స్థాపిత దేవతాహనము, పూజలు, రుద్రహవనము,శేషసాయిపై స్వామివారి ఊరేగింపు.

 15వ తేదీ ఆదివారం రోజున..

 ప్రాతఃకాల పూజ ,భక్తుల అభిషేకములు, ఎదుర్కొల్లు, గంగా అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవము.



అశ్వవాహనముప  స్వామివారి ఊరేగింపు.

 రాత్రి ఒంటిగంట పది నిమిషాలకు నిశి పూజ, దిష్టికుంభాలు ,స్వామివారి రథారోహణ గంగా అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ,శ్రీ సీతారామచంద్ర స్వామివార్లు రథములపై స్థానిక ప్రయాణ ప్రాంగణం వద్దకు బయలుదేరుట .తదనంతరము లంకా దహనం అనంతరం రథములు ఆలయం ప్రవేశించుట .

తేదీ 16 ఫిబ్రవరి సోమవారం రోజున..

 ఉదయం నుండి చక్రతీర్థం, నాకబలి, ఆవబృద స్నానం, పూర్ణాహుతి మొదలవు కార్యక్రమాలు జరుగును. కావున భక్తాగ్రేసరులు పై కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు.



 శ్రీ బావి కృష్ణమూర్తి శర్మ ,యాగ్నికులు.. శ్రీ జనమంచి రామకృష్ణ శర్మ, ఆలయ పూజారి. శ్రీ జన మంచి వసంత్ శర్మ ,రుత్వికులు. శ్రీ భావి శరత్చంద్ర శర్మ, రుత్వికులు.

 శ్రీ వి విజయరామరావు, సహాయ కమిషనర్, దేవాదాయ శాఖ.

 శ్రీ కొండ అంజయ్య ,దేవాలయ కమిటీ చైర్మన్ 9701 744 251 

శ్రీ బూర్ల ప్రభు, కార్యనిర్వాహణాధికారి.

29, మార్చి 2024, శుక్రవారం

ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

 కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గుడి ప్రయోగాన్ని శుక్రవారం క్రైస్తవులు ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు పాస్టర్లు ఏసు బోధనలను వినిపించారు బైబిల్ పట్టణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు మందిరంలో ఏలీషా మహమ్మద్ నగర్ లోని సంజీవ్ శాంసన్ మాజీ అచ్చంపేట కోమలంచ మల్లూరు వడ్డేపల్లి హెడ్స్ గ్రామాల్లో ప్రత్యేక ప్రార్థనలు బైబిల్ పట్టణం కొనసాగాయి ఇస్లాంలోని సీఎస్ఐ చర్చలు ఫాదర్ రెవరెండ్ జయరాజ్ గుడ్ ఫ్రైడే ప్రాధాన్యతను క్రైస్తవులకు వివరించారు చర్చి కమిటీ సభ్యులు దేవదాస్ రాజు దీన్ దయాల్ భారతమ్మ రేఖ సురేష్ తదితరులు పాల్గొన్నారు

డోంగ్లి లో పాస్టర్ ప్రకాష్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలు నిర్వహించారు ఎల్లారెడ్డి లోని సైట్ అడ్రస్ చర్చిలో ఫాదర్ రివర్ అండ్ ప్రభాకర్ గుడ్ ఫ్రైడే పర్వదినం విశేషాలను వివరించారు సాయంత్రం భోజనాలు ఏర్పాటు చేశారు కార్యక్రమంలో సంఘ సభ్యులు ప్రభు కుమార్ స్వామి దాస్ మంత్రి సాల్మన్ రాజు మెరిసి మాలిని వాసంతి తదితరులు పాల్గొన్నారు దోమకొండ తో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో చర్చిల్లో శుక్రవారం గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు సంగమేశ్వర్ లోని జిఎఫ్ఎం ప్రేయర్ హాల్లో రెవరెండ్ శాప శ్రీనివాస్ ప్రత్యేక సందేశాన్ని అందించారు కార్యక్రమంలో పవిత్ర అజ్ఞాన్ కుమార్ రాజకుమార్ మోహన్ రెడ్డి కమలా మరియమ్మ రాజు రెబిక రాజయ్య పున్నమ్మ జ్యోతి భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు


28, మార్చి 2024, గురువారం

రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు

 ముస్తాబైన ఇందూరు తిరుమల ఏప్రిల్ 2న శ్రీవారి కల్యాణ మహోత్సవం

నిజామాబాద్ రూరల్ మండలంలోని మోపాల్ మండలంలోని నర్సింగ్ పల్లి లో ఉన్న హిందువులు తిరుమల గోవింద వనమాల క్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబయింది దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభమై ఏప్రిల్ 5 వరకు కొనసాగలు ఉన్నాయి ప్రతి ఏడాది నిర్వహించే బ్రహ్మోత్సవాలలో సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ఏప్రిల్ 2 నా స్వామివారి కల్యాణోత్సవం ఉత్సవ మూర్తులతో పురవీధులలో గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు 5వ తేదీన బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి మా పల్లె చారిటబుల్ ట్రస్ట్ ఆలయ ప్రధాన ధర్మకర్తలు ప్రముఖ నిర్మాత దిల్ రాజు శిరీష్ నర్సింహారెడ్డి విజయసింహారెడ్డి హరీష్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు నిత్యం సినిమా షెడ్యూల్లో బిజీగా ఉండే దిల్ రాజు తన కుటుంబ సభ్యులతో బ్రహ్మోత్సవాల సందర్భంగా వారం రోజులపాటు స్వామి వారి సన్నిధిలో సేవ చేసుకుంటారు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని ఆలయ ప్రధాన ధర్మకర్తలు పేర్కొన్నారు భక్తులు సపరివార సమేతంగా బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు



27, మార్చి 2024, బుధవారం

ఆధ్యాత్మిక సమాచారం 27 మార్చి 24

 హనుమాన్ ఆలయానికి విరాళం అందజేత

పిట్ల మండలంలోని అల్లాపూర్ గ్రామ హనుమాన్ ఆలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో గ్రామానికి చెందిన హనుమాన్ సైన్యం ఆధ్వర్యంలో 21 వేల విలువ గల జ్యోతి దీపారాధన హుండీని ఆలయ నిర్వాహకులకు విరాళంగా అందజేశారు అంతకుముందు హనుమాన్ సైన్యం సభ్యులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో హనుమాన్ సైన్యం అధ్యక్షుడు పరువయ్య ఉపాధ్యక్షుడు సాయి సుధీర్ ప్రధాన కార్యదర్శి విటల్ కోశాధికారి శంకర్ సభ్యులు సాయి రెడ్డి సురేంద్రరావు బాలాజీ రావు సాయిరాం సంతోష్ రెడ్డి మహిపాల్ రెడ్డి కాంతరెడ్డి హనుమంత్ రెడ్డి మల్లుగొండ బసేందర్ పండరి రావు తదితరులు పాల్గొన్నారు

30 నుంచి సిద్ధ రామేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

దక్షిణ కాశీగా పేరుందిన బిక్కనూరు సిద్ధరామేశ్వర ఆలయంలోని స్వామివారి బ్రహ్మోత్సవాలను ఈనెల 30 నుంచి ఏప్రిల్ 3 వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఉత్సవ కమిటీ పునర్నిర్మాణ కమిటీ ప్రతినిధులు మంగళవారం తెలిపారు ఈ సందర్భంగా వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు కామారెడ్డి బస్టాండ్ నుంచి ప్రతి గంటకు ఆర్టిసి బస్సులు ఆలయానికి వస్తాయన్నారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరారు

మైలారం గ్రామంలో గల కొచ్చేరి మైసమ్మ ఆలయంలో మంగళవారం భక్తుల సందడి నెలకొన్నది ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారికి భక్తులు కొబ్బరికాయలు కొట్టినవేద్యాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు

పెద్దకూడాప్గల్ మండల కేంద్రంలోని పాప హరేశ్వర ఆలయంలో పురోహితులు శ్రీపతిరావు పంతులు ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీపతిరావు మాట్లాడుతూ శిఖర ప్రతిష్టాపనలో భాగంగా గోవు పూజ అగ్ని ప్రతిష్ట తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించమని చెప్పారు బుధవారం జరగబోయే కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై విజయవంతం చేయాలని కోరారు





హనుమాన్ సైన్యం సామాగ్రి అందజేత

 పిట్ల మండలంలోని అల్లాపూర్ హనుమాన్ ఆలయానికి గ్రామానికి చెందిన హనుమాన్ సైన్యం సంఘ సభ్యులు మంగళవారం 21 వేల రూపాయల విలువ చేసి జ్యోతి హుండీ ఇతర సామాగ్రిని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయం చేశామని చెప్పారు కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పరువయ్య ఉపాధ్యక్షుడు సాయి సుధీర్ ప్రధాన కార్యదర్శి విఠల కోశాధికారి శంకర్ సభ్యులు సాయి రెడ్డి సురేందర్రావు బాలాజీ రావు సాయిరాం సంతోష్ రెడ్డి మైపాల్ రెడ్డి కాంత్ రెడ్డి హనుమంత్ రెడ్డి మలిగొండ బసేందర్ పండరి రావు తదితరులు పాల్గొన్నార



27 నుంచి అఖండ హరినామ సప్తాహం

 పాత బాన్సువాడ శాంతినగర్ కాలనీలోని రుక్మిణి సమేత పాండురంగ స్వామి ఆలయంలో ఈనెల 27 నుంచి ఏడు రోజుల పాటు అఖండ హరినామ సప్తాహం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని భక్తులందరూ అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు

నీలకంఠుడి రథం కోసం సంప్రదించండి

 నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వరాలయంలో ప్రతి రథసప్తమికి స్వామివారి ఉత్సవమూర్తులను తల్లి గోరి వద్దకు ఊరేగిస్తారు సుమారు వందేళ్ళ క్రితం రూపొందించిన రథం శోభాయాత్రకు అనుకూలంగా లేకపోవడంతో మరమ్మతులు చేయించారు 50 లక్షల రూపాయలతో నూతన రథం తయారు చేయించారు ఇకపై ఇదే ఊరేగింపు కోసం ఉపయోగించనున్నారు దీనితో పురాతన రథం ఆలయ ప్రాంగణంలో వృధాగా ఉంది ఆలయ ప్రాంగణంలో బయట అలాగే ఉంచారు. ఇంకొన్నాళ్ళు వినియోగించే అవకాశం ఉన్న దాతలు ముందుకు రావడంతో కొత్తది తయారు చేయించామని ఈవో వేణు చెప్పారు జిల్లాలో ఇతర ఆలయాలకు చెందిన వారు తమకు రథం కావాలంటే ఈవో కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు



రంగులు లేవు టమాటాలే

 హోలీ పండుగను పురస్కరించుకొని హనుమకొండలోని ఒక పాఠశాల రంగులు కాకుండా ₹3,000 పెట్టి మార్కెట్లో మూడు క్వింటాల టమాటాలు కొనుగోలు చేసింది వాటిని కోమటిపల్లి ప్రాంతంలోని నిరూప నగర్ లో ఇలా కుప్పగా పోయడంతో ఒకరిపై ఒకరు విసురుకుంటూ పిల్లలు హోలీ చేసుకున్నారు



26, మార్చి 2024, మంగళవారం

విశ్వేశ్వర స్వామి ఆలయ కమిటీ కార్యవర్గం ఎన్నిక

 సదాశివ నగర్ మండల కేంద్రంలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆలయ కమిటీ అధ్యక్షుడిగా జోగిని రాజయ్య ట్రాక్టర్ కార్యదర్శిగా న్యాయని నడిపి గంగయ్య కోశాధికారిగా బద్దం రాజిరెడ్డి కార్యవర్గ సభ్యులుగా వడ్ల బాలరాజ్ నల్ల బాయికాడి సాయి రెడ్డి కుమ్మరి రాజయ్య రాజేందర్ నల్ల వెంకటరెడ్డి జనగామ రామ్రెడ్డి సాకలి పున్నమి రాజయ్య తడిగం రాజేందర్ గదారి లచ్చిరెడ్డి తాడ్వాయి నారాయణ తదితరులను ఎన్నుకున్నారు మాజీ సర్పంచ్ బద్దం శ్రీనివాస్ రెడ్డి మాజీ ఉపసర్పంచ్ వంకాయల రవి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కొప్పుల నరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు



ఆధ్యాత్మిక సమాచారం 26 మార్చి 2024

 ఘనంగా మల్లన్న కళ్యాణం లింగంపేట మండలం భవానిపేటలో సోమవారం మల్లికార్జున స్వామి కళ్యాణం యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ప్రత్యేక హోలీ పండుగ సందర్భంగా కేతమ్మ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరిపించారు ఈ సందర్భంగా భక్తులు అగ్నిగుండాల మీదుగా మల్లన్న దేవుని నామస్మరణ చేసుకుంటూ నడిచారు అనంతరం అన్నదానం చేశారు అలాగే ఒగ్గు కళాకారులతో కళాజాత కార్యక్రమం నిర్వహించారు

హోలీ మదన పున్నమి సందర్భంగా సోమవారం కామారెడ్డి లోని స్థానిక హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శారద ఆదిశంకర ఆలయంలో భక్తిశ్రద్ధలతో నవదుర్గ సామూహిక వ్రతం నిర్వహించారు గతంలో పాల్గొన్న మహిళలకు ఆలయ కమిటీ తరఫున పూజా సామాగ్రి అందజేశారు అన్నదానం చేశారు

చండీ మంత్రాలయంలో స్థానిక శ్రీనివాస్ నగర్ ని శ్రీ చండీ మంత్రాలయంలో మదన పున్నమి సందర్భంగా చండీ హోమం నిర్వహించారు అమ్మవారికి విశేష పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు




రాజంపేట సాయిబాబా ఆలయంలో సోమవారం అన్నదానం నిర్వహించారు ప్రతి నెల పౌర్ణమి రోజున ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు అనే కమిటీ సభ్యులు తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చిన్న సీతారాములు బంధం కృష్ణమూర్తి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఘనంగా హోలీ రంగుల కెళ్ళి హోలీ పర్వదినాన్ని జిల్లా ప్రజల సోమవారం ఘనంగా జరుపుకున్నారు రంగులు చదువుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు


గ్రామాల్లో కుస్తీ పోటీలు
జిల్లాలోని పలు గ్రామాలలో హోలీ సందర్భంగా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలను సోమవారం నిర్వహించారు నందిపేట మండలంలోని కంఠంలో కుస్తీ పోటీలు రసవాతారంగా జరిగాయి జిల్లా నుంచి కాకుండా మహారాష్ట్ర నుంచి మల్ల యోధులు కుస్తీ పోటీలకు అధిక సంఖ్యలో తరలివచ్చారు కుస్తీ పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చారు గ్రామ పెద్దలు విజేతలకు నగదు బహుమతి అందజేశారు ప్రతి ఏడాది హోలీ రోజున కుస్తీ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని గ్రామస్తులు తెలిపారు






25, మార్చి 2024, సోమవారం

ఉత్సాహంగా గాంధారి మండల కేంద్రంలో లెహంగి వేడుకలు

 గాంధారి మండల కేంద్రంలోని సేవాలాల్ ఆలయ ఆవరణలో ఆదివారం లెహంగి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా బంజారాలను నృత్యాలు అలరించాయి స్థానిక రైల్వే ఉద్యోగి లచ్చునాయక్ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యుడు శంకర నాయక్ ఎంపీపీ రాధా ఎస్సై ఆంజనేయులు కమిటీ అధ్యక్షుడు మోతీరామ్ తదితరులు పాల్గొన్నారు



26 నుంచి వెంకటేశ్వర ఆలయ వార్షికోత్సవాలు

 బాన్సువాడ పట్టణంలోని వెంకటేశ్వర ఆలయ వార్షికోత్సవ వేడుకలను నాలుగు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు అల్లి కృష్ణ తెలిపారు ఈనెల 26 నుంచి 29వ తేదీ వరకు ఉత్సవాలు ఉంటాయని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వెంకటేశ్వరుని ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు

రెండువేల కిలోల ద్రాక్షతో గణేశుడు ఆలయం ముస్తాబు

 మహారాష్ట్రలోని పూణేలు ప్రసిద్ధిగాంచిన దగడు సేటు వినాయక ఆలయం హోలీ సందర్భంగా ద్రాక్ష పనులతో ముస్తాబయింది సుమారు రెండువేల కిలోల నలుపు ఆకుపచ్చని ద్రాక్షలతో ఆదివారం ఆలయ ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దారు సంకటహర చతుర్థి రోజున ద్రాక్ష మహోత్సవం వైభవంగా జరుపుకుంటారు గణపతి వద్ద ఉంచిన పండ్లను భక్తులు పలు సంస్థలతో పాటు ససుమూన్ దవాఖాన పితాశ్రీ వృద్ధాశ్రమాలకు పంపిణీ చేస్తామని నిర్వాహకులు తెలిపారు

హనుమాన్ దీక్షను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలి

 


హనుమాన్ దీక్షను తీసుకున్న స్వాములు భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని తోపుట పీఠాధిపతి స్వామి మాధవానంద అన్నారు మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయం ఆయన సందర్శించారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు హనుమాన్ స్వాములను ఉద్దేశించి మాట్లాడారు ప్రతి ఏడాది వేసవికాలంలో హనుమాన్ దీక్ష తీసుకున్న వారు అభివృద్ధి చెందుతారన్నారు దీక్ష తీసుకున్న వారికి ఆశీర్వాదం అందజేశారు




మద్నూర్ మండలంలోని శాఖాపూర్ గేటు వద్ద మైనారిటీలు హనుమాన్ స్వాములకు పండ్లను పంపిణీ చేశారు జుక్కల్ మండలం తిమ్మరాజు కల్లాలి నుంచి మద్నూర్ మండలం సలాబత్ కు ఆంజనేయస్వామి ఆలయానికి పాదయాత్రగా వస్తున్న స్వాములకు కాంగ్రెస్ యువ నాయకులు అజీమ్ పటేల్ ఆధ్వర్యంలో అల్పాహారం కింద పండ్లను పంపిణీ చేశారు దేశ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పడానికి మైనారిటీ సోదరులు హిందూ ముస్లింలు భాయి భాయిగా కొనసాగాలన్నారు మాజీ సర్పంచ్ రమేష్ దేశాయి హనుమాన్ స్వాములకు పంటను పంపిణీ చేసిన మైనారిటీలకు కృతజ్ఞతలు తెలిపారు

నియమ నిష్ఠలతో కొనసాగుతున్న రంజాన్ ఉపవాస దీక్షలు

 


ముస్లింల పవిత్ర మాసం రంజాన్ మాసంలో చేపట్టే ఉపవాస దీక్షలు నియమా నిష్టల మధ్య కొనసాగుతున్నాయి ఈనెల 12 నుంచి ప్రారంభమైన ఈ ఉపవాస దీక్షలు ఏప్రిల్ 10 రాత్రికి ముగుస్తాయి శవ్వాళ మాసం చంద్ర దర్శనంతో ఏప్రిల్ 11న ముస్లింలు రంజాన్ ఈద్-ఉల్-ఫితర్ పర్వదినాన్ని జరుపుకోవాలని సన్నద్ధమవుతున్నారు. ఈ మాసంలోనే దివ్య ఖురాన్ ముస్లింల పవిత్ర గ్రంథం దివి నుంచి భూమికి పంపబడిందిగా విశ్వసిస్తూ అత్యంత పవిత్ర రాత్రిగా కొలిచే షబ్బీ ఖద్రి జాగరణ రాత్రిని అత్యంత భక్తిశ్రద్ధలతో దైవారాధనలో గడుపుతారు రంజాన్ ప్రారంభంలో మొదలుపెట్టిన తరావీ నమాజులు దివ్య ఖురాన్ పట్టణం రాత్రి నమాజ్తో ముగిసింది రంజాన్ మాసంలో అన్ని రాత్రుల కన్నా ఈ రాత్రిని శుభాల రాత్రిగా పరిగణిస్తారు రంజాన్ మాసం ఆరంభం నుండి చిన్న పెద్దల నమాజులతో మసీదులు ముస్లింల ఇల్లు దైవారాధనలతో కలకలలాడుతాయి రంజాన్ మాసంలో ముస్లింలు పరస్పర ఇఫ్తార్ విందులలో పాల్గొంటున్నారు. కాగా ఎన్నికల కూడా అమలు ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఇఫ్తార్ విందు ఈసారి లేనట్టుగానే కనిపిస్తుంది. ఈ దఫా ఎండలు దంచి కొట్టడంతో కొంతమేర ఇబ్బందులు తప్పడం లేదు అయినా దీక్షపరులు దైవారాధనలు ఉత్సాహంగా ఈ ఉపవాస దీక్షలో పాల్గొనడం గమనార్హం


భక్తిశ్రద్ధలతో కామ దహనం

 జిల్లా ప్రజలు ఆదివారం రాత్రి భక్తిశ్రద్ధలతో కామ దహనం నిర్వహించారు నీటితో నిండిన బిందెలతో మహిళలు కామెడీకి నీళ్లు పోసి భక్తీశ్రద్ధలతో కామ దహనం నిర్వహించారు హోలీ పండుగను పురస్కరించుకొని రంగులు చల్లుకునే ఒకరోజు ముందు రాత్రి కామ దహనం జరపడం మానవాహితీ కామారెడ్డి బాన్సువాడ ఎల్లారెడ్డి తదితర ప్రాంతాలు కామ దహనం నిర్వహించారు మద్నూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ ఎల్లమ్మ తల్లి తులా వారి గల్లీలతో పాటు ఆయా కాలనీలో కామ దహనం చేశారు ఆనవాయితీగా వస్తున్న కామదానం కోసం పిడకలు కట్టెలు పొగ చేసి కుప్పగా పోస్తారు పౌర్ణమి రోజు అర్ధరాత్రి ఆ కుప్పకు మహిళలు పూజలు నిర్వహించి బోనాలు సమర్పించి మంట పెట్టారు. మానవులు ఇంద్రయాలను నియంత్రించడానికి కామన్కి దహనం చేస్తారని నీతి బోధిస్తోంది అందుకే గ్రామంలో పెద్దలు పిల్లలు కామన్ కి పూజించి కామ దహనం తర్వాత మిగిలిన బూడిదని తీసుకెళ్లి తమలో ఉన్న అహంకారం కాముని లాగా కాల్చివేసి మానవ జన్మ సార్థకం చేసుకున్నారు కామ దహనం అయిన తెల్లారి రంగుల ఆట ఆడుకోవడం జరుగుతుంది గతంలో రంగులను వసంత రుతువులలో చెట్లు చెదిరించే వాటి ద్వారా తయారు చేసే రంగులు చల్లుకునేవారు ఇప్పట్లో రసాయనాలతో తయారైన రంగులను వాడి ఆరోగ్యానికి హాని చేసుకుంటున్నారు 

కొబ్బరి పేర్లు చక్కర పేర్లు ఈ పండుగ ప్రత్యేక

 హోలీ పండుగలు ముఖ్యమైనవి కొబ్బరి పేర్లు చక్కర పేర్లు తమ ఆడపడుచులకు హోలీ పండుగ నుంచి ఉగాది పండుగ వరకు కొబ్బరితో తయారుచేసిన పేర్లు చక్కెర పేర్లు అందచేస్తుంటారు హోలీ పండుగ రోజు బోనాలకు ఈ పేర్లు వేసి వాటిని తమ పిల్లలకు వేస్తుంటారు ఈ ఆచారం మహారాష్ట్ర సరిహద్దు మండలాలైన మద్నూర్ బిచ్కుంద జుక్కల్ మండలాల్లో అధికంగా ఉంటుంది తమ ఆడపడుచులకు నాగపంచమికి బట్టలు రక్షాబంధన్ కు కానుకలు ఇస్తున్న విధంగానే హోలీ పండుగకు కొబ్బరి పేర్లు చక్కర పేర్లు ఇచ్చి దీవెనలు తీసుకుంటారు



మక్కా మసీదులో ప్రతిరోజు 1500 మందికి ఇస్తారు విందు

 రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని చారిత్రక మక్కా మసీదులు మజిలీ శాసనసభ పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు రంజాన్ పండుగ వరకు 1500 మందికి ఇఫ్తార్ ఏర్పాట్లు ఉంటాయని అక్బరుద్దీన్ తనయుడు నూరుద్దీన్ ఓవైసీ ప్రకటించారు ఆదివారం నుంచి ప్రారంభమైన ఇఫ్తార్ కార్యక్రమాలు సాలారే మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ హబీబీఏ మిల్లర్ పొలిటికల్ రీసర్చ్ సెంటర్ల సంయుక్త ఆధ్వర్యంలో కొనసాగుతాయి అన్నారు ప్రతిరోజు మక్కా మసీదుకు హాజరయ్యే స్థానికులు వ్యాపారులు కొనుగోలుదారులు ఇఫ్తార్ విందు చేసుకోవాలని సదుద్దేశంతో ఏర్పాటు చేసినట్లు నూరుద్దీన్ తెలిపారు తన తండ్రి అక్బరుద్దీన్ ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేయాలని ఆయన కోరారు

ఆన్లైన్లో రామయ్య కళ్యాణం టికెట్లు

 భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఏప్రిల్ 17న జరగనున్న రామయ్య కళ్యాణం శ్రీరామనవమి 18న స్వామివారి మహా పట్టాభిషేకం కార్యక్రమాలకు సెక్టార్ టికెట్లను ఆన్లైన్ ద్వారా భక్తులు పొందే అవకాశం కల్పించినట్లు ఈవో రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు కళ్యాణ మహోత్సవానికి 7500 దంపతులు 2500 2000 1000 300 150 పట్టాభిషేకం టికెట్లు 1500 500 రూపాయలుగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు

భక్తులు భద్రాద్రి దేవస్థానం వెబ్ సైట్ https://bhadradritemple.Telangana.gov.in ద్వారా సోమవారం నుంచి బుక్ చేసుకోవచ్చని వివరించారు దేవస్థానంలో నేరుగా టికెట్లు పొందాలని భక్తులకు ఆలయం వద్ద తాళించా కళ్యాణ మండపం బ్రిడ్జి పాయింట్ సి ఆర్ వో కార్యాలయం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు భక్తులు గుర్తింపు కార్డు సిబ్బందికి చూపించి టికెట్లు పొందవచ్చు అని ఈవో సూచించారు

ఆధ్యాత్మిక సమాచారం 25 మార్చి 2024

 నిజాంసాగర్ మండలంలోని మల్లూరు గ్రామంలో ఈనెల 21న ప్రారంభమైన అఖండ హరినామ సప్తహం కొనసాగుతోంది నాలుగో రోజు ఆదివారం కార్యక్రమంలో భాగంగా దోండిబా మహారాజ్ ప్రవచనాలు కొనసాగాయి ఈనెల 25న కామాప్ప మహారాజు భరంగడి 26న వామన్ రావు మహారాజ్ కమలాపూర్ 27న పోచయ్య మహారాజు రాంపూర్ 28న వెంకట్రావు దేశాయి మహారాజ్ తెగులు వాడి ప్రవచనాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు గాత భజన సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు ప్రవచనం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు హరి పార్ట్ రాత్రి 9 నుంచి 11 గంటల వరకు హరి కీర్తన రాత్రి 12 నుంచి వేకువజామున 4 గంటల వరకు హరి జాగరణ ఉదయం నాలుగు నుంచి ఆరు గంటల వరకు కాకడ హారతి ఉంటాయని తెలిపారు

తిరుపతిలో భజన కీర్తనలు

సదాశివ్ నగర్ మండలంలోని కుప్పర్యాలలోని కాలభైరవ భజన మండలి సభ్యులు తిరుపతిలో జరిగిన అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమంలో భాగంగా భజన కీర్తనలు ఆలపించారు రెండు రోజులపాటు కొనసాగిన భజన కార్యక్రమంలో టిటిడి ఆధ్వర్యంలో ఉచిత భోజన వసతి కల్పించినట్లు భజన మండల అధ్యక్షుడు బాలయ్య తెలిపారు

సదాశివ నగర్ మండలంలోని బొంపల్లి గ్రామ స్టేజీ వద్ద అంబరేషన్ గుట్టపై ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి గర్వగుడితో పాటు ఆలయ ప్రకారం పూర్తిగా రాతితో చేపడుతున్నారు నిర్మాణ పనులు వచ్చినట్లు అలై కమిటీ చైర్మన్ రాజిరెడ్డి తెలిపారు దాతల నుంచి విరాళాలు సేకరించి నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు

హనుమాన్ స్వాములకు ఆదివారం కాంగ్రెస్ పార్టీ ముస్లిం నాయకుడు మహమ్మద్ అజీమ్ పాషా పండ్లు పంపిణీ చేశారు జుక్కల్ మండలంలో కెమ్రాజ్ కల్లాలి కి చెందిన హనుమాన్ స్వాములు భక్తులు మద్దనూర్ మండలం మీర్జాపూర్ హనుమాన్ మందిరానికి పాదయాత్రతో బయలుదేరారు స్వాములకు శాఖాపూర్ గేటు వద్ద శాఖాపూర్ ముస్లింలు భక్తులకు పండ్లు పంపిణీ చేశారు అనంతరం స్వాములకు సన్మానించారు కల్లాలి మాజీ సర్పంచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు



మద్నూర్ మండలంలో లచ్చన్ గేటు వద్ద ఆదివారం హనుమాన్ స్వాములకు కాంగ్రెస్ మైనారిటీ నేత అజీమ్ పటేల్ పండ్లు పంపిణీ చేశారు



హనుమాన్ స్వాముల పాదయాత్ర జుక్కల్ మండలంలోని కేమ్రాజు కల్లాలి గ్రామ అనుమానాలయం నుంచి ఆదివారం స్వాములు భక్తులు మిర్జాపూర్ హనుమాన్ ఆలయానికి మహాపాదయాత్ర చేపట్టారు ఆంజనేయ స్వామి మాలలు ధరించిన స్వాములు ప్రత్యేక మీర్జాపూర్ హనుమాన్ ఆలయానికి పాదయాత్ర చేస్తున్నారు దిండి పాదయాత్రకు చుట్టుపక్క గ్రామాల హనుమాన్ స్వాములు  ప్రజలు మహిళలు తరలివచ్చి పాదయాత్రలో పాల్గొన్నారు కార్యక్రమంలో కేమ్రాజ్ కల్లాలి మాజీ సర్పంచ్ రమేష్ దేశాయ్ హనుమాన్ భక్తులు పాల్గొన్నారు