INTERESTING ISSUES లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
INTERESTING ISSUES లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, ఫిబ్రవరి 2026, బుధవారం

వ్యాపారుల కోసం బిల్డ్..బోయింగ్ ఆఫర్..

 అప్లికేషన్లు కోరిన బోయింగ్..

 విమానాల తయారీ సంస్థ  బోయింగ్ తన యూనివర్సిటీ ఇన్నోవేషన్ లీడర్షిప్ డెవలప్మెంట్ /బిల్డ్  ప్రోగ్రాం 5 ఎడిషన్ కొరకు అప్లికేషన్లను ఆహ్వానిస్తోంది.

భారత విద్యార్థులు మరియు వర్ధమాన పారిశ్రామికవేత్తల వినూత్న ఆలోచనలను వ్యాపారంగా మార్చడమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. 

2019లో ప్రారంభమైన బిల్డ్ ప్రోగ్రామ్ ద్వారా ఇప్పటికే వేలాదిమంది గ్రాడ్యుయేట్లు , స్టార్ట్ అప్ లు ప్రయోజనం పొందాయి.. 

అర్హత..

ఏరో స్పేస్ ,టెక్నాలజీ, డిఫెన్స్ ,సస్టెనేబిలిటీ, సోషల్ ఇంపాక్ట్ రంగాలలో వినూత్న ఆలోచన లు ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 

ప్రయోజనం ఏమిటి?

ఎంపికైన వారికి శిక్షణ ఇస్తారు .విజేతలకు తమ ఆలోచనలను అభివృద్ధి చేసుకోవడానికి పది లక్షల రూపాయల గ్రాంట్ అందజేస్తారని బోయింగ్ తెలిపింది. ఔత్సాహిక అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని ప్రయోజనం పొందాలని కోరింది.

3, ఫిబ్రవరి 2026, మంగళవారం

అత్యంత ఖరీదైన నం.ప్లేట్ DDC0001

 దేశంలో అత్యంత ఖరీదైన నెంబర్ ప్లేట్ గా గుర్తింపు.

బి బి టి వేలంలో తగ్గించుకున్న గుంటూరుకు చెందిన వ్యాపారవేత్త. ఫ్యాన్సీ నెంబర్ కోసం ఎంతైనా వెచ్చించడానికి కొందరు ఆసక్తి చూపుతుంటారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ క చెందిన వ్యక్తి ఫ్యాన్సీ నెంబర్ కొరకు వేలంలో రెండు కోట్ల ఎనిమిది లక్షలు  బిడ్ వేసి దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు.

లగ్జరీ ప్రముఖులు వాడిన వస్తువులు వాహనాలు ఫ్యాన్సీ నంబర్లకు వేలం నిర్వహించే బిగ్ బాయ్స్ టాయిడ్ యాప్..DDC 0001 అనే ఫ్యాన్సీ కార్  నంబర్ ను వేలం వేస్తే, గుంటూరు కు చెందిన కిరణ్ కోల్పాకుల అనే వ్యక్తి రూ 2.08 కోట్లకు బిడ్ వేసి దానిని చేజిక్కించుకున్నారు. తన మారుతి సుజుకి ఇగ్నిస్ వాహనం కోసం దీన్ని తీసుకున్నాడు. ఒక కారు నంబర్ కు ఇంత పలకడం ఇదే మొదటి సారి. దేశంలో అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్ కలిగిన వ్యక్తిగా కిరణ్ కోల్పాకుల రికార్డు సృష్టించారు

గతంలో ఈ సంస్థ HR 88 B 8888 అనే ఫ్యాన్సీ నెంబర్ ను వేలం వేస్తే హర్యానా వ్యక్తి 1.17 కోట్లకు బిడ్ వేశాడు. అయితే ఆ వ్యక్తి డబ్బులు చెల్లించడంలో విఫలం కావడంతో దాని మరోసారి వేలం వేస్తే అది 26 లక్షల 70000 మాత్రమే ధర పలకడం  గమనార్హం.


29, మార్చి 2024, శుక్రవారం

ఏప్రిల్ లో వచ్చే మార్పులు ఇవే

 ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్థిక సంబంధ అంశాల్లో పలుమార్పులు జరగనున్నాయి క్రెడిట్ కార్డుల వినియోగం మొదలు జాతీయ పెన్షన్ పథకం వరకు ఏప్రిల్ లో పలు నిబంధనలు మారబోతున్నాయి

ఏప్రిల్ ఒకటి నుంచి అన్ని జీవిత ఆరోగ్య జనరల్ బీమా పాలసీలను డిజిటల్ చేయాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది పెరుగుతున్న ఆన్లైన్ మోసాల నేపథ్యంలో జాతీయ పెన్షన్ పథకం అకౌంట్లకు మరింత భద్రత కల్పించేందుకు ఏప్రిల్ ఒకటి నుంచి 2 ఫ్యాక్టర్ ఆధార్ అదెంటిఫికేషన్ చేరుస్తోంది

పలు డెబిట్ కార్డులపై వార్షిక మెయింటెనెన్స్ చార్జీలను 75 రూపాయల వరకు పెంచుతున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది విదేశీ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లో ఏప్రిల్ ఒకటి నుంచి పెట్టుబడులను నిలిపివేయాలని అసెట్ మేనేజర్లను సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ ఆదేశించింది ఏప్రిల్ ఒకటి నుంచి ఓలా మనీ ని పూర్తిగా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ గా మారుస్తున్నట్లు ఓలా ప్రకటించింది గరిష్టంగా పదివేల రూపాయల నెలవారి లోడ్ లిమిట్ తో సేవలు అందించనున్నట్లు తెలిపింది ఉచితంగా ఎయిర్పోర్ట్ లాంగ్ వినియోగించుకోవడానికి సంబంధించి క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఐసిఐసిఐ బ్యాంకు ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త నిబంధనలను అమలు చేయనున్నది యాక్సిస్ బ్యాంకు మాత్రం డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజులను వినియోగించుకోవడానికి ముందు త్రైమాసికంలో క్రెడిట్ కార్డు నుంచి కనీసం  రూపాయలు 50,000 వెచ్చించాలని తెలిపింది

ఎస్ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగదారులు ఒక త్రైమాసికంలో కనీసం 10,000 రూపాయలు క్రెడిట్ కార్డులో వెచ్చిస్తే తర్వాతి త్రైమాసికంలో ఉచితంగా డొమెస్టిక్ లంజలు వినియోగించుకోవచ్చని తెలిపింది ఏప్రిల్ ఒకటి నుంచి క్రెడిట్ కార్డుల రివార్డ్ పాయింట్స్ లో ఎస్బిఐ కీలక మార్పులు చేయనున్నది ఎస్బిఐ ఆరం ఎలైట్ ఎలైట్ అడ్వాంటేజ్ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డులు వాడుతున్న వారు క్రెడిట్ కార్డు నుంచి చేసే అద్ద చెల్లింపులకు రివార్డ్ పాయింట్స్ ఉండవు ఏప్రిల్ ఒకటిన కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో ఆ ఒక్క రోజున 2000 రూపాయల నోట్లు మార్చుకునే కేంద్రాలు పనిచేయవని ఆర్బిఐ తెలిపింది

అరిటాకులో భోజనం ఎందుకు చేయాలి

 అరిటాకులో భోజనం చేయడం ఒకప్పటి అలవాటు రోజు కుదరకపోయినా కనీసం పండుగలకు పబ్బాలకు తినేవారు ఈ పద్ధతి నీటికి కొనసాగుతోంది సంప్రదాయ వైద్యంలో అరిటాకు ఎంత ప్రాధాన్యత ఉందో తెలిస్తే అందులో తినాలని ఎందుకు సూచిస్తారో తెలుస్తుంది

అరిటాకులో ఉండే ఆంటీ యాక్సిడెంట్స్ వల్ల జలుబు దగ్గు లాంటి వైరల్ సమస్యలను శరీరం సమర్థంగా ఎదుర్కోగలదు కడిగిన అరిటాకుతో గాయాన్ని చుడితే అందులోనే ఔషధ గుణాల వల్ల గాయం త్వరగా మానుతుంది అరిటాకుల రసాన్ని జుట్టుకు రాసుకుంటే చుండ్రు తెల్ల వెంట్రుకలు లాంటి సమస్యలు దూరం అవుతాయట వీటిలో ఉండే రూటిన్ అనే పోషకం వల్ల దయాబెట్టేసి నియంత్రణలో ఉంటుంది అలాగే శరీరంలోని మాల్టోజ్ అనే ఒక రకం చక్కెరను నియంత్రించి షుగర్ నిలువలు పెరగకుండా చేస్తుంది. అరిటాకులోని లెక్ టిన్ అనే రసాయనం రోగనిరోధక శక్తిని పెంచే టి సేల్స్ పెంపునకు సహాయపడుతుంది అరిటాకులో ఆహారం తీసుకునేటప్పుడు దాని నుంచి వచ్చే సువాసన ఆకలిని కలిగిస్తుందట అందులో చుట్టిన ఆహార పదార్థాలు ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి

మళ్లీ యూనివర్సిటీలకు ఫార్టీ ప్లస్ వయ స్కూలు

 నైపుణ్యాల పెంపునకు సింగపూర్ నిర్ణయం

కృత్రిమ మేద రాకతో అన్ని రంగాలలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి అందుకు తగ్గట్లుగా నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు తమ దేశ ప్రజలను సింగపూర్ మళ్లీ యూనివర్సిటీల బాట పట్టిస్తుంది ఇందుకోసం పూర్తి కాల డిప్లమా కోరుస్ రూపొందించింది 40 ఏళ్ల పైబడిన వారు ఈ కోర్సులు చదవడానికి 90% ఫీజు రాయితీ కూడా అందిస్తోంది ప్రస్తుతం నలభై ఏళ్ల పైబడిన ఉద్యోగులు తాము 20 ఏళ్ల క్రితం చదువుకున్న చదువులకు ఇప్పటి చదువులకు ఎంతో మార్పు ఉంటుందని ఆ దేశ పార్లమెంట్ ఎంపీ టాన్ ఊ మేంగ్  తెలిపారు.అనుభవజ్ఞులు అయిన ఉద్యోగులు తమ జీవితా అనుభవాలను జీవన నైపుణ్యాలను తరగతి గదిలోకి తీసుకొస్తారు. అలాగే యువ విద్యార్థులతో కలిసి వారు కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటారు అని మెంగ్ అభిప్రాయపడ్డారు

కాచిన నూనెలతో మెదడుకు ముప్పు

 క్యాన్సర్ కాలేయ వ్యాధులకు దారి తీసే ప్రమాదం తాజా అధ్యయనంలో వెల్లడి

కాచిన నూనెలతో మళ్ళీ వంటలకు వినియోగిస్తే మెదడుకు ముప్పు తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలేయ క్యాన్సర్ తో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీసే అవకాశం ఉన్నదని స్పష్టం చేశారు ఇటీవల నిర్వహించిన అమెరికన్ సొసైటీ ఫర్ బయో కెమిస్ట్రీ అండ్ మాలిక్యులర్ బయాలజీ వార్షిక సమావేశంలో ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదికను వెల్లడించారు ఈ పరిశోధనలో నూనెకు మెదడు ఆరోగ్యానికి మధ్య ఉన్న సమస్యల గురించి వెళ్లడైంది ఎలుకలపై పరిశోధనలు నిర్వహించినట్లు వారు తమ నివేదికలో వెల్లడించారు కొన్ని ఎలుకలకు సాధారణ ఆహారం ఇవ్వగా మరికొన్నిటికీ కాచిన నూనెతో చేసిన ఆహారం ఇచ్చారు ఈ రెండింటిని పోల్చి చూస్తే కాచిన నూనెతో చేసిన ఆహారం తిన్న ఎలుకల్లో మెదడు అనారోగ్య ముప్పుని ఎదుర్కొన్నాయని పరిశోధకులు తెలిపారు కాచిన నూనెతో చేసిన వంటల వినియోగంతో శారీరక సమతుల్యత దెబ్బతింటుందని గుర్తించారు కీలకమైన జీర్ణ వ్యవస్థ కాలయాన్ని దెబ్బతీస్తుందని తేలింది ఈ నూనె కారణంగా క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని పలువురు ఆరోగ్యాన్ని పనులు హెచ్చరిస్తున్నారు ఇది ఫ్రీ రాడికల్స్ నొప్పి పెంచుతుందని దీనివల్ల దేహంలో వాపు ఏర్పడి ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని పేర్కొంటున్నారు ఇప్పుడు తాజా పరిశోధన కూడా వాటిని నిరూపిస్తుందని పరిశోధకులు వెల్లడించారు పదేపదే వేడి చేసిన నూనెలతో చేసిన వంటలతో మనిషి శరీరంలో కొలెస్ట్రాల స్థాయిలో పెరుగుతాయని దీర్ఘకాలిక రోగాలు వేధిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు ఈ ప్రమాదాలను తగ్గించుకో వడానికి ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు యాంటీ ఆక్సిడెంట్లు ప్రోబయటిక్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని వారు కోరుకుంటున్నారు

వన్ కార్డ్ బిజినెస్ సొల్యూషన్స్ డిస్కౌంట్ కార్డ్స్ అందజేత

 కామారెడ్డి జిల్లా కేంద్రంలో సాందీపని డిగ్రీ కళాశాలలో గురువారం వన్ కార్డ్ బిజినెస్ సొల్యూషన్ ఆధ్వర్యంలో స్పర్శ స్కిన్ హాస్పిటల్ నిమ్మాస్ డెంటల్ అఖిల హాస్పిటల్ సహకారంతో మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో 300 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు పలు ఆసుపత్రుల్లో ఓపి మెడికల్ ల్యాబ్లో వైద్య సేవలకు సంబంధించిన డిస్కౌంట్ కార్డులను విద్యార్థులకు అందజేశారు కార్యక్రమంలో సాందీపానికి విద్యాసంస్థల డైరెక్టర్ హరీష్మరణ్రెడ్డి అకాడమిక్ ప్రిన్సిపల్ మనోజ్ కుమార్ వైద్యులు సందీప్ కుమార్ పుట్ట మల్లికార్జున్ పుట్ట భవాని అభిషేక్ రెడ్డి ప్రతినిధులు రవి కిషోర్ రమ్య శ్రావణి సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు



గృహాల్లో ఉపయోగించే రసాయనాలు ఎలా తయారు చేసుకోవాలి

 ఆర్ట్స్ కళాశాలలో వర్క్ షాప్

నిత్యం గృహాలలో ఉపయోగించే డిటర్జెంట్ పౌడర్ లిక్విడ్ సోప్ ఫ్లోర్ క్లీనర్స్ ఫినాయిల్ హెర్బల్ పౌడర్ నొప్పి నివారణ మందులను తయారు చేసుకోవడం ద్వారా విద్యార్థులు స్వయం ఉపాధి పొందవచ్చని సోర్స్ పర్సన్ ఎం జయంతి అన్నారు కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ఆధ్వర్యంలో ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు హాజరైన జయంతి విద్యార్థులు బహుముఖ నైపుణ్యాలు కలిగి ఉండాలన్నారు ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ మాట్లాడుతూ కెమిస్ట్రీ విద్యార్థులకు రసాయనాలపై అవగాహన ఉన్నందున గృహాల్లో నిత్యం ఉపయోగించే వివిధ ఉత్పత్తులను తయారు చేసి స్థానికంగా మార్కెటింగ్ చేయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చన్నారు కళాశాల తరఫున పూర్తి సహకారం అందిస్తామన్నారు వర్క్ షాప్ లో వైస్ ప్రిన్సిపాల్ కిష్టయ్య కెమిస్ట్రీ అధ్యాపకులు శారద సమన్వయకర్తలు చంద్రకాంత్ శంకరయ్య శ్రీనివాస్ శ్రీలత జుబేరియా రామస్వామి శ్రీనివాసరావు రాజేందర్ స్వాతి సుచరణ్ మానస మరకలు మహిళా గురుకుల డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు మీనా విద్యార్థులు పాల్గొన్నారు



మానసిక రుగ్మతలకు చికిత్స అవసరం..14416

 


అతి కోపం నిరాశ నిస్ స్పృహ ఆత్మహత్య ప్రేరేపిత ఆలోచనలను అధిగమించడం కోసం సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి వైద్య సలహాలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా ప్రభుత్వ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ రమణ పిలుపునిచ్చారు బుధవారం రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మానసిక వ్యాధుగ్రస్తులకు చికిత్స అవగాహన కల్పించారు మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రమణ మాట్లాడుతూ మానసిక సమస్యలున్న వ్యాధిగ్రస్తులు చికిత్స తీసుకోవాలని వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు మతిమరుపు నిద్రలేమి అతని గ్రాఫిక్స్ అతికోపము ఆత్మహత్య ప్రేరేపిత ఆలోచనలు అధిగమించాల్సిన తీరు ఆల్కహాల్ సంబంధిత వాటిని మాన్పించుటకు వైద్య సలహాలు తీసుకోవాలన్నారు ఒంటరితనం భ్రమల్లో గడపకుండా ఉన్నవి లేనట్లు లేని ఉన్నట్లు ఊహించుకోవడం లాంటి మానసిక అనారోగ్యంతో ఉన్నవారికి చికిత్స అందిస్తామని డాక్టర్ రమణ తెలిపారు జిల్లా మానసిక ఆరోగ్య సామాజిక కార్యకర్త డాక్టర్ రాహుల్ కుమార్ మాట్లాడుతూ జాతి ఆరోగ్య మిషన్ ద్వారా జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం నిర్వహిస్తున్నామని అవసరమయ్యే వ్యాధిగ్రస్తులకు చికిత్సతో పాటు కౌన్సిలింగ్ ఉంటుందని వ్యాధిగ్రస్తులు మొహమాటం లేకుండా వారికి మానసిక సమస్యలు తలెత్తితే నేరుగా వైద్యులను సంప్రదించాలన్నార

ఉచిత టోల్ ఫ్రీ నెంబర్ 14416 నీ సంప్రదించి మానసిక వైద్య సలహాలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారి సురేష్ హెల్త్ ఎడ్యుకేటర్ భీమ్ సూపర్వైజర్ జానకి ఫార్మసిస్ట్ రాజు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు

28, మార్చి 2024, గురువారం

నిజామాబాద్ నగరానికి పుంగనూరు ఆవులు

 


నిజామాబాద్ నగరంలోని మంచాల శంకరయ్య గుప్తా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ పుంగనూరు ఆవులను కొనుగోలు చేసి తన స్వగృహానికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా మంచాల జ్ఞానేందర్ మాట్లాడుతూ నేటి కాలంలో కుక్కలు పిల్లలను పెంచే కన్నా ప్రతి ఒక్కరు ఇలాంటి ఆవులను పెంచాలని ఆయన సూచించారు ఈ ఆవులు కేవలం రెండు అడుగుల ఎత్తు ఉండడం వలన చిన్న చిన్న ఇండ్లలో కూడా సంతోషంగా పెంచుకోవచ్చు అని ఆయన తెలిపారు ఈ ఆవులను చూడడానికి పలువురు వారి ఇంటికి రావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మంచాల శ్రీ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు

మంచాల శంకరయ్య గుప్త చారిటబుల్ ట్రస్ట్,నిజామాబాద్..


27, మార్చి 2024, బుధవారం

గర్భాశయ క్యాన్సర్ ను పసిగట్టే స్మార్ట్ స్కోప్

 సర్వైకల్ క్యాన్సర్ ను ముందుగానే పసికట్టే సంస్థ స్మార్ట్ స్కోప్ అనే డిజిటల్ డివైస్ ను రూపొందించింది పూణేలోని పెరివింకిల్ టెక్నాలజీస

మహిళలకు ఎక్కువగా వచ్చే క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని పసిగట్టడంలో స్మార్ట్ స్కోప్ కీలకపాత్ర పోషిస్తుంది యూఎస్ యూకే లలో పని చేసిన వీణ మోక్తాలి ఆమె భర్త కౌస్తుబు నాయకులు మన దేశానికి వచ్చి పూణే కేంద్రంగా పెరివింకిల్ టెక్నాలజీకి శ్రీకారం చుట్టారు ఈ కంపెనీ నుంచి వచ్చిన స్మార్ట్ స్కోప్ డిజిటల్ డివైస్ సులభంగా ఉపయోగించేలా ఉంటుంది ప్రస్తుతం ఉన్న సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వద్ద పద్ధతులు సమయం తీసుకుంటున్నాయి ఈ సౌకర్యాలు పెద్ద నకర నగరాల్లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఫలితంగా ఎక్కువ మంది మహిళలు స్క్రీనింగ్ చేయించుకోలేకపోతున్నారు అంటున్నారు వీణ ఈ నేపథ్యంలో స్మార్ట్ స్కోప్ అనేది చిన్న ప్రైవేటు క్లినిక్ నర్సింగ్ హోమ్స్ మున్సిపల్ డిస్పెన్సరీలు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ జిల్లా ఆసుపత్రులలో అందుబాటులోకి తీసుకువచ్చారు ఒక బ్యాంకు మేనేజర్ కు గ్రేడ్ 2 దశలో క్యాన్సర్ని గుర్తించడంలో స్మార్ట్ స్కోప్ ఉపయోగపడింది మన దేశంలోని ఆరు రాష్ట్రాలకు చెందిన లక్షమంది ఈ పరికరం సహాయంతో జాగ్రత్త పడ్డారు ఈ డివైస్ నిర్వహణ ఖర్చు తక్కువ కావడం కూడా మరొక సానుకూల అంశము కూలి పనుల వల్ల రోజుల తరబడి ప్రయాణం చేసే టైం గ్రామీణ మహిళలకు ఉండడం లేదు స్మార్ట్ స్కోప్ ద్వారా ఫలితం కోసం ఎక్కువ సమయం ఎదురు చూడాల్సిన అవసరం లేదు అంటుంది వీణ అంతర్జాతీయ మార్కెట్లోకి కూడా విస్తరించాలని లక్ష్యం ఏర్పాటు చేసుకొని ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది వీణ మొక్తాలి



సెంచరీ కొట్టాలంటే

 వయసు సెంచరీ కొట్టాలంటే ఏజ్ 50 దాటాక కొన్ని ఆరోగ్య సూత్రాలు తప్పనిసరిగా పాటించాలి. యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు అలవాటు అయిన ఆహార నియమాలే కొనసాగిస్తానంటే 60లోనే ఆసుపత్రి పాలు కావలసి వస్తుంది 70 దాటకుండానే రన్ అవుట్ అయ్యే ప్రమాదము ఉంది 50 ఏళ్లు దాటాక జీర్ణశక్తి కాస్త మందగిస్తుంది శరీర పోషక అవసరాలు మారుతుంటాయి మరి వయసులో ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను దూరంగా ఉంచడం ఎంతైనా మంచిది కానీ ఏమిటంటే

వేపుళ్ళు వద్దు ..

వయసులో హాఫ్ సెంచరీ కొట్టాక రోజువారి ఆహారంలో వేపుల్ల కోసం వేయించుకు తినడం మానేయవలసిందే పండుగకు పబ్బానుకో రుచి చూడొచ్చు కానీ ప్రతిరోజు కరకరలాడే వేపుళ్ళు తింటే ప్రమాదమే వాటిలో ఉండే నూనె శరీరానికి మంచిది కాదు పైగా పొట్టలో కొలెస్ట్రాల్ కూడా పేరుకు పోతుంది అంతగా తినాలి అనుకుంటే ఎయిర్ ప్రైర్ లో గాని ఓవెన్ లో గాని తయారు చేసుకుంటే కాస్త మంచిది

చక్కెరకు చెక్

జ్యూస్ గ్రీన్ టీ బలవర్ధకం లాంటి లేబుల్స్ చూసి అవి ఆరోగ్యవంతమైనవి అనుకొని మోసపోతుంటాము నిజానికి చూడాల్సింది అందులోనే చక్కెర శాతం అవి నడివయసుకు మంచిది కావు చక్కెరకు చెక్క పెడితే కానీ కొలెస్ట్రాలకు కామ పడదు.

చాపల్యం చాలు

50 ఏళ్లు వచ్చేవరకు ఆస్వాదించిన రుచులు చాలు జిహ్వచాపలి అని ఎంత వదులుకుంటే అంత ఆరోగ్యం ప్రజల కోసం ప్యాకేజ్డ్ ఫుడ్ కు అలవాటు పడితే చేటు తప్పదు వీటిలో కనిపించకుండా చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది దీనిని హిడెన్ షుగర్ అంటారు వీటి బదులు తాజా పండ్లు తినడం మంచిది

మందుకు నో

 వయసు పెరుగుతున్న కొద్దీ మద్యం వల్లే కలిగే దుష్ఫలితాలు పెరుగుతాయి మద్యంతో కాలేయం మీద ఒత్తిడి పెరుగుతుంది 50వ పుట్టినరోజు నాడు డ్రింకింగ్ హ్యాబిట్ కు స్వస్తి పలకండి

ఉప్పు ముప్పు

రోజువారి ఆహారంలో 200300 మిల్లి గ్రాములకు మించి ఉప్పు ఉండకూడదు అన్నది నిపుణుల మాట కానీ మనం అంతకు ఎన్నో రేట్లు లాగించేస్తుంటాము నడివయసులో వచ్చే అధిక రక్తపోటు లాంటి సమస్యలను ఉప్పు తీవ్రతరం చేస్తుంది వీలైనంతవరకు ఉప్పు తగ్గించడం మధ్య అవసరం అని గుర్తించండ

తొలిసారి మిస్ యూనివర్స్ పోటీలలో సౌదీ

 


సంప్రదాయ ట్యాగ్ను వదిలిపెట్టిన సౌదీ అరేబియా దేశం తొలిసారిగా మిస్ యూనివర్స్ 2024 పోటీలలో పాల్గొనబోతోంది ఇన్నాళ్లు సంప్రదాయ నీడన ఉన్న ఇస్లాం దేశాల నుంచి తొలిసారిగా అధికారికంగా సౌదీ అరేబియా దేశం మిస్ యూనివర్స్ ప్రదర్శనలో భాగస్వామి కానున్నది 27 ఏండ్ల రుమి అల్క్హాత్తని ఆ దేశ ప్రతినిధిగా ఈ ప్రదర్శనలో తొలిసారిగా పాల్గొననున్నారు రియాదుకు చెందిన రూమీకి గతంలో పలు ప్రపంచ ప్రదర్శనలో పాల్గొన్న అనుభవం ఉంది ఇటీవల మలేషియాలో జరిగిన మిస్సెస్ గ్లోబల్ ఆసియాన్లో ఆమె పాల్గొంది



క్యాన్సర్ రోగుల కోసం హెల్ప్ లైన్ 9355520202

 సెకండ్ ఒపీనియన్ కోరే వారి కోసం ప్రారంభించిన ఆంకాలజిస్టుల టీం ఉచితంగా వైద్యుల కన్సల్టేషన్

క్యాన్సర్ రోగుల కోసం కొంతమంది అహంకాలజిస్టులతో కూడిన బృందం సెకండ్ ఒపీనియన్ హెల్ప్ లైన్ నెంబర్ను ప్రారంభించింది తమ క్యాన్సర్ సమస్యపై రెండో అభిప్రాయం కోరుకునే రోగులు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య 9355520202 నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు ఈ నెంబర్కు కాల్ చేసి క్యాన్సర్ రోగులు డైరెక్ట్ గా నిపుణులైన ఆంకాలజిస్ట్ తో ఉచితంగా మాట్లాడవచ్చు చికిత్స పై చర్చించేందుకు వీడియో కాల్ చేసేందుకు కూడా అవకాశం ఉన్నది క్యాన్సర్ మొత్తం భారత్ క్యాంపెయిన్ లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు క్యాంపెయిన్ హెడ్ డాక్టర్ ఆశిష్ గుప్తా తెలిపారు ప్రాణాంతకమైన క్యాన్సర్ బారిన పడిన రోగులందరికీ సెకండ్ ఒపీనియన్ ను సిఫారసు చేస్తున్నామన్నారు క్యాన్సర్ చికిత్సకు సంబంధించి వివిధ దవాఖానాల్లో వేరువేరుగా ఖర్చవుతుంది అని ఇది కూడా సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి మరో కారణమని ఆశిష్ గుప్తా అన్నారు క్యాన్సర్ కు సంబంధించి భయంకరమైన సవాళ్లను ఎదుర్కొంటున్న వారికి తమ హెల్ప్ లైన్ ఒక విలువైన వనరుగా ఉపయోగపడుతుందని ఖచ్చితమైన సమాచారం అందిస్తుందని పేర్కొన్నారు దేశంలో భారీగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు ఎందుకు సరిపడా సంఖ్యలో ఆరోగ్య సదుపాయాలు వైద్యులు లేని దృష్ట్యా ఈ హెల్ప్ లైన్ నంబర్ ను ఏర్పాటు చేశామని తెలిపారు నీటి కాలంలో క్యాన్సర్ చికిత్సలో నిత్యం కొత్త ఔషధాలు సరికొత్త థెరపీలు వస్తున్నాయని ఇలాంటి సమయంలో వైద్యుల నుంచి సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం అమూల్యమైనదని గుప్తాభిప్రాయపడ్డారు

ఓటీపీ మోసాలకు ఇక చెక్

 ఐఐటి మండి సరికొత్త సాంకేతికత

వన్ టైం పాస్వర్డ్ మోసాలను అరికట్టడం పెద్ద సవాలుగా మారింది సైబర్ నేరగాళ్ల బారిన పడి ఎంతోమంది లక్షలలో పోగొట్టుకుంటున్న కేసులు పెరుగుతున్నాయి సాంకేతిక అంశాలు తెలిసిన టెక్లను కూడా బోల్తా కొట్టించి డబ్బులు కొట్టేస్తున్న ఘటనలు చూస్తున్నాం ఈ మోసాలకు చెక్ పెట్టేందుకు ఐఐటి మండి శాస్త్రవేత్తలు కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నారు పాస్వర్డ్ ఆధార్ నుంచి రక్షణ కల్పించే అడాప్ ఐడి టెక్నాలజీని ఐఐటి మండి ఐఐటి కాన్పూర్ ఆధ్వర్యంలో నెలకొల్పిన డీప్ అల్గారిథమ్స్ కంపెనీ అభివృద్ధి చేసింది అథెంటిఫికేషన్ కోసం రక్షణాత్మక వ్యవస్థలో భాగంగా మల్టీలేయర్ యూజర్ బయోమెట్రిక్ బేస్డ్ బిహేవియర్ పేటర్న్స్ ను వినియోగించనున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు

ఆర్థికంగా ఎదగాలంటే

 ఎన్ని చదువులు చదివినా ఉద్యోగం చేసిన ఆర్థిక ఎదుగుదల ఎదుగుదల ఉంటేనే మనలో ధైర్యం ఉండే అయితే చిన్నతనంలో ఉంటారుగా పెరిగినవారు ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లండన్ లోని కింగ్స్ కాలేజీ యువతపై చేసిన పరిశోధనలో వెళ్లడైంది అటువంటివారు ఉద్యోగాలు చదువులు శిక్షణ లాంటి పలు అంశాలలో వారిని వారు తక్కువగా భావిస్తున్నారట ఆత్మవిశ్వాసం సన్నగిల్లి ఇతరులతో పోటీపడి ఉద్యోగాలు సాధించలేకపోతున్నారట తద్వారా సామాజికంగాను ఆర్థికంగాను వెనుకబడుతున్నారు అందుకే చిన్నతనం నుంచి పిల్లలు ఒంటరిగా ఉండకుండా నలుగురిలోనూ కలిసేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి అప్పుడే అన్ని నైపుణ్యాలను వెంటపట్టించుకుని అవకాశాలు అందిపుచ్చుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు

నీలకంఠుడి రథం కోసం సంప్రదించండి

 నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వరాలయంలో ప్రతి రథసప్తమికి స్వామివారి ఉత్సవమూర్తులను తల్లి గోరి వద్దకు ఊరేగిస్తారు సుమారు వందేళ్ళ క్రితం రూపొందించిన రథం శోభాయాత్రకు అనుకూలంగా లేకపోవడంతో మరమ్మతులు చేయించారు 50 లక్షల రూపాయలతో నూతన రథం తయారు చేయించారు ఇకపై ఇదే ఊరేగింపు కోసం ఉపయోగించనున్నారు దీనితో పురాతన రథం ఆలయ ప్రాంగణంలో వృధాగా ఉంది ఆలయ ప్రాంగణంలో బయట అలాగే ఉంచారు. ఇంకొన్నాళ్ళు వినియోగించే అవకాశం ఉన్న దాతలు ముందుకు రావడంతో కొత్తది తయారు చేయించామని ఈవో వేణు చెప్పారు జిల్లాలో ఇతర ఆలయాలకు చెందిన వారు తమకు రథం కావాలంటే ఈవో కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు



షియామీ ఎలక్ట్రిక్ కార్ @ 800 కిలోమీటర్స్

 స్మార్ట్ ఫోన్లో దిగ్గేజ్ సంస్థ షియామీ తమ తొలి విద్యుత్ కారణము త్వరలో విడుదల చేయనున్నది. ఈనెల 28 నుంచి ఆ కారుకు ముందస్తు ఆర్డర్లు తీసుకుంటామని కంపెనీ సీఈవో లిజన్ తెలిపారు ఈ కారు ధర 5 లక్షల ఇవాన్లు కంటే తక్కువే ఉంటుందని అంటే దాదాపు 58 లక్షల కంటే తక్కువే ఉంటుందని వెల్లడించారు సులభంగా డ్రైవింగ్ చేయగలిగేలా ఆకర్షణీయంగా ఉండేలా ఈ కారును రూపొందించినట్లు పేర్కొన్నారు షియామీ విద్యుత్తు కారును ఎస్యు సెవెన్ పేరుతో పిలుస్తున్నారు ఇందులో స్పీడ్ అల్ట్రాను ఎస్సీ గా పరిగణిస్తున్నారు ఎస్ యు సెవెన్ కారు ధరలను కూడా గురువారమే కంపెనీ ప్రకటించనుంది డిసెంబర్లో కంపెనీ ఈ కారును ఆవిష్కరించింది టెస్లా పోసే విద్యుత్కార్లకు దీటుగా ఎస్సీ సెవెన్ ను అభివృద్ధి చేశామని ప్రపంచ అగ్రగామి ఐదు వాహన సంస్థల్లో చేర్డమే లక్ష్యమని షియామి చెబుతోంది.

షియామీ ఎస్ యు సెవెన్ రెండు వెర్షన్లలో రానుంది. ఒకసారి చార్జింగ్తో ఒక మోడల్ 668 కిలోమీటర్లు మరో మోడల్ 800 కిలోమీటర్ల వరకు నడుస్తుందని కంపెనీ చెబుతోంది టెస్లా మోడల్ ఎస్ కారుపై 650 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు

చైనాలో షియామీ స్టోర్ లలో సోమవారం నుంచి ఎస్ యు సెవెన్ కార్లను ప్రదర్శిస్తున్నారు చైనా యాప్ స్టోర్ లలో కూడా షియామీ కారు యాప్ను అందుబాటులోకి తెచ్చారు

విద్యుత్ కార్ల వ్యాపారంలో వచ్చే పదేళ్లలో పది బిలియన్ డాలర్ల పెట్టుబడులను శియామీ ప్రకటించింది షియామీ కార్లను చైనా ప్రభుత్వ సంస్థ బిఏఐసి గ్రూప్ తయారు చేయనుంది విద్యుత్ కారులను తీసుకువచ్చేందుకు హువావే , బైడు వంటి సంస్థలతో అక్కడి వాహన సంస్థలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి




ప్రపంచంలోనే అత్యంత తేలికపాటి హ్యాండ్ బ్యాగ్

 బరువు 37 గ్రాములే. ఏరోజెల్ తో తయారీ

హ్యాండ్ బ్యాగులు మహిళలకు హస్తభూషణం అవి లేకుండా అతివేలు బయటకు రావడం అరుదు చాలా మంది మహిళల దగ్గర కనీసం రెండు మూడు హ్యాండ్ బ్యాగులైన ఉంటాయి. ఇది క్లాత్ లెదర్ ఇలా రకరకాల మెటీరియల్ తో తయారవుతుంటాయి ఫ్రెంచ్ ఫ్యాషన్ బ్రాండ్ కోపర్ని ఒక అడుగు ముందుకేసి ప్రపంచంలోనే అత్యంత తేలికైన హ్యాండ్ బ్యాగ్ ను తయారు చేసింది దీని బరువు 37 గ్రాములు మాత్రమే ఏ రోజు ఎంతో దీన్ని రూపొందించింది ఈ పదార్థంలో 99% ర్యాలీ ఒక శాతం గాజు ఉంటుంది ఈ బ్యాగ్ తన బరువు కన్నా నాలుగు వేల రెట్లు ఎక్కువ బరువును మోయగలదు 1200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తట్టుకోగలరు దీనిని రూపొందించడానికి కోపరానికి గ్రీకు పరిశోధకుడు అయోని సహకరించారు 27 * 16 * 6 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ ను తయారు చేయడానికి ముందు 15 నమూనాలు రూపొందించారు ప్యారిస్ ఫ్యాషన్ వీక్ లో కోపర్ని దీన్ని ఆవిష్కరించింది గత ఏడాది ఈ సంస్థ వేల సంవత్సరాల కిందట భూమిపై పడిన ఒక ఉల్కతో హ్యాండ్ బ్యాగ్లను తయారు చేసింది



రంగులు లేవు టమాటాలే

 హోలీ పండుగను పురస్కరించుకొని హనుమకొండలోని ఒక పాఠశాల రంగులు కాకుండా ₹3,000 పెట్టి మార్కెట్లో మూడు క్వింటాల టమాటాలు కొనుగోలు చేసింది వాటిని కోమటిపల్లి ప్రాంతంలోని నిరూప నగర్ లో ఇలా కుప్పగా పోయడంతో ఒకరిపై ఒకరు విసురుకుంటూ పిల్లలు హోలీ చేసుకున్నారు