శ్రీ శివరామ మందిరము ,గ్రామము మరియు మండలము దోమకొండ,
కామారెడ్డి జిల్లా,
శివరాత్రి బ్రహ్మోత్సవాలు మరియు శ్రీ గంగా అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి కళ్యాణ రథోత్సవ సమాహ్వా న పత్రిక .
శివరాత్రి బ్రహ్మోత్సవాలు
స్వస్తిశ్రీ విశ్వవస్తునామ సంవత్సర మాఘ బహుళదశమి తేదీ 12 ఫిబ్రవరి 2026 గురువారం నుండి మాఘ బహుళ అమావాస్య తేదీ 16 ఫిబ్రవరి 2026 సోమవారం వరకు
శ్రీ గంగా అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి కళణోత్సవము మరియు రథోత్సవ పంచాహ్నిక కార్యక్రమములు అత్యంత వైభవంగా జరుగును.
ముఖ్య అతిథులు ..గౌరవనీయులు శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు, శాసనసభ్యులు, కామారెడ్డి నియోజకవర్గం.
గౌరవ అతిథులు.. గౌరవనీయులు శ్రీ మహమ్మద్ షబ్బీర్ అలీ గారు ,రాష్ట్ర ఎస్టీ ,ఎస్సీ, బీసీ, మైనారిటీ శాఖల ప్రభుత్వ సలహాదారులు.
అతిథులు ..గౌరవనీయులు శ్రీ సురేష్ షెట్కర్ గారు, పార్లమెంటు సభ్యులు ,జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం,
శ్రీ ఐరేని నరసయ్య గారు ,సర్పంచ్ దోమకొండ.
శ్రీ బొమ్మెర శ్రీనివాస్ గారు ,ఉప సర్పంచ్ దోమకొండ.
శ్రీ కదిరే గోపాల్ రెడ్డి గారు, ఏఎంసీ డైరెక్టర్.
సర్వ శ్రీ వార్డు సభ్యులు, జిపి దోమకొండ.
ధర్మకర్తలు..
నగరం నరసింహులు, నాయిని లింగారెడ్డి, చింతల చిరంజీవి, చెన్నం స్వాతి శేఖర్.
దేవాలయ మాజీ చైర్మన్ లు..
శ్రీ కర్రోల్ల భీమా గౌడ్, శ్రీ చెన్నం లక్ష్మీకాంతం, శ్రీ తోట శేఖరయ్య, శ్రీ అబ్రబోయిన యాదగిరి ,శ్రీ ఐరేని నరసయ్య, శ్రీమతి దీకొండ శారద ,శ్రీ పెద్దిరెడ్డి నారాయణరెడ్డి, అబ్రబోయిన రాజేందర్.
భక్తులు మరియు గ్రామ ప్రజలు. దోమకొండ
శ్రీ కొండ అంజయ్య, చైర్మన్.
కార్యక్రమ వివరాలు ..
12-2-2026 గురువారం రోజున..
ఉదయము 10 గంటల 15 నిమిషాల నుండి ప్రదోష పూజ, గణపతి పూజ ,పుణ్యహవచనము, అఖండ దీపారాధన, రుత్విక్ వరణము, హారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వినియోగము, శేష సాయిపై స్వామివారి ఊరేగింపు.
13 -2-2026 శుక్రవారం రోజున ..
ఉదయం నుండి ప్రాతఃకాల పూజ , మాతృకా యోగిని, వాస్తు ,క్షేత్రపాలక ,నవగ్రహ మండల స్థాపనలు, అగ్ని ప్రతిష్ట, స్థాపిత దేవత హవనములు, రుద్రహవనము, ధ్వ జారోహణము , భేరీ పూజ, బలిహరణ ,సాయంత్రం నంది వాహన ఊరేగింపు .
14వ తేదీ శనివారం రోజున..
స్థాపిత దేవతాహనము, పూజలు, రుద్రహవనము,శేషసాయిపై స్వామివారి ఊరేగింపు.
15వ తేదీ ఆదివారం రోజున..
ప్రాతఃకాల పూజ ,భక్తుల అభిషేకములు, ఎదుర్కొల్లు, గంగా అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవము.
అశ్వవాహనముప స్వామివారి ఊరేగింపు.
రాత్రి ఒంటిగంట పది నిమిషాలకు నిశి పూజ, దిష్టికుంభాలు ,స్వామివారి రథారోహణ గంగా అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ,శ్రీ సీతారామచంద్ర స్వామివార్లు రథములపై స్థానిక ప్రయాణ ప్రాంగణం వద్దకు బయలుదేరుట .తదనంతరము లంకా దహనం అనంతరం రథములు ఆలయం ప్రవేశించుట .
తేదీ 16 ఫిబ్రవరి సోమవారం రోజున..
ఉదయం నుండి చక్రతీర్థం, నాకబలి, ఆవబృద స్నానం, పూర్ణాహుతి మొదలవు కార్యక్రమాలు జరుగును. కావున భక్తాగ్రేసరులు పై కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు.
శ్రీ బావి కృష్ణమూర్తి శర్మ ,యాగ్నికులు.. శ్రీ జనమంచి రామకృష్ణ శర్మ, ఆలయ పూజారి. శ్రీ జన మంచి వసంత్ శర్మ ,రుత్వికులు. శ్రీ భావి శరత్చంద్ర శర్మ, రుత్వికులు.
శ్రీ వి విజయరామరావు, సహాయ కమిషనర్, దేవాదాయ శాఖ.
శ్రీ కొండ అంజయ్య ,దేవాలయ కమిటీ చైర్మన్ 9701 744 251
శ్రీ బూర్ల ప్రభు, కార్యనిర్వాహణాధికారి.





కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి