Friday 29 March 2024

అంతిమయాత్ర రథం అందజేత

 

కామారెడ్డికి చెందిన కేపీ రాజారెడ్డి జన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో టౌన్ లో అంతిమయాత్రకు ఉపయోగించే రథాన్ని ట్రస్టు ప్రతినిధులు గొల్లవాల కవరస్తాన్ ప్రతినిధులకు శుక్రవారం అందించారు లక్షల రూపాయల విలువ చేసే వెహికల్ ఇవ్వడం పట్ల ట్రస్టు సభ్యుడు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డికి ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు

ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

 కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గుడి ప్రయోగాన్ని శుక్రవారం క్రైస్తవులు ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు పాస్టర్లు ఏసు బోధనలను వినిపించారు బైబిల్ పట్టణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు మందిరంలో ఏలీషా మహమ్మద్ నగర్ లోని సంజీవ్ శాంసన్ మాజీ అచ్చంపేట కోమలంచ మల్లూరు వడ్డేపల్లి హెడ్స్ గ్రామాల్లో ప్రత్యేక ప్రార్థనలు బైబిల్ పట్టణం కొనసాగాయి ఇస్లాంలోని సీఎస్ఐ చర్చలు ఫాదర్ రెవరెండ్ జయరాజ్ గుడ్ ఫ్రైడే ప్రాధాన్యతను క్రైస్తవులకు వివరించారు చర్చి కమిటీ సభ్యులు దేవదాస్ రాజు దీన్ దయాల్ భారతమ్మ రేఖ సురేష్ తదితరులు పాల్గొన్నారు

డోంగ్లి లో పాస్టర్ ప్రకాష్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలు నిర్వహించారు ఎల్లారెడ్డి లోని సైట్ అడ్రస్ చర్చిలో ఫాదర్ రివర్ అండ్ ప్రభాకర్ గుడ్ ఫ్రైడే పర్వదినం విశేషాలను వివరించారు సాయంత్రం భోజనాలు ఏర్పాటు చేశారు కార్యక్రమంలో సంఘ సభ్యులు ప్రభు కుమార్ స్వామి దాస్ మంత్రి సాల్మన్ రాజు మెరిసి మాలిని వాసంతి తదితరులు పాల్గొన్నారు దోమకొండ తో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో చర్చిల్లో శుక్రవారం గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు సంగమేశ్వర్ లోని జిఎఫ్ఎం ప్రేయర్ హాల్లో రెవరెండ్ శాప శ్రీనివాస్ ప్రత్యేక సందేశాన్ని అందించారు కార్యక్రమంలో పవిత్ర అజ్ఞాన్ కుమార్ రాజకుమార్ మోహన్ రెడ్డి కమలా మరియమ్మ రాజు రెబిక రాజయ్య పున్నమ్మ జ్యోతి భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు


ఏప్రిల్ లో వచ్చే మార్పులు ఇవే

 ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్థిక సంబంధ అంశాల్లో పలుమార్పులు జరగనున్నాయి క్రెడిట్ కార్డుల వినియోగం మొదలు జాతీయ పెన్షన్ పథకం వరకు ఏప్రిల్ లో పలు నిబంధనలు మారబోతున్నాయి

ఏప్రిల్ ఒకటి నుంచి అన్ని జీవిత ఆరోగ్య జనరల్ బీమా పాలసీలను డిజిటల్ చేయాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది పెరుగుతున్న ఆన్లైన్ మోసాల నేపథ్యంలో జాతీయ పెన్షన్ పథకం అకౌంట్లకు మరింత భద్రత కల్పించేందుకు ఏప్రిల్ ఒకటి నుంచి 2 ఫ్యాక్టర్ ఆధార్ అదెంటిఫికేషన్ చేరుస్తోంది

పలు డెబిట్ కార్డులపై వార్షిక మెయింటెనెన్స్ చార్జీలను 75 రూపాయల వరకు పెంచుతున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది విదేశీ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లో ఏప్రిల్ ఒకటి నుంచి పెట్టుబడులను నిలిపివేయాలని అసెట్ మేనేజర్లను సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ ఆదేశించింది ఏప్రిల్ ఒకటి నుంచి ఓలా మనీ ని పూర్తిగా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ గా మారుస్తున్నట్లు ఓలా ప్రకటించింది గరిష్టంగా పదివేల రూపాయల నెలవారి లోడ్ లిమిట్ తో సేవలు అందించనున్నట్లు తెలిపింది ఉచితంగా ఎయిర్పోర్ట్ లాంగ్ వినియోగించుకోవడానికి సంబంధించి క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఐసిఐసిఐ బ్యాంకు ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త నిబంధనలను అమలు చేయనున్నది యాక్సిస్ బ్యాంకు మాత్రం డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజులను వినియోగించుకోవడానికి ముందు త్రైమాసికంలో క్రెడిట్ కార్డు నుంచి కనీసం  రూపాయలు 50,000 వెచ్చించాలని తెలిపింది

ఎస్ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగదారులు ఒక త్రైమాసికంలో కనీసం 10,000 రూపాయలు క్రెడిట్ కార్డులో వెచ్చిస్తే తర్వాతి త్రైమాసికంలో ఉచితంగా డొమెస్టిక్ లంజలు వినియోగించుకోవచ్చని తెలిపింది ఏప్రిల్ ఒకటి నుంచి క్రెడిట్ కార్డుల రివార్డ్ పాయింట్స్ లో ఎస్బిఐ కీలక మార్పులు చేయనున్నది ఎస్బిఐ ఆరం ఎలైట్ ఎలైట్ అడ్వాంటేజ్ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డులు వాడుతున్న వారు క్రెడిట్ కార్డు నుంచి చేసే అద్ద చెల్లింపులకు రివార్డ్ పాయింట్స్ ఉండవు ఏప్రిల్ ఒకటిన కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో ఆ ఒక్క రోజున 2000 రూపాయల నోట్లు మార్చుకునే కేంద్రాలు పనిచేయవని ఆర్బిఐ తెలిపింది

షుగర్ ముప్పును పక్కాగా గుర్తించవచ్చు

 వన్ అవర్ ప్లాస్మా గ్లూకోజ్ పరీక్షతో నిర్ధారణ అంతర్జాతీయ డయాబెటిస్ ఫెడరేషన్ సిఫారసు

మారిన జీవనశైలి ఆహార పలవాట్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా మధుమేహ బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది ఒక అధ్యయనం ప్రకారం మన దేశ జనాభాలో 11.4% అంటే 10.1 కోట్ల మంది మధుమేహ బాధితులు ఉన్నారు దేశ జనాభాలో 15.3% అంటే 13.6 కోట్ల మంది ఫ్రీ డయాబెటిక్ దశలో ఉన్నారు. ఫ్రీ డయాబెటిక్ దశలో ఉన్నవారికి మధుమేహం ముప్పు ఎక్కువగా ఉంటుంది వెంటనే అప్రమత్తమై జీవనశైలి ఆహారంలో మార్పులు చేసుకోకపోతే మధుమేహం బారిన పడతారని లెక్క అయితే ఫ్రీ డయాబెటిక్ స్టేజిలో ఉన్న వారిని కచ్చితంగా గుర్తించడం ముఖ్యం ఇన్దుకుగా ను వన్ అవర్ ప్లాస్మా గ్లూకోజ్ పరీక్ష 1 hpg ను ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ సిఫారసు చేసింది ఈ పరీక్ష ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో ఎవరికి మధుమేహం ముప్పు ఉందో గుర్తించవచ్చు అని చెబుతోంది ఐ డి ఎఫ్ అనేది ప్రపంచవ్యాప్తంగా 240 కి పైగా మధుమేహ సంఘాలతో కూడిన సంస్థ ఇది మధుమేహానికి సంబంధించి వివిధ మార్గదర్శకాలను జారీ చేస్తుంటుంది సాధారణంగా ఫ్రీ డయాబెటిక్ దశను 75 గ్రాముల నోటి గ్లూకోజు టాలరెన్స్ లో రెండు గంటల ప్లాస్మా గ్లూకోజ్ పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు కానీ ఖచ్చితమైన ఫలితం కోసం మధుమేహం ముప్పు ఉన్నవారు రాత్రిపూట ఉపవాసం ఉన్న తర్వాత 75 గ్రాముల వన్ అవర్ ప్లాస్మా గ్లూకోజ్ పరీక్ష చేయించుకోవాలని ఐడిఎఫ్ చెబుతోంది వన్ అవర్ ప్లాస్మా గ్లూకోజ్ విలువ 155 mg/dl కంటే ఎక్కువ ఉంటే ప్రీ డయాబెటిస్ దశలో ఉన్నట్లు పరిగణిస్తారు.209mg/dl లేదా అంత కంటే ఎక్కువ ఉంటే టైప్ 2 మధుమేహం ఉన్నట్లు లెక్క..

డి ఓ టి పేరుతో వచ్చే కాల్స్ తో జాగ్రత్త

 కేంద్ర టెలి కమ్యూనికేషన్ శాఖ పేరుతో వచ్చే కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఆ శాఖ హెచ్చరించింది ఈ మేరకు పలు సూచనలు చేసింది మొబైల్ నెంబర్లు కనెక్షన్లు తొలగిస్తామని మీ నెంబర్ కొన్ని చట్ట విరుద్ధ కార్యకలాపాలలో దుర్వినియోగం అయ్యిందని తమ శాఖ అధికారుల నుంచి వచ్చినట్లు చెప్పి బెదిరింపు కావాల్సిన నమ్మవద్దని సూచించింది విదేశీ మొబైల్ నెంబర్లతో ప్రెస్ 92 తో మొదలయ్యేలాంటి వాట్సాప్ కాల్స్ చేసి ప్రభుత్వ అధికారుల పేర్లతో ఎవరైనా బెదిరించిన నమ్మవద్దని చెప్పింది తమ శాఖ తరఫున ఎవరు అలాంటి ఫోన్ కాల్స్ చేయాలని స్పష్టం చేసింది

అరిటాకులో భోజనం ఎందుకు చేయాలి

 అరిటాకులో భోజనం చేయడం ఒకప్పటి అలవాటు రోజు కుదరకపోయినా కనీసం పండుగలకు పబ్బాలకు తినేవారు ఈ పద్ధతి నీటికి కొనసాగుతోంది సంప్రదాయ వైద్యంలో అరిటాకు ఎంత ప్రాధాన్యత ఉందో తెలిస్తే అందులో తినాలని ఎందుకు సూచిస్తారో తెలుస్తుంది

అరిటాకులో ఉండే ఆంటీ యాక్సిడెంట్స్ వల్ల జలుబు దగ్గు లాంటి వైరల్ సమస్యలను శరీరం సమర్థంగా ఎదుర్కోగలదు కడిగిన అరిటాకుతో గాయాన్ని చుడితే అందులోనే ఔషధ గుణాల వల్ల గాయం త్వరగా మానుతుంది అరిటాకుల రసాన్ని జుట్టుకు రాసుకుంటే చుండ్రు తెల్ల వెంట్రుకలు లాంటి సమస్యలు దూరం అవుతాయట వీటిలో ఉండే రూటిన్ అనే పోషకం వల్ల దయాబెట్టేసి నియంత్రణలో ఉంటుంది అలాగే శరీరంలోని మాల్టోజ్ అనే ఒక రకం చక్కెరను నియంత్రించి షుగర్ నిలువలు పెరగకుండా చేస్తుంది. అరిటాకులోని లెక్ టిన్ అనే రసాయనం రోగనిరోధక శక్తిని పెంచే టి సేల్స్ పెంపునకు సహాయపడుతుంది అరిటాకులో ఆహారం తీసుకునేటప్పుడు దాని నుంచి వచ్చే సువాసన ఆకలిని కలిగిస్తుందట అందులో చుట్టిన ఆహార పదార్థాలు ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి

మళ్లీ యూనివర్సిటీలకు ఫార్టీ ప్లస్ వయ స్కూలు

 నైపుణ్యాల పెంపునకు సింగపూర్ నిర్ణయం

కృత్రిమ మేద రాకతో అన్ని రంగాలలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి అందుకు తగ్గట్లుగా నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు తమ దేశ ప్రజలను సింగపూర్ మళ్లీ యూనివర్సిటీల బాట పట్టిస్తుంది ఇందుకోసం పూర్తి కాల డిప్లమా కోరుస్ రూపొందించింది 40 ఏళ్ల పైబడిన వారు ఈ కోర్సులు చదవడానికి 90% ఫీజు రాయితీ కూడా అందిస్తోంది ప్రస్తుతం నలభై ఏళ్ల పైబడిన ఉద్యోగులు తాము 20 ఏళ్ల క్రితం చదువుకున్న చదువులకు ఇప్పటి చదువులకు ఎంతో మార్పు ఉంటుందని ఆ దేశ పార్లమెంట్ ఎంపీ టాన్ ఊ మేంగ్  తెలిపారు.అనుభవజ్ఞులు అయిన ఉద్యోగులు తమ జీవితా అనుభవాలను జీవన నైపుణ్యాలను తరగతి గదిలోకి తీసుకొస్తారు. అలాగే యువ విద్యార్థులతో కలిసి వారు కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటారు అని మెంగ్ అభిప్రాయపడ్డారు

కాచిన నూనెలతో మెదడుకు ముప్పు

 క్యాన్సర్ కాలేయ వ్యాధులకు దారి తీసే ప్రమాదం తాజా అధ్యయనంలో వెల్లడి

కాచిన నూనెలతో మళ్ళీ వంటలకు వినియోగిస్తే మెదడుకు ముప్పు తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలేయ క్యాన్సర్ తో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీసే అవకాశం ఉన్నదని స్పష్టం చేశారు ఇటీవల నిర్వహించిన అమెరికన్ సొసైటీ ఫర్ బయో కెమిస్ట్రీ అండ్ మాలిక్యులర్ బయాలజీ వార్షిక సమావేశంలో ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదికను వెల్లడించారు ఈ పరిశోధనలో నూనెకు మెదడు ఆరోగ్యానికి మధ్య ఉన్న సమస్యల గురించి వెళ్లడైంది ఎలుకలపై పరిశోధనలు నిర్వహించినట్లు వారు తమ నివేదికలో వెల్లడించారు కొన్ని ఎలుకలకు సాధారణ ఆహారం ఇవ్వగా మరికొన్నిటికీ కాచిన నూనెతో చేసిన ఆహారం ఇచ్చారు ఈ రెండింటిని పోల్చి చూస్తే కాచిన నూనెతో చేసిన ఆహారం తిన్న ఎలుకల్లో మెదడు అనారోగ్య ముప్పుని ఎదుర్కొన్నాయని పరిశోధకులు తెలిపారు కాచిన నూనెతో చేసిన వంటల వినియోగంతో శారీరక సమతుల్యత దెబ్బతింటుందని గుర్తించారు కీలకమైన జీర్ణ వ్యవస్థ కాలయాన్ని దెబ్బతీస్తుందని తేలింది ఈ నూనె కారణంగా క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని పలువురు ఆరోగ్యాన్ని పనులు హెచ్చరిస్తున్నారు ఇది ఫ్రీ రాడికల్స్ నొప్పి పెంచుతుందని దీనివల్ల దేహంలో వాపు ఏర్పడి ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని పేర్కొంటున్నారు ఇప్పుడు తాజా పరిశోధన కూడా వాటిని నిరూపిస్తుందని పరిశోధకులు వెల్లడించారు పదేపదే వేడి చేసిన నూనెలతో చేసిన వంటలతో మనిషి శరీరంలో కొలెస్ట్రాల స్థాయిలో పెరుగుతాయని దీర్ఘకాలిక రోగాలు వేధిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు ఈ ప్రమాదాలను తగ్గించుకో వడానికి ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు యాంటీ ఆక్సిడెంట్లు ప్రోబయటిక్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని వారు కోరుకుంటున్నారు

వన్ కార్డ్ బిజినెస్ సొల్యూషన్స్ డిస్కౌంట్ కార్డ్స్ అందజేత

 కామారెడ్డి జిల్లా కేంద్రంలో సాందీపని డిగ్రీ కళాశాలలో గురువారం వన్ కార్డ్ బిజినెస్ సొల్యూషన్ ఆధ్వర్యంలో స్పర్శ స్కిన్ హాస్పిటల్ నిమ్మాస్ డెంటల్ అఖిల హాస్పిటల్ సహకారంతో మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో 300 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు పలు ఆసుపత్రుల్లో ఓపి మెడికల్ ల్యాబ్లో వైద్య సేవలకు సంబంధించిన డిస్కౌంట్ కార్డులను విద్యార్థులకు అందజేశారు కార్యక్రమంలో సాందీపానికి విద్యాసంస్థల డైరెక్టర్ హరీష్మరణ్రెడ్డి అకాడమిక్ ప్రిన్సిపల్ మనోజ్ కుమార్ వైద్యులు సందీప్ కుమార్ పుట్ట మల్లికార్జున్ పుట్ట భవాని అభిషేక్ రెడ్డి ప్రతినిధులు రవి కిషోర్ రమ్య శ్రావణి సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు



గృహాల్లో ఉపయోగించే రసాయనాలు ఎలా తయారు చేసుకోవాలి

 ఆర్ట్స్ కళాశాలలో వర్క్ షాప్

నిత్యం గృహాలలో ఉపయోగించే డిటర్జెంట్ పౌడర్ లిక్విడ్ సోప్ ఫ్లోర్ క్లీనర్స్ ఫినాయిల్ హెర్బల్ పౌడర్ నొప్పి నివారణ మందులను తయారు చేసుకోవడం ద్వారా విద్యార్థులు స్వయం ఉపాధి పొందవచ్చని సోర్స్ పర్సన్ ఎం జయంతి అన్నారు కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ఆధ్వర్యంలో ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు హాజరైన జయంతి విద్యార్థులు బహుముఖ నైపుణ్యాలు కలిగి ఉండాలన్నారు ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ మాట్లాడుతూ కెమిస్ట్రీ విద్యార్థులకు రసాయనాలపై అవగాహన ఉన్నందున గృహాల్లో నిత్యం ఉపయోగించే వివిధ ఉత్పత్తులను తయారు చేసి స్థానికంగా మార్కెటింగ్ చేయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చన్నారు కళాశాల తరఫున పూర్తి సహకారం అందిస్తామన్నారు వర్క్ షాప్ లో వైస్ ప్రిన్సిపాల్ కిష్టయ్య కెమిస్ట్రీ అధ్యాపకులు శారద సమన్వయకర్తలు చంద్రకాంత్ శంకరయ్య శ్రీనివాస్ శ్రీలత జుబేరియా రామస్వామి శ్రీనివాసరావు రాజేందర్ స్వాతి సుచరణ్ మానస మరకలు మహిళా గురుకుల డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు మీనా విద్యార్థులు పాల్గొన్నారు



మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కమిటీ 2024 కామారెడ్డి

 సిఐటియు అనుబంధం కలిగిన కామారెడ్డి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నూతన కంపెనీ గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్ సమక్షంలో నూతన కమిటీని ఎన్నుకొని ప్రకటించారు అధ్యక్షుడిగా కందారపు రాజనర్సు ప్రధాన కార్యదర్శిగా ఎండి మహబూబాబాద్ ఉపాధ్యక్షుడిగా పోతారం ప్రభాకర్ దీపక్ దీవెన సహాయ కార్యదర్శిగా మామిండ్ల వేణు భూలక్ష్మి జనార్ధన్ వీరయ్య కోశాధికారిగా విజయ్ ప్రచార కార్యదర్శిగా టి రాజు కార్యవర్గ సభ్యులుగా భూదేవి శివ రాజా భూదేవి లక్ష్మి లక్ష్మణ్ ఆర్ రాములు అన్నపల్లి శ్రీను రాజవ్వ రాజమణి అని ఎన్నుకున్నారు .



మానసిక రుగ్మతలకు చికిత్స అవసరం..14416

 


అతి కోపం నిరాశ నిస్ స్పృహ ఆత్మహత్య ప్రేరేపిత ఆలోచనలను అధిగమించడం కోసం సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి వైద్య సలహాలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా ప్రభుత్వ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ రమణ పిలుపునిచ్చారు బుధవారం రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మానసిక వ్యాధుగ్రస్తులకు చికిత్స అవగాహన కల్పించారు మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రమణ మాట్లాడుతూ మానసిక సమస్యలున్న వ్యాధిగ్రస్తులు చికిత్స తీసుకోవాలని వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు మతిమరుపు నిద్రలేమి అతని గ్రాఫిక్స్ అతికోపము ఆత్మహత్య ప్రేరేపిత ఆలోచనలు అధిగమించాల్సిన తీరు ఆల్కహాల్ సంబంధిత వాటిని మాన్పించుటకు వైద్య సలహాలు తీసుకోవాలన్నారు ఒంటరితనం భ్రమల్లో గడపకుండా ఉన్నవి లేనట్లు లేని ఉన్నట్లు ఊహించుకోవడం లాంటి మానసిక అనారోగ్యంతో ఉన్నవారికి చికిత్స అందిస్తామని డాక్టర్ రమణ తెలిపారు జిల్లా మానసిక ఆరోగ్య సామాజిక కార్యకర్త డాక్టర్ రాహుల్ కుమార్ మాట్లాడుతూ జాతి ఆరోగ్య మిషన్ ద్వారా జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం నిర్వహిస్తున్నామని అవసరమయ్యే వ్యాధిగ్రస్తులకు చికిత్సతో పాటు కౌన్సిలింగ్ ఉంటుందని వ్యాధిగ్రస్తులు మొహమాటం లేకుండా వారికి మానసిక సమస్యలు తలెత్తితే నేరుగా వైద్యులను సంప్రదించాలన్నార

ఉచిత టోల్ ఫ్రీ నెంబర్ 14416 నీ సంప్రదించి మానసిక వైద్య సలహాలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారి సురేష్ హెల్త్ ఎడ్యుకేటర్ భీమ్ సూపర్వైజర్ జానకి ఫార్మసిస్ట్ రాజు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు

Thursday 28 March 2024

దేవునిపల్లి కి చెందిన దేవల సంజయ్ అదృశ్యం

 కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవుని పల్లికి చెందిన దేవల సంజయ్ అదృశ్యమైనట్లు పట్టణ ఎస్హెచ్ఓ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు గురువారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సంజయ్ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికారు సంజయ్ ఆచూకీ లభించకపోవడంతో అతడి భార్య శ్రీలత పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు ఇటీవల ఇంటిని నిర్మించిన సంజయ్ కు అప్పులు పెరిగినట్లు తెలిసింది



వృద్ధుడి అదృశ్యం

 కామారెడ్డి మండలం లింగాయపల్లి కి చెందిన తొట్ట భూమయ్య 70 సంవత్సరాలు అదృష్టమైనట్లు దేవునిపల్లి ఎస్సై రాజు గురువారం తెలిపారు ఈనెల 11న ఇంటి నుంచి బయటకు వెళ్ళిన భూమయ్య ఇంటికి తిరిగి రాలేదు. పలుచోట్ల వెతికిన రాజకీయ లభించకపోవడంతో భూమయ్య కూతురు మమతా పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాము ఎస్సై రాజు తెలిపారు



రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు

 ముస్తాబైన ఇందూరు తిరుమల ఏప్రిల్ 2న శ్రీవారి కల్యాణ మహోత్సవం

నిజామాబాద్ రూరల్ మండలంలోని మోపాల్ మండలంలోని నర్సింగ్ పల్లి లో ఉన్న హిందువులు తిరుమల గోవింద వనమాల క్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబయింది దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభమై ఏప్రిల్ 5 వరకు కొనసాగలు ఉన్నాయి ప్రతి ఏడాది నిర్వహించే బ్రహ్మోత్సవాలలో సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ఏప్రిల్ 2 నా స్వామివారి కల్యాణోత్సవం ఉత్సవ మూర్తులతో పురవీధులలో గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు 5వ తేదీన బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి మా పల్లె చారిటబుల్ ట్రస్ట్ ఆలయ ప్రధాన ధర్మకర్తలు ప్రముఖ నిర్మాత దిల్ రాజు శిరీష్ నర్సింహారెడ్డి విజయసింహారెడ్డి హరీష్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు నిత్యం సినిమా షెడ్యూల్లో బిజీగా ఉండే దిల్ రాజు తన కుటుంబ సభ్యులతో బ్రహ్మోత్సవాల సందర్భంగా వారం రోజులపాటు స్వామి వారి సన్నిధిలో సేవ చేసుకుంటారు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని ఆలయ ప్రధాన ధర్మకర్తలు పేర్కొన్నారు భక్తులు సపరివార సమేతంగా బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు



హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ 2024 తెలంగాణ

 హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ తెలంగాణ 2024 ఎన్నికలలో అధ్యక్షుడిగా అయ్యాడ రవీందర్ రెడ్డి విజయం సాధించారు అధ్యక్షుడు ఎన్నిక కోసం అయ్యాడపు రవీందర్ రెడ్డి మణికొండ విజయ్ కుమార్ చిక్కుడు ప్రభాకర్ ఏ జగన్ నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారం సాగించారు గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్ద ఎత్తున న్యాయవాదులు హక్కు వినియోగించుకున్నారు ఓటింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టారు అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలు జగన్ పై రవీందర్ రెడ్డి 33 ఓట్ల తేడాతో విజయం సాధించారు ఉపాధ్యక్షురాలుగా ఏ దీప్తి జనరల్ సెక్రటరీలుగా ఉప్పల శాంతి భూషణ్ రావు జిల్లెల్ల సంజీవరెడ్డి జాయింట్ సెక్రెటరీగా వాసిరెడ్డి నవీన్ కుమార్ ట్రెజరర్ గా కట్ట శ్రావ్య స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా ఎస్ అభిలాష్ విజయం సాధించారు హైకోర్టుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల బార్ అసోసియేషన్ లకు ఒకేసారి ఎన్నికలు జరగడం ఫలితాలు ప్రకటించడం విశేషం యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రవీందర్ రెడ్డి 1987లో నాటి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవా దిగా ఎన్రోల్ అయ్యారు. గతంలో రైల్వే స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు 2021 లో సీనియర్ న్యాయవాదిగా పదోన్నతి పొందారు



నిజామాబాద్ నగరానికి పుంగనూరు ఆవులు

 


నిజామాబాద్ నగరంలోని మంచాల శంకరయ్య గుప్తా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ పుంగనూరు ఆవులను కొనుగోలు చేసి తన స్వగృహానికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా మంచాల జ్ఞానేందర్ మాట్లాడుతూ నేటి కాలంలో కుక్కలు పిల్లలను పెంచే కన్నా ప్రతి ఒక్కరు ఇలాంటి ఆవులను పెంచాలని ఆయన సూచించారు ఈ ఆవులు కేవలం రెండు అడుగుల ఎత్తు ఉండడం వలన చిన్న చిన్న ఇండ్లలో కూడా సంతోషంగా పెంచుకోవచ్చు అని ఆయన తెలిపారు ఈ ఆవులను చూడడానికి పలువురు వారి ఇంటికి రావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మంచాల శ్రీ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు

మంచాల శంకరయ్య గుప్త చారిటబుల్ ట్రస్ట్,నిజామాబాద్..


Wednesday 27 March 2024

గర్భాశయ క్యాన్సర్ ను పసిగట్టే స్మార్ట్ స్కోప్

 సర్వైకల్ క్యాన్సర్ ను ముందుగానే పసికట్టే సంస్థ స్మార్ట్ స్కోప్ అనే డిజిటల్ డివైస్ ను రూపొందించింది పూణేలోని పెరివింకిల్ టెక్నాలజీస

మహిళలకు ఎక్కువగా వచ్చే క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని పసిగట్టడంలో స్మార్ట్ స్కోప్ కీలకపాత్ర పోషిస్తుంది యూఎస్ యూకే లలో పని చేసిన వీణ మోక్తాలి ఆమె భర్త కౌస్తుబు నాయకులు మన దేశానికి వచ్చి పూణే కేంద్రంగా పెరివింకిల్ టెక్నాలజీకి శ్రీకారం చుట్టారు ఈ కంపెనీ నుంచి వచ్చిన స్మార్ట్ స్కోప్ డిజిటల్ డివైస్ సులభంగా ఉపయోగించేలా ఉంటుంది ప్రస్తుతం ఉన్న సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వద్ద పద్ధతులు సమయం తీసుకుంటున్నాయి ఈ సౌకర్యాలు పెద్ద నకర నగరాల్లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఫలితంగా ఎక్కువ మంది మహిళలు స్క్రీనింగ్ చేయించుకోలేకపోతున్నారు అంటున్నారు వీణ ఈ నేపథ్యంలో స్మార్ట్ స్కోప్ అనేది చిన్న ప్రైవేటు క్లినిక్ నర్సింగ్ హోమ్స్ మున్సిపల్ డిస్పెన్సరీలు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ జిల్లా ఆసుపత్రులలో అందుబాటులోకి తీసుకువచ్చారు ఒక బ్యాంకు మేనేజర్ కు గ్రేడ్ 2 దశలో క్యాన్సర్ని గుర్తించడంలో స్మార్ట్ స్కోప్ ఉపయోగపడింది మన దేశంలోని ఆరు రాష్ట్రాలకు చెందిన లక్షమంది ఈ పరికరం సహాయంతో జాగ్రత్త పడ్డారు ఈ డివైస్ నిర్వహణ ఖర్చు తక్కువ కావడం కూడా మరొక సానుకూల అంశము కూలి పనుల వల్ల రోజుల తరబడి ప్రయాణం చేసే టైం గ్రామీణ మహిళలకు ఉండడం లేదు స్మార్ట్ స్కోప్ ద్వారా ఫలితం కోసం ఎక్కువ సమయం ఎదురు చూడాల్సిన అవసరం లేదు అంటుంది వీణ అంతర్జాతీయ మార్కెట్లోకి కూడా విస్తరించాలని లక్ష్యం ఏర్పాటు చేసుకొని ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది వీణ మొక్తాలి



ఆధ్యాత్మిక సమాచారం 27 మార్చి 24

 హనుమాన్ ఆలయానికి విరాళం అందజేత

పిట్ల మండలంలోని అల్లాపూర్ గ్రామ హనుమాన్ ఆలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో గ్రామానికి చెందిన హనుమాన్ సైన్యం ఆధ్వర్యంలో 21 వేల విలువ గల జ్యోతి దీపారాధన హుండీని ఆలయ నిర్వాహకులకు విరాళంగా అందజేశారు అంతకుముందు హనుమాన్ సైన్యం సభ్యులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో హనుమాన్ సైన్యం అధ్యక్షుడు పరువయ్య ఉపాధ్యక్షుడు సాయి సుధీర్ ప్రధాన కార్యదర్శి విటల్ కోశాధికారి శంకర్ సభ్యులు సాయి రెడ్డి సురేంద్రరావు బాలాజీ రావు సాయిరాం సంతోష్ రెడ్డి మహిపాల్ రెడ్డి కాంతరెడ్డి హనుమంత్ రెడ్డి మల్లుగొండ బసేందర్ పండరి రావు తదితరులు పాల్గొన్నారు

30 నుంచి సిద్ధ రామేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

దక్షిణ కాశీగా పేరుందిన బిక్కనూరు సిద్ధరామేశ్వర ఆలయంలోని స్వామివారి బ్రహ్మోత్సవాలను ఈనెల 30 నుంచి ఏప్రిల్ 3 వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఉత్సవ కమిటీ పునర్నిర్మాణ కమిటీ ప్రతినిధులు మంగళవారం తెలిపారు ఈ సందర్భంగా వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు కామారెడ్డి బస్టాండ్ నుంచి ప్రతి గంటకు ఆర్టిసి బస్సులు ఆలయానికి వస్తాయన్నారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరారు

మైలారం గ్రామంలో గల కొచ్చేరి మైసమ్మ ఆలయంలో మంగళవారం భక్తుల సందడి నెలకొన్నది ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారికి భక్తులు కొబ్బరికాయలు కొట్టినవేద్యాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు

పెద్దకూడాప్గల్ మండల కేంద్రంలోని పాప హరేశ్వర ఆలయంలో పురోహితులు శ్రీపతిరావు పంతులు ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీపతిరావు మాట్లాడుతూ శిఖర ప్రతిష్టాపనలో భాగంగా గోవు పూజ అగ్ని ప్రతిష్ట తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించమని చెప్పారు బుధవారం జరగబోయే కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై విజయవంతం చేయాలని కోరారు





సెంచరీ కొట్టాలంటే

 వయసు సెంచరీ కొట్టాలంటే ఏజ్ 50 దాటాక కొన్ని ఆరోగ్య సూత్రాలు తప్పనిసరిగా పాటించాలి. యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు అలవాటు అయిన ఆహార నియమాలే కొనసాగిస్తానంటే 60లోనే ఆసుపత్రి పాలు కావలసి వస్తుంది 70 దాటకుండానే రన్ అవుట్ అయ్యే ప్రమాదము ఉంది 50 ఏళ్లు దాటాక జీర్ణశక్తి కాస్త మందగిస్తుంది శరీర పోషక అవసరాలు మారుతుంటాయి మరి వయసులో ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను దూరంగా ఉంచడం ఎంతైనా మంచిది కానీ ఏమిటంటే

వేపుళ్ళు వద్దు ..

వయసులో హాఫ్ సెంచరీ కొట్టాక రోజువారి ఆహారంలో వేపుల్ల కోసం వేయించుకు తినడం మానేయవలసిందే పండుగకు పబ్బానుకో రుచి చూడొచ్చు కానీ ప్రతిరోజు కరకరలాడే వేపుళ్ళు తింటే ప్రమాదమే వాటిలో ఉండే నూనె శరీరానికి మంచిది కాదు పైగా పొట్టలో కొలెస్ట్రాల్ కూడా పేరుకు పోతుంది అంతగా తినాలి అనుకుంటే ఎయిర్ ప్రైర్ లో గాని ఓవెన్ లో గాని తయారు చేసుకుంటే కాస్త మంచిది

చక్కెరకు చెక్

జ్యూస్ గ్రీన్ టీ బలవర్ధకం లాంటి లేబుల్స్ చూసి అవి ఆరోగ్యవంతమైనవి అనుకొని మోసపోతుంటాము నిజానికి చూడాల్సింది అందులోనే చక్కెర శాతం అవి నడివయసుకు మంచిది కావు చక్కెరకు చెక్క పెడితే కానీ కొలెస్ట్రాలకు కామ పడదు.

చాపల్యం చాలు

50 ఏళ్లు వచ్చేవరకు ఆస్వాదించిన రుచులు చాలు జిహ్వచాపలి అని ఎంత వదులుకుంటే అంత ఆరోగ్యం ప్రజల కోసం ప్యాకేజ్డ్ ఫుడ్ కు అలవాటు పడితే చేటు తప్పదు వీటిలో కనిపించకుండా చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది దీనిని హిడెన్ షుగర్ అంటారు వీటి బదులు తాజా పండ్లు తినడం మంచిది

మందుకు నో

 వయసు పెరుగుతున్న కొద్దీ మద్యం వల్లే కలిగే దుష్ఫలితాలు పెరుగుతాయి మద్యంతో కాలేయం మీద ఒత్తిడి పెరుగుతుంది 50వ పుట్టినరోజు నాడు డ్రింకింగ్ హ్యాబిట్ కు స్వస్తి పలకండి

ఉప్పు ముప్పు

రోజువారి ఆహారంలో 200300 మిల్లి గ్రాములకు మించి ఉప్పు ఉండకూడదు అన్నది నిపుణుల మాట కానీ మనం అంతకు ఎన్నో రేట్లు లాగించేస్తుంటాము నడివయసులో వచ్చే అధిక రక్తపోటు లాంటి సమస్యలను ఉప్పు తీవ్రతరం చేస్తుంది వీలైనంతవరకు ఉప్పు తగ్గించడం మధ్య అవసరం అని గుర్తించండ

నేటి నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ

 ఉపాధ్యా అర్హత పరీక్ష టెట్ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ బుధవారం నుంచి ప్రారంభం కానున్నది ఆసక్తి ఉన్న అభ్యర్థులు బుధవారం ఉదయం 10 గంటల నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్షలు ఆన్లైన్లో జరుగుతాయి సందేహాల నివృత్తికి అభ్యర్థులు 7075701768 మరియు 7075701784 నెంబర్లను సంప్రదించవచ్చ

తొలిసారి మిస్ యూనివర్స్ పోటీలలో సౌదీ

 


సంప్రదాయ ట్యాగ్ను వదిలిపెట్టిన సౌదీ అరేబియా దేశం తొలిసారిగా మిస్ యూనివర్స్ 2024 పోటీలలో పాల్గొనబోతోంది ఇన్నాళ్లు సంప్రదాయ నీడన ఉన్న ఇస్లాం దేశాల నుంచి తొలిసారిగా అధికారికంగా సౌదీ అరేబియా దేశం మిస్ యూనివర్స్ ప్రదర్శనలో భాగస్వామి కానున్నది 27 ఏండ్ల రుమి అల్క్హాత్తని ఆ దేశ ప్రతినిధిగా ఈ ప్రదర్శనలో తొలిసారిగా పాల్గొననున్నారు రియాదుకు చెందిన రూమీకి గతంలో పలు ప్రపంచ ప్రదర్శనలో పాల్గొన్న అనుభవం ఉంది ఇటీవల మలేషియాలో జరిగిన మిస్సెస్ గ్లోబల్ ఆసియాన్లో ఆమె పాల్గొంది



క్యాన్సర్ రోగుల కోసం హెల్ప్ లైన్ 9355520202

 సెకండ్ ఒపీనియన్ కోరే వారి కోసం ప్రారంభించిన ఆంకాలజిస్టుల టీం ఉచితంగా వైద్యుల కన్సల్టేషన్

క్యాన్సర్ రోగుల కోసం కొంతమంది అహంకాలజిస్టులతో కూడిన బృందం సెకండ్ ఒపీనియన్ హెల్ప్ లైన్ నెంబర్ను ప్రారంభించింది తమ క్యాన్సర్ సమస్యపై రెండో అభిప్రాయం కోరుకునే రోగులు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య 9355520202 నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు ఈ నెంబర్కు కాల్ చేసి క్యాన్సర్ రోగులు డైరెక్ట్ గా నిపుణులైన ఆంకాలజిస్ట్ తో ఉచితంగా మాట్లాడవచ్చు చికిత్స పై చర్చించేందుకు వీడియో కాల్ చేసేందుకు కూడా అవకాశం ఉన్నది క్యాన్సర్ మొత్తం భారత్ క్యాంపెయిన్ లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు క్యాంపెయిన్ హెడ్ డాక్టర్ ఆశిష్ గుప్తా తెలిపారు ప్రాణాంతకమైన క్యాన్సర్ బారిన పడిన రోగులందరికీ సెకండ్ ఒపీనియన్ ను సిఫారసు చేస్తున్నామన్నారు క్యాన్సర్ చికిత్సకు సంబంధించి వివిధ దవాఖానాల్లో వేరువేరుగా ఖర్చవుతుంది అని ఇది కూడా సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి మరో కారణమని ఆశిష్ గుప్తా అన్నారు క్యాన్సర్ కు సంబంధించి భయంకరమైన సవాళ్లను ఎదుర్కొంటున్న వారికి తమ హెల్ప్ లైన్ ఒక విలువైన వనరుగా ఉపయోగపడుతుందని ఖచ్చితమైన సమాచారం అందిస్తుందని పేర్కొన్నారు దేశంలో భారీగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు ఎందుకు సరిపడా సంఖ్యలో ఆరోగ్య సదుపాయాలు వైద్యులు లేని దృష్ట్యా ఈ హెల్ప్ లైన్ నంబర్ ను ఏర్పాటు చేశామని తెలిపారు నీటి కాలంలో క్యాన్సర్ చికిత్సలో నిత్యం కొత్త ఔషధాలు సరికొత్త థెరపీలు వస్తున్నాయని ఇలాంటి సమయంలో వైద్యుల నుంచి సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం అమూల్యమైనదని గుప్తాభిప్రాయపడ్డారు

దిగట్ లెస్ ఫుడి ఇక లేరు

 ది గెట్ లెస్ ఫుడ్ గా ప్రాచుర్యం పొందిన పూణేకు చెందిన ఫుడ్ లాగా నటాషా దిద్ది కన్నుమూశారు ఈ విషయాన్ని ఆమె భర్త ఇంస్టాగ్రామ్ లో వెల్లడించారు రకరకాల ఆహారాలను తన ఫాలోయర్లకు పరిచయం చేసేది కాగా నటాషాకు పొట్ట చుట్టూ అల్సర్లు కనితి ఉన్నందున వైద్యులు గ్యాస్ట్రిక్టమీ శాస్త్ర చికిత్స చేసి ఆమె పొట్టను తొలగించారు దీనితో ఆమె భోజనం చేసిన గంటలోపే ఆహారం బయటకు వెళ్లిపోయేది ఇంత పెద్ద సమస్య ఉన్నప్పటికీ ఆమె చలాకీగా కనిపిస్తూ వీడియోలు చేసేవా




ఓటీపీ మోసాలకు ఇక చెక్

 ఐఐటి మండి సరికొత్త సాంకేతికత

వన్ టైం పాస్వర్డ్ మోసాలను అరికట్టడం పెద్ద సవాలుగా మారింది సైబర్ నేరగాళ్ల బారిన పడి ఎంతోమంది లక్షలలో పోగొట్టుకుంటున్న కేసులు పెరుగుతున్నాయి సాంకేతిక అంశాలు తెలిసిన టెక్లను కూడా బోల్తా కొట్టించి డబ్బులు కొట్టేస్తున్న ఘటనలు చూస్తున్నాం ఈ మోసాలకు చెక్ పెట్టేందుకు ఐఐటి మండి శాస్త్రవేత్తలు కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నారు పాస్వర్డ్ ఆధార్ నుంచి రక్షణ కల్పించే అడాప్ ఐడి టెక్నాలజీని ఐఐటి మండి ఐఐటి కాన్పూర్ ఆధ్వర్యంలో నెలకొల్పిన డీప్ అల్గారిథమ్స్ కంపెనీ అభివృద్ధి చేసింది అథెంటిఫికేషన్ కోసం రక్షణాత్మక వ్యవస్థలో భాగంగా మల్టీలేయర్ యూజర్ బయోమెట్రిక్ బేస్డ్ బిహేవియర్ పేటర్న్స్ ను వినియోగించనున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు

యువతి అదృశ్యం

 ఎల్లారెడ్డికి చెందిన ముస్కాన్ అనే యువతి అదృశ్యమైనట్లు ఎస్సై మహేష్ తెలిపారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన కుసుమ బేగం కుటుంబం 8 ఏండ్ల క్రితం ఎల్లారెడ్డికి వలస వచ్చి నివాసం ఉంటున్నది ఈ నెల 20వ తేదీన ముస్కాన్ ను తల్లి మందలించింది దీనితో ఆమె ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుందామని ఆచూకీ తెలిసినవారు 8712686160 మరియు 871526078 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ సూచించారు



హనుమాన్ సైన్యం సామాగ్రి అందజేత

 పిట్ల మండలంలోని అల్లాపూర్ హనుమాన్ ఆలయానికి గ్రామానికి చెందిన హనుమాన్ సైన్యం సంఘ సభ్యులు మంగళవారం 21 వేల రూపాయల విలువ చేసి జ్యోతి హుండీ ఇతర సామాగ్రిని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయం చేశామని చెప్పారు కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పరువయ్య ఉపాధ్యక్షుడు సాయి సుధీర్ ప్రధాన కార్యదర్శి విఠల కోశాధికారి శంకర్ సభ్యులు సాయి రెడ్డి సురేందర్రావు బాలాజీ రావు సాయిరాం సంతోష్ రెడ్డి మైపాల్ రెడ్డి కాంత్ రెడ్డి హనుమంత్ రెడ్డి మలిగొండ బసేందర్ పండరి రావు తదితరులు పాల్గొన్నార



దరఖాస్తు చేసుకోవాలి

 తెలంగాణ మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనారిటీ స్టడీ సర్కిల్ హైదరాబాదులోని శిక్షణ కేంద్రంలో యుపిఎస్సి సి షాట్ 2024 25 సంవత్సరానికి గాను ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి దయానంద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు 100 మంది డిగ్రీ పూర్తి చేసిన మైనారిటీ ముస్లిం క్రిస్టియన్ బుద్దిస్ట్ పార్శి అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు అభ్యర్థులు www.tmreistelangana.cgg.gov.in వెబ్సైట్లో ఏప్రిల్ 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు ఏప్రిల్ 28న ఆదివారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తెలంగాణ మైనారిటీ గురుకుల బాలుర పాఠశాల కామారెడ్డిలో హైదరాబాద్ వారిచే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారని తెలిపారు మరిన్ని వివరాలకు 04023236112 ఫోన్ నెంబర్ను సంప్రదించాలని సూచించారు

27 నుంచి అఖండ హరినామ సప్తాహం

 పాత బాన్సువాడ శాంతినగర్ కాలనీలోని రుక్మిణి సమేత పాండురంగ స్వామి ఆలయంలో ఈనెల 27 నుంచి ఏడు రోజుల పాటు అఖండ హరినామ సప్తాహం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని భక్తులందరూ అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు

ఆర్థికంగా ఎదగాలంటే

 ఎన్ని చదువులు చదివినా ఉద్యోగం చేసిన ఆర్థిక ఎదుగుదల ఎదుగుదల ఉంటేనే మనలో ధైర్యం ఉండే అయితే చిన్నతనంలో ఉంటారుగా పెరిగినవారు ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లండన్ లోని కింగ్స్ కాలేజీ యువతపై చేసిన పరిశోధనలో వెళ్లడైంది అటువంటివారు ఉద్యోగాలు చదువులు శిక్షణ లాంటి పలు అంశాలలో వారిని వారు తక్కువగా భావిస్తున్నారట ఆత్మవిశ్వాసం సన్నగిల్లి ఇతరులతో పోటీపడి ఉద్యోగాలు సాధించలేకపోతున్నారట తద్వారా సామాజికంగాను ఆర్థికంగాను వెనుకబడుతున్నారు అందుకే చిన్నతనం నుంచి పిల్లలు ఒంటరిగా ఉండకుండా నలుగురిలోనూ కలిసేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి అప్పుడే అన్ని నైపుణ్యాలను వెంటపట్టించుకుని అవకాశాలు అందిపుచ్చుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు

నీలకంఠుడి రథం కోసం సంప్రదించండి

 నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వరాలయంలో ప్రతి రథసప్తమికి స్వామివారి ఉత్సవమూర్తులను తల్లి గోరి వద్దకు ఊరేగిస్తారు సుమారు వందేళ్ళ క్రితం రూపొందించిన రథం శోభాయాత్రకు అనుకూలంగా లేకపోవడంతో మరమ్మతులు చేయించారు 50 లక్షల రూపాయలతో నూతన రథం తయారు చేయించారు ఇకపై ఇదే ఊరేగింపు కోసం ఉపయోగించనున్నారు దీనితో పురాతన రథం ఆలయ ప్రాంగణంలో వృధాగా ఉంది ఆలయ ప్రాంగణంలో బయట అలాగే ఉంచారు. ఇంకొన్నాళ్ళు వినియోగించే అవకాశం ఉన్న దాతలు ముందుకు రావడంతో కొత్తది తయారు చేయించామని ఈవో వేణు చెప్పారు జిల్లాలో ఇతర ఆలయాలకు చెందిన వారు తమకు రథం కావాలంటే ఈవో కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు



షియామీ ఎలక్ట్రిక్ కార్ @ 800 కిలోమీటర్స్

 స్మార్ట్ ఫోన్లో దిగ్గేజ్ సంస్థ షియామీ తమ తొలి విద్యుత్ కారణము త్వరలో విడుదల చేయనున్నది. ఈనెల 28 నుంచి ఆ కారుకు ముందస్తు ఆర్డర్లు తీసుకుంటామని కంపెనీ సీఈవో లిజన్ తెలిపారు ఈ కారు ధర 5 లక్షల ఇవాన్లు కంటే తక్కువే ఉంటుందని అంటే దాదాపు 58 లక్షల కంటే తక్కువే ఉంటుందని వెల్లడించారు సులభంగా డ్రైవింగ్ చేయగలిగేలా ఆకర్షణీయంగా ఉండేలా ఈ కారును రూపొందించినట్లు పేర్కొన్నారు షియామీ విద్యుత్తు కారును ఎస్యు సెవెన్ పేరుతో పిలుస్తున్నారు ఇందులో స్పీడ్ అల్ట్రాను ఎస్సీ గా పరిగణిస్తున్నారు ఎస్ యు సెవెన్ కారు ధరలను కూడా గురువారమే కంపెనీ ప్రకటించనుంది డిసెంబర్లో కంపెనీ ఈ కారును ఆవిష్కరించింది టెస్లా పోసే విద్యుత్కార్లకు దీటుగా ఎస్సీ సెవెన్ ను అభివృద్ధి చేశామని ప్రపంచ అగ్రగామి ఐదు వాహన సంస్థల్లో చేర్డమే లక్ష్యమని షియామి చెబుతోంది.

షియామీ ఎస్ యు సెవెన్ రెండు వెర్షన్లలో రానుంది. ఒకసారి చార్జింగ్తో ఒక మోడల్ 668 కిలోమీటర్లు మరో మోడల్ 800 కిలోమీటర్ల వరకు నడుస్తుందని కంపెనీ చెబుతోంది టెస్లా మోడల్ ఎస్ కారుపై 650 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు

చైనాలో షియామీ స్టోర్ లలో సోమవారం నుంచి ఎస్ యు సెవెన్ కార్లను ప్రదర్శిస్తున్నారు చైనా యాప్ స్టోర్ లలో కూడా షియామీ కారు యాప్ను అందుబాటులోకి తెచ్చారు

విద్యుత్ కార్ల వ్యాపారంలో వచ్చే పదేళ్లలో పది బిలియన్ డాలర్ల పెట్టుబడులను శియామీ ప్రకటించింది షియామీ కార్లను చైనా ప్రభుత్వ సంస్థ బిఏఐసి గ్రూప్ తయారు చేయనుంది విద్యుత్ కారులను తీసుకువచ్చేందుకు హువావే , బైడు వంటి సంస్థలతో అక్కడి వాహన సంస్థలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి




ప్రపంచంలోనే అత్యంత తేలికపాటి హ్యాండ్ బ్యాగ్

 బరువు 37 గ్రాములే. ఏరోజెల్ తో తయారీ

హ్యాండ్ బ్యాగులు మహిళలకు హస్తభూషణం అవి లేకుండా అతివేలు బయటకు రావడం అరుదు చాలా మంది మహిళల దగ్గర కనీసం రెండు మూడు హ్యాండ్ బ్యాగులైన ఉంటాయి. ఇది క్లాత్ లెదర్ ఇలా రకరకాల మెటీరియల్ తో తయారవుతుంటాయి ఫ్రెంచ్ ఫ్యాషన్ బ్రాండ్ కోపర్ని ఒక అడుగు ముందుకేసి ప్రపంచంలోనే అత్యంత తేలికైన హ్యాండ్ బ్యాగ్ ను తయారు చేసింది దీని బరువు 37 గ్రాములు మాత్రమే ఏ రోజు ఎంతో దీన్ని రూపొందించింది ఈ పదార్థంలో 99% ర్యాలీ ఒక శాతం గాజు ఉంటుంది ఈ బ్యాగ్ తన బరువు కన్నా నాలుగు వేల రెట్లు ఎక్కువ బరువును మోయగలదు 1200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తట్టుకోగలరు దీనిని రూపొందించడానికి కోపరానికి గ్రీకు పరిశోధకుడు అయోని సహకరించారు 27 * 16 * 6 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ ను తయారు చేయడానికి ముందు 15 నమూనాలు రూపొందించారు ప్యారిస్ ఫ్యాషన్ వీక్ లో కోపర్ని దీన్ని ఆవిష్కరించింది గత ఏడాది ఈ సంస్థ వేల సంవత్సరాల కిందట భూమిపై పడిన ఒక ఉల్కతో హ్యాండ్ బ్యాగ్లను తయారు చేసింది



రంగులు లేవు టమాటాలే

 హోలీ పండుగను పురస్కరించుకొని హనుమకొండలోని ఒక పాఠశాల రంగులు కాకుండా ₹3,000 పెట్టి మార్కెట్లో మూడు క్వింటాల టమాటాలు కొనుగోలు చేసింది వాటిని కోమటిపల్లి ప్రాంతంలోని నిరూప నగర్ లో ఇలా కుప్పగా పోయడంతో ఒకరిపై ఒకరు విసురుకుంటూ పిల్లలు హోలీ చేసుకున్నారు



Tuesday 26 March 2024

అనారోగ్య టెకీలు

 ఐటీ ఉద్యోగులు 61 శాతం మందిలో హై కొలెస్ట్రాల్ 37 శాతం మందిలో ఏదో ఒక దీర్ఘకాలిక రుగ్మత పాతికేళ్లలోపు వారిలో కొవ్వు స్థాయిలో అస్తవ్యస్తం 25 నుంచి 40 లోపు ఉన్న 56000 మందిపై అధ్యయనం ఎనిమిది అంశాలపై హెచ్సీఎల్ హెల్త్ కేర్ పరీక్షలు యాంత్రిక జీవన శైలితో 40 ఏళ్లలో పై ఇబ్బందులు చాలామందిలో సంతానలేమి.. వైద్య నిపుణులు

మీరు ఐటీ ఉద్యోగుల మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉంటున్నారా తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారా ఇవన్నీ ఎందుకంటే ఐటి ఉద్యోగులు తీవ్ర ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వారి హెల్త్ పారామీటర్స్ అస్తవ్యస్తంగా ఉన్నట్లు హెచ్సీఎల్ హెల్త్ కేర్ సంస్థ హెచ్చరిస్తోంది దేశవ్యాప్తంగా 56,000 మంది ఐటి ఉద్యోగుల ఆరోగ్య స్థితిగతులపై ఈ సంస్థ అధ్యయనం చేసింది దీనిలో 77 శాతం మంది ఆరోగ్య విలువలు చాలా అస్తవ్యస్తంగా ఉన్నట్లు తెలిసింది ముఖ్యంగా 61 శాతం మంది అధిక కొవ్వు సమస్యతో బాధపడుతున్నట్లు పేర్కొంది క్లినికల్ స్టడీ చేసిన తర్వాత హెచ్ సి ఎల్ హెల్త్ కేర్ ఈ వివరాలు వెల్లడించింది ఈ స్టడీని 25:40 ఏళ్ల లోపు వారిపై చేశారు వీరందరికీ వారి పని ప్రదేశాల వద్ద వైద్యుల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు దేశంలోని కార్పొరేట్ వ్యవస్థలు పనిచేసే ఉద్యోగుల్లో పెరుగుతున్న అనారోగ్య పరిస్థితులను నివారించే లక్ష్యాన్ని నొక్కి చెప్పడమే ఈ అధ్యయన ప్రధాన ఉద్దేశం అని హెచ్.ఎస్.ఎల్ పేర్కొంది ఉపాయం ఫ్రీ డయాబెటిస్ డయాబెటిస్ ఫ్రీ హైపర్ టెన్షన్ రక్తపోటు రక్తహీనత హైపోథైరాయిడిసం అధిక కొవ్వు లాంటి కీలకమైన ఎనిమిది అంశాలను పరీక్షించారు ఉద్యోగులలో 22 శాతం మంది ఉబకాయం 17% ఫ్రీ డయాబెటిస్తో 11% రక్తహీనత హైపోథైరాయిడిజంతో ఏడు శాతం మధుమేహంతో ఇబ్బంది పడుతున్నట్లు అధ్యయనం తేల్చింది ఉద్యోగుల్లో ప్రతి ఒక్కరు ఒకటి కంటే ఎక్కువ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు పాతికలలోపు వారిలో కొవ్వు స్థాయిలు చాలా అస్తవ్యస్తంగా ఉన్నట్లు వీరులో 14% రక్తహీనతతో 13% ఉబకాయంతో ఎనిమిది శాతం హైపో థైరాయిడ్ఏ డు శాతం ప్రీ డయాబెటిస్తో బాధపడుతున్నట్లు వెల్లడైంది ఇలాంటి దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులు చాలా వేగంగా పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయని అధ్యయన సంస్థ తెలిపింది ఈ సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రధానంగా 40 ఏళ్లు దాటిన వారిలో చాలా ప్రమాదకర స్థితిలో ఈ పారామీటర్స్ పెరుగుతున్నట్లు వెల్లడించింది ప్రధానంగా అధిక కొవ్వు, ఉబకాయం ప్రీ డయాబెటిస్ డయాబెటిస్ ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలిపింది కేవలం 23% మంది ఉద్యోగుల హెల్త్ పారామీటర్స్ తగిన స్థాయిలో ఉన్నాయని వెల్లడించింది ఇక పరీక్షలు చేయించుకున్న వారిలో 37% మందికి ఒక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య ఉండగా 26% మందిలో రెండు 11 శాతం మందిలో మూడు రకాల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తెలిపింది సాధారణంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లన్ని కూడా 40 ఏళ్ల తర్వాతే వస్తుంటాయి కానీ ఐటీ ఉద్యోగుల్లో మాత్రమే 30 లపే కనిపిస్తున్నాయి ఎందుకు ప్రధాన కారణం వారి జీవనశైలే అని హెచ్సీఎల్ హెల్త్ కేర్ సీఈవో వైస్ చైర్మన్ శిఖర్ మల్హోత్రో పేర్కొన్నారు ఐటి ఉద్యోగులు తప్పక ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు నేటి ఉద్యోగులు ఎక్కువగా జంక్ ఫుడ్స్ రెడీమేడ్ ప్రాసెస్ తీసుకుంటున్నారని అలాగే గంటలకు కూర్చోవడం జీవనశైలి విధానం వల్ల కూడా వారిలో ఇలాంటి అనారోగ్య సమస్యలు ఎక్కువ కనిపిస్తున్నాయని యశోద ఆసుపత్రి కి చెందిన ప్రముఖ వృద్రోక వైద్య నిపుణులు డాక్టర్ రాయుడు గోపికృష్ణ తెలిపారు

ఐటీ ఉద్యోగులలో సంతానాలు ఏమి సమస్య తీవ్రం ఐటి ఉద్యోగులు ఎక్కువగా యాంత్రిక జీవనశైలిని గడుపుతున్నారు రివర్స్ టైం లో పనిచేస్తుంటారు అందుకే వారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వారి ఉద్యోగస్థితి అందుకు కారణం రేయింబగళ్లు పని వ్యాయామం లేకపోవడం సరైన డైట్ పాటించకపోవడం స్మోకింగ్ మద్యపానం సరిగా నిద్రపోకపోవడం లాంటి వాటితో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి హెచ్సీఎల్ అధ్యయనం కంటే కూడా ఇంకా ఎక్కువ సమస్యలే వారిలో ఉన్నాయి ఇటీవారి కాలంలో వారిలో సంతానలేని సమస్య తీవ్రత చాలా ఎక్కువగా కనిపిస్తోంది ఇది బాగా ఆందోళనకరమైన అంశం అందుకే 25 రాకముందే ఏటా విధిగా అన్ని రకాల టెస్టులు చేయించుకోవాలి. బి.పి షుగర్ను కనీసం ఆరు నెలలకు ఒక మారైన చెక్ చేయించుకోవాలి ఐటీ కంపెనీల యాజమాన్యాలు సైతం విధిగా తమ ఉద్యోగులకు పరీక్షలు చేయించాలి దాంతో ముందస్తుగా వారి ఉద్యోగు ల్లోని అనారోగ్య సమస్యలు గుర్తించవచ్చు తద్వారా వారి భీమా ఖర్చు తగ్గే అవకాశం ఉంది అని డాక్టర్ ఎం వి రావు సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్ యశోద ఆసుపత్రి హైదరాబాద్ వారు అన్నారు

ఫ్రీ రీఛార్జ్ పేరుతో మోసాలు

 అప్రమత్తంగా ఉండాలని సూచన

ఉచితంగా 55 రూపాయల రీఛార్జిని పొందండి జియో ప్రారంభించే మూడేళ్లు అయి పూర్తయిన సందర్భంగా ఈ ఆఫర్ ఇస్తున్నామంటూ మెసేజ్లు పంపుతున్నారు సైబర్ నెరగాళ్లు ఉచిత ఆఫర్లను నమ్మి వారి వరకు చిక్కే అమాయకులకు మెసేజ్ లింకులను పంపి వారి నుంచి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు ఆధార్ పాన్ నంబర్లు సహాబాలు వివరాలు సేకరిస్తూ మోసగిస్తున్నట్లు సైబర్ భద్రత నిపుణులు తెలిపారు ఇలాంటి అనుమానాస్పద మెసేజ్లను నమ్మవద్దని అందులోని లింకులపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు అని వారు హెచ్చరిస్తున్నారు ఫ్రీ రీఛార్జ్ ఆఫర్ల పేరిట వచ్చే వాట్సాప్ మెసేజ్లు నకిలీ ఇవ్వని గ్రహించాలని వారు సూచిస్తున్నారు

విశ్వేశ్వర స్వామి ఆలయ కమిటీ కార్యవర్గం ఎన్నిక

 సదాశివ నగర్ మండల కేంద్రంలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆలయ కమిటీ అధ్యక్షుడిగా జోగిని రాజయ్య ట్రాక్టర్ కార్యదర్శిగా న్యాయని నడిపి గంగయ్య కోశాధికారిగా బద్దం రాజిరెడ్డి కార్యవర్గ సభ్యులుగా వడ్ల బాలరాజ్ నల్ల బాయికాడి సాయి రెడ్డి కుమ్మరి రాజయ్య రాజేందర్ నల్ల వెంకటరెడ్డి జనగామ రామ్రెడ్డి సాకలి పున్నమి రాజయ్య తడిగం రాజేందర్ గదారి లచ్చిరెడ్డి తాడ్వాయి నారాయణ తదితరులను ఎన్నుకున్నారు మాజీ సర్పంచ్ బద్దం శ్రీనివాస్ రెడ్డి మాజీ ఉపసర్పంచ్ వంకాయల రవి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కొప్పుల నరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు



ఆధ్యాత్మిక సమాచారం 26 మార్చి 2024

 ఘనంగా మల్లన్న కళ్యాణం లింగంపేట మండలం భవానిపేటలో సోమవారం మల్లికార్జున స్వామి కళ్యాణం యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ప్రత్యేక హోలీ పండుగ సందర్భంగా కేతమ్మ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరిపించారు ఈ సందర్భంగా భక్తులు అగ్నిగుండాల మీదుగా మల్లన్న దేవుని నామస్మరణ చేసుకుంటూ నడిచారు అనంతరం అన్నదానం చేశారు అలాగే ఒగ్గు కళాకారులతో కళాజాత కార్యక్రమం నిర్వహించారు

హోలీ మదన పున్నమి సందర్భంగా సోమవారం కామారెడ్డి లోని స్థానిక హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శారద ఆదిశంకర ఆలయంలో భక్తిశ్రద్ధలతో నవదుర్గ సామూహిక వ్రతం నిర్వహించారు గతంలో పాల్గొన్న మహిళలకు ఆలయ కమిటీ తరఫున పూజా సామాగ్రి అందజేశారు అన్నదానం చేశారు

చండీ మంత్రాలయంలో స్థానిక శ్రీనివాస్ నగర్ ని శ్రీ చండీ మంత్రాలయంలో మదన పున్నమి సందర్భంగా చండీ హోమం నిర్వహించారు అమ్మవారికి విశేష పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు




రాజంపేట సాయిబాబా ఆలయంలో సోమవారం అన్నదానం నిర్వహించారు ప్రతి నెల పౌర్ణమి రోజున ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు అనే కమిటీ సభ్యులు తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చిన్న సీతారాములు బంధం కృష్ణమూర్తి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఘనంగా హోలీ రంగుల కెళ్ళి హోలీ పర్వదినాన్ని జిల్లా ప్రజల సోమవారం ఘనంగా జరుపుకున్నారు రంగులు చదువుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు


గ్రామాల్లో కుస్తీ పోటీలు
జిల్లాలోని పలు గ్రామాలలో హోలీ సందర్భంగా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలను సోమవారం నిర్వహించారు నందిపేట మండలంలోని కంఠంలో కుస్తీ పోటీలు రసవాతారంగా జరిగాయి జిల్లా నుంచి కాకుండా మహారాష్ట్ర నుంచి మల్ల యోధులు కుస్తీ పోటీలకు అధిక సంఖ్యలో తరలివచ్చారు కుస్తీ పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చారు గ్రామ పెద్దలు విజేతలకు నగదు బహుమతి అందజేశారు ప్రతి ఏడాది హోలీ రోజున కుస్తీ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని గ్రామస్తులు తెలిపారు






దరఖాస్తుల ఆహ్వానం

 బాన్సువాడ రూరల్ బోర్ల రోడ్డులోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలికల రెసిడెన్షియల్ విద్యాలయంలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని విద్యాలయం ప్రిన్సిపాల్ ధనలక్ష్మి సూచించారు ఐదవ తరగతిలో 80 సీట్లకు గాను 60 సీట్లు మైనారిటీలకు 20 సీట్లు నాన్ మైనారిటీలకు కేటాయించాలని పేర్కొన్నారు అలాగే ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఎంపీసీ బైపీసీలో 40 చొప్పున సీట్లు ఉన్నాయని తెలిపారు ఇందులో 30 సీట్లు మైనారిటీలకు 10 సీట్లు నాన్ మైనారిటీలకు రిజర్వ్ చేశారని పేర్కొన్నారు ఆసక్తి గలవారు ఈ నెలాఖరులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఇతర వివరాలకు 7331170814 మరియు 833860782 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు

కీ చైన్ తో పేమెంట్.. ఫెడరల్ బ్యాంక్

 ఫ్లాష్ పే పేరుతో అందుబాటులోకి పిన్ నెంబర్ ఎంటర్ చేయకుండా 5000 రూపాయల వరకు చెల్లింపులకు ఛాన్స్ రోజుకు ఐదు లావాదేవీలు చేయవచ్చు ఓ పి ఎస్ మెషిన్ల వద్ద రోజుకు గరిష్టంగా లక్ష రూపాయలకు అవకాశం ఫెడరల్ బ్యాంక్ వినూత్న ఆవిష్కరణ డెబిట్ క్రెడిట్ కార్డు తరహాలోనే వినియోగం స్మార్ట్ కీ చైన్ ధర 499 రూపాయలు మాత్రమే. ఏడాదికి రుసుము 199 రూపాయలు



ప్రైవేట్ రంగానికి చెందిన ఫెడరల్ బ్యాంక్ ఫ్లాష్ పై పేరుతో రూపే స్మార్ట్ కీ చైన్లు తీసుకువచ్చింది ఈ స్మార్ట్ కీ చైన్ తో కాంట్రాక్టు లెస్ చెల్లింపులు చేయవచ్చు ప్రస్తుతం క్రెడిట్ డెబిట్ కార్డులో ఉన్న టాప్ అండ్ పే ఫీచర్ తరహాలోనే ఇది పనిచేస్తుంది ఈ చిన్న కీ చైన్ ఉంటే సులభంగా చెల్లింపులు చేయవచ్చు పిన్ని ఎంటర్ చేయకుండానే ఐదువేల రూపాయల వరకు కాంటాక్ట్ పేమెంట్లు చేయవచ్చు ఆపై మొత్తానికి పిన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది గరిష్టంగా లక్ష రూపాయల వరకు చెల్లింపులు చేయవచ్చు ఫ్లాష్ పేరు స్మార్ట్ కీ చైన్ ఉంటే బయటకు వెళ్ళినప్పుడు క్రెడిట్ డెబిట్ కార్డు వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం లేదని బ్యాంక్ తెలిపింది ఎంపీ సీఐతో కలిసి ఈ స్మార్ట్ కి చైను తీసుకువచ్చినట్లు తెలిపింది ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లు దీన్ని తీసుకోవచ్చు సేవింగ్స్ కరెంట్ ఖాతా ఉన్న కస్టమర్లు నెట్ బ్యాంకింగ్ లోకి వెళ్లి ఈ స్మార్ట్ కీ చైన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఫెడరల్ బ్యాంక్ మొబైల్ నెట్ బ్యాంకింగ్ ఐ.వి.ఆర్ కాలింగ్ ద్వారా పిన్ సెట్ చేసుకోవచ్చు. క్రెడిట్ డెబిట్ కార్డ్ తరహాలోని ఏ క్షణంలోనైనా బ్లాక్ చేసుకోవచ్చు అన్బ్లాక్ చేసుకోవచ్చు. నీ స్మార్ట్ కీ చైన్ ధరను 499 రూపాయలుగా బ్యాంక్ నిర్ణయించింది తర్వాత ఏడాదికి 199 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఈ స్మార్ట్ కీ చైన్ ద్వారా 5000 రూపాయల వరకు పెన్ అవసరం లేకుండానే చెల్లింపులు చేయవచ్చు టర్మినల్ కు మూడు నాలుగు సెంటీమీటర్ల దూరం నుంచి చెల్లింపులు చేయవచ్చు రోజుకు ఇలా అయిదు లావాదేవీల వరకు అనుమతిస్తారు


Monday 25 March 2024

మరో మహమ్మారి రావచ్చు సైంటిస్టుల హెచ్చరిక

 ప్రపంచాన్ని వనికించిన కరోనాను మించిన మరోవైరస్ రాబోతున్నదని శాస్త్రవేత్తలు హెచ్చరించారు కరోనా ప్రభావం తగ్గినప్పటికీ అంతకు మించిన ప్రమాదం ముందుందని అలర్ట్ చేస్తున్నారు స్కై న్యూస్ నివేదిక ప్రకారం జంతువుల నుంచి మానవులకు వ్యాప్తి చెందే మరో మహమ్మారి ప్రభలే అవకాశం ఉన్నదని యూకేకు చెందిన అంటూ వ్యాధుల నిపుణులు చెబుతున్నారు ఏ సమయంలోనైనా మరో మహమ్మారి పుట్టుక రావచ్చని హెచ్చరిస్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏది జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అవసరమైతే త్యాగాలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు గ్లోబల్ వార్మింగ్ అటవీ నిర్మూలన వల్ల వైరస్ లు లేదా బ్యాక్టీరియా జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ప్రమాదం పొంచి ఉన్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు



ఉత్సాహంగా గాంధారి మండల కేంద్రంలో లెహంగి వేడుకలు

 గాంధారి మండల కేంద్రంలోని సేవాలాల్ ఆలయ ఆవరణలో ఆదివారం లెహంగి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా బంజారాలను నృత్యాలు అలరించాయి స్థానిక రైల్వే ఉద్యోగి లచ్చునాయక్ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యుడు శంకర నాయక్ ఎంపీపీ రాధా ఎస్సై ఆంజనేయులు కమిటీ అధ్యక్షుడు మోతీరామ్ తదితరులు పాల్గొన్నారు



26 నుంచి వెంకటేశ్వర ఆలయ వార్షికోత్సవాలు

 బాన్సువాడ పట్టణంలోని వెంకటేశ్వర ఆలయ వార్షికోత్సవ వేడుకలను నాలుగు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు అల్లి కృష్ణ తెలిపారు ఈనెల 26 నుంచి 29వ తేదీ వరకు ఉత్సవాలు ఉంటాయని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వెంకటేశ్వరుని ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు

రేషన్ బియ్యం అమ్మ వద్దు

 గత ఏడాది నుంచి రేషన్ బియ్యం లో పోషకాలు కలుపుతున్నారు. ఇది తెలియక చాలామంది ప్లాస్టిక్ పీఎం అనుకొని రేషన్ బియ్యాన్ని వ్యాపారులకు విక్రయిస్తున్నారు ప్రజలకు పౌష్టికాహారం అందించాలని ఉద్దేశంతో ప్రభుత్వము అన్ని రైస్ మిల్లుల్లో బ్లెండింగ్ యూనిట్లు ఏర్పాటు చేయించింది సాధారణ బియ్యానికి పోషకాలు జతచేసి లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు క్రమం తప్పకుండా ఈ బియ్యం పాడితే మహిళల్లో రక్తహీనత తగ్గుతుందని ప్రభుత్వం పేర్కొంది జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల 53 వేల కార్డుదారులకు ప్రతినెల 5478 మెట్రిక్ టన్నుల బియ్యం అందజేస్తున్నారు



నీటిపై తేలుతున్నాయని పారేయవద్దు

సాధారణ బియ్యం తినడంతో శరీరానికి అంతగా పోషకాలు అందవు అందుకే ప్రభుత్వం సాధారణ బియ్యంలో పోషకాలు కలుపుతోంది 99 కిలోలకు బియ్యానికి ఒక కిలో పోషకాలు జత చేస్తున్నారు ఈ ప్రక్రియ అంతా రైస్ మిల్లులోనే పూర్తవుతుంది బియ్యం వన్డే ముందు కడిగేటప్పుడు నీటి మీద కొన్ని గింజలు తేలుతాయి వాటిని ప్లాస్టిక్ గా భావించి బయటపడేస్తున్నారు కానీ అలా తేలేవే పోషకాల బియ్యం ఇలా తేలినప్పుడు పక్కకు తీసి మిగిలిన బియ్యం కడగాలి ఆ తర్వాత పక్కన తీసిన వాటిని కలుపుకొని వండుకోవాలి వీటిని ప్రాధాన్యం తెలియక చాలామంది లబ్ధిదారులు కిలోకు 16 రూపాయల నుంచి 20 రూపాయల చొప్పున వ్యాపారులకు అమ్మేస్తున్నారు మరికొందరు టిఫిన్ సెంటర్ల వారికి విక్రయిస్తున్నారు రేషన్ పంపిణీ చేసే సమయంలో ప్రతినిలా ఒకటి నుంచి 15వ తేదీలలో ఈ దందా కొనసాగుతోంది

ప్రతి ఒక్కరూ వీటినే తినాలి అని మల్లికార్జున్ బాబు డిఎస్ఓ కామారెడ్డి గారు అన్నారు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో ప్రభుత్వం రేషన్ బియ్యం లో పోషకాలు కలుపుతోంది పాఠశాలలో లబ్ధిదారులకు ఇవే సరఫరా చేస్తున్నాము ఇందులో బి12 ఐరన్ పోలిక్ యాసిడ్ లో ఉంటాయి ప్రతి ఒక్కరు పోషకాల బియ్యం తినడానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన అన్నారు

ఈ ఫోర్టీఫైడ్ రైస్ అంటే పోషకాలబియ్యం లో ఉండేది ఏమిటంటే బీట్ వెల్ ఐరన్ పోలిక్ యాసిడ్లు ఉంటాయి ఇవి నరాల పటిష్టతకు రక్తం వృద్ధి చెందడానికి మెదడు సక్రమంగా పనిచేయడానికి ఉపయోగపడతాయి వీటినే పాఠశాల విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి అంగన్వాడీలకు సరఫరా చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా ఇటీవల పాఠశాల విద్యార్థుల్లో రక్తపరీక్షలు చేయగా ఒక వెయ్యి 4037 మంది రక్తహీనతతో పాద బాధపడుతున్నట్లు తేలింది అలాగే 20,000 మంది మహిళలు ఈ సమస్య ఎదుర్కొంటున్నట్లు పేర్కొంటున్నారు వీటిని తల సేమియా వ్యాధిగ్రస్తులు మినహా అందరూ తినవచ్చు తల సేమియా వ్యాధిగ్రస్తులు రక్త కణాలు కొడవలి ఆకారంలో ఉండడంతో నరాల్లో ఆగిపోయే ప్రమాదం ఉంది అందుకే వారికి ఈ బియ్యం అందించవద్దు


వాహనదారుల సమస్యలకు పరిష్కారం 88103 31033

 హైవే మార్గంపై వెళ్లే వాహనదారుల సమస్యలు తీర్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు స్వచ్ఛత టోల్ ప్లాజా పేరిట హైవే అథారిటీ అధికారులు 8810331033 వాట్స్అప్ నెంబర్ను అందుబాటులో ఉంచారు రోడ్డు ప్రమాదాలు జరిగిన మరుగుదొడ్లు మూత్రశాలలో అపరిశుభ్రంగా ఉన్న తాగునీటి సమస్య దీపాలు వెలగకపోయినా ఇలా సమస్య ఏదైనా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు వాట్సాప్ నెంబర్ కు హాయ్ అని సందేశం పంపిస్తే సంబంధిత అధికారులు ఆప్షన్లు పంపిస్తారు సమస్య ఉన్న ఫోటోలు అప్లోడ్ చేస్తే వెంటనే స్పందిస్తారు

దివ్యాంగులకు వ్యాపార చేయూత

 ఉమ్మడి జిల్లాకు 63 యూనిట్లు మంజూరు

దివ్యాంగులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది ఆర్థిక చేయూత అందించి చిరు వ్యాపారులుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది స్వయం ఉపాధి అవకాశాల కోసం రాయితీ రుణాలు అందించేందుకు సిద్ధమైంది అందులో భాగంగా 2023 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 50వేల రూపాయల నుంచి 3 లక్షల వరకు రాయితీ రుణాలు అందించేలా చర్యలు తీసుకుంటుంది

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని దివ్యాంగులకు 63 యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేసింది 50 వేల రుణాలకు 100% రాయితీ లక్షకు 80 శాతం రెండు లక్షలకు 70% మూడు లక్షలకు 60% చొప్పున రాయితీ రుణాలను అందించనున్నది డబ్బులు పొందిన వారు కిరాణం బట్టల దుకాణం కూరగాయల విక్రం తదితర వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా ఎదగాలి

 త్వరలోనే అర్హుల ఎంపిక

యూనిట్ల అందించేందుకు అర్హులైన దివ్యాంగుల ఎంపికను త్వరలోనే చేపట్టనున్నారు ఎందుకు మండల కమిటీ ఆధ్వర్యంలో వచ్చిన దరఖాస్తులను స్కూటీని చేసి జిల్లా స్థాయిలో అందిస్తారు జిల్లా కమిటీ అర్హుల నుంచి ఒకరిని ఎంపిక చేస్తుంది అనంతరం కలెక్టర్ ఆధ్వర్యంలో రుణాలు మంజూరు చేస్తారు మంజూరైన రుణాలతో లబ్ధిదారులు ఏ యూనిటీ నెలకొల్పారు వాటి చిత్రాలతో సహా రాష్ట్ర కార్యాలయానికి అందించనున్నారు

రైతు రుణాలు పొంది ఆర్థికంగా ఎదగడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది జిల్లాకు 35 యూనిట్లు మంజూరయ్యాయి వాటికి సంబంధించి అర్హులను ఎంపిక చేసే పనిని త్వరలో పూర్తి చేస్తాము రుణాలను సద్వినియోగం చేసుకోవాలి అని జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి నిజామాబాద్ గారు తెలిపారు నిజామాబాద్కు 35 యూనిట్లు కామారెడ్డి జిల్లాకు 28 యూనిట్లు మంజూరయ్యాయి

ఇందూరులో రాజస్థాన్ మట్టి పాత్రలు

 ఎండలు మండుతున్నాయి కాస్త బయట తిరిగి వస్తే వెంటనే చల్లని నీరు తాగాలనిపిస్తుంది ప్రజల అవసరాలకు తగ్గట్లు తక్కువ ధరలకే మట్టితో వివిధ రకాల పాత్రలు తయారు చేస్తున్నారు ముఖ్యంగా రాజస్థాన్ నుంచి తెచ్చిన వివిధ మట్టి పాత్రలు నగరవాసులను అకట్టుకుంటున్నాయి ప్లాస్టిక్ బాటిల్లకు ఏ మాత్రం తీసుకోకుండా వీటిని తయారు చేశారు కంచం గ్లాసు టీ తాగే కప్పులు ముగ్గురు కూరలు వండి మట్టి గిన్నెలు వాటర్ ఫిల్టర్లు ఇలా అన్ని మట్టితో చేసినవే కావడంతో కొనుగోలు చేసేందుకు ప్రజల ఆసక్తి చూపుతున్నారు





బ్రెయిన్ చిప్ సహాయంతో ట్వీట్

 ఎక్స్ అధినేత ఎలా నమస్కకు చెందిన న్యూరాలింక్ కంపెనీ ప్రాజెక్టులు మరో ముందడుగు పడింది పక్షవాత రోగి నోలాండ్ ఆర్బాగ్ తన మెదడులోని చిప్ సహాయంతో మొదటిసారిగా ట్వీట్ చేశారు తన ఆలోచనలు న్యూరాలింకు సైబర్నెట్ ఇంప్లాంట్ సహాయంతో తాను ఈ పని చేశానని ఆయన చెప్పారు నన్ను రోబో అనుకొని ట్విట్టర్ ఎక్స్కో గతంలోని పేరు నన్ను నిషేధించింది కానీ ఎక్స్ ఎలాంటి మాస్క్ తిరిగినా ఖాతా పునరుద్ధరించారు అని ఆయన ట్వీట్ చేశారు న్యూరాలింక్ టెలిపతి పరికరాన్ని ఉపయోగించి కేవలం ఆలోచనల ద్వారా చేసిన మొట్టమొదటి పోస్ట్ అని అర్బాక ట్వీట్కు మస్కస్ స్పందించారు ఇటీవలే అర్బన్ బ్రెయిన్ చిప్ సహాయంతో  వీడియో గేమ్స్ ఆడారు

జేఎన్టీయూ 9 సర్టిఫికెట్ కోర్సులు

 ఆన్లైన్ దరఖాస్తులకు 30 వరకు గడువు

హైదరాబాదులోని జెఎన్టియు ఆధ్వర్యంలో నాలుగు వారాల సర్టిఫికెట్ కోర్సులు ప్రారంభించాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు ఏప్రిల్ ఒకటి నుంచి 27 వరకు 9 కోర్సులను అందుబాటులోకి తేనున్నారు వర్సిటీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఇన్ సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో ఈ కోర్సులు నిర్వహించనున్నట్లు వైసిటి డైరెక్టర్ ప్రొఫెసర్ వార్ శ్రీదేవి ఆదివారం తెలిపారు ఈ మేరకు కోర్సుల వివరాలతో కూడిన బ్రోచర్లను వర్సిటీ వెబ్సైట్లో ఉంచామని తెలిపారు ఈ కోర్సులు ఇంట్రడక్షన్ టు సైబర్ సెక్యూరిటీ ఇంపార్టెన్స్ ఆఫ్ వి ఏ పి టి ఇన్ సెక్యూరిటీ సిస్టం వాల్బర్ బులిటీస్ త్రెడ్స్ ఓవర్ వ్యూ ఆఫ్ పెనిట్రియన్ టెస్టింగ్ లీగల్ ఎథికల్ కన్సన్ట్రేషన  వంటే కోర్సులు ఉన్నాయని ఆసక్తికర అధ్యాపకులు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు అధ్యాపకులు రీసెర్చ్ స్కాలర్షిప్ తో పాటు బీటెక్ ఎం టెక్సమానమైన కోర్సులు డి సి ఏ ఎం సి ఏ బి ఎస్ సి కంప్యూటర్స్ ఎంఎస్సీ కంప్యూటర్స్ వంటి వాటిలో విద్యార్హతలు పొంది ఉండాలని తెలిపారు ఈ కోర్సుల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఈ నెల 30 వరకు పంపాల్సిందిగా కోరారు రిజిస్ట్రేషన్ ఫీజు విద్యార్థులకు 2000 రూపాయలు అధ్యాపకులకు 3000 రూపాయలుగా ఉంటుందని తెలిపారు



చంద్రుడు పై లైన్ రైల్వే లైన్

 చంద్రుడి పై రైల్వే లైన్ నిర్మించేందుకు అమెరికా ప్రభుత్వ ఏజెన్సీ డిఫెన్స్ అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్టు ఏజెన్సీ ప్రణాళిక రచిస్తోంది ముందుగా దీనికి సంబంధించి ఒక కాన్సెప్ట్ ను అభివృద్ధి చేయటంపై కసరత్తు చేస్తోంది లూనార్క్ రైల్వే కాన్సెప్ట్ను అభివృద్ధి చేసేందుకు నార్త్రోప్ గుమ్మాన్ అనే కంపెనీకి కాంట్రాక్టు అప్పగించింది చంద్రుడిపై రైల్వే లైన్ ఎలా నిర్మించవచ్చు అనేదానిపై ఈ కంపెనీ ప్రణాళిక రూపొందించనున్నది చంద్రుడు పై శాశ్వత మానవ నివాస కాలనీలను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా డీ ఏ ఆర్ పి ఏ ఒక ప్రాజెక్టు చేపట్టింది 10 ఏళ్ల లోన ఆర్కిటెక్చర్ క్యాపబిలిటీ స్టడీ అన్నదాంట్లో భాగంగానే లూనార్ రైల్వే కాన్సెప్ట్ను రూపొందిస్తుంది

రెండువేల కిలోల ద్రాక్షతో గణేశుడు ఆలయం ముస్తాబు

 మహారాష్ట్రలోని పూణేలు ప్రసిద్ధిగాంచిన దగడు సేటు వినాయక ఆలయం హోలీ సందర్భంగా ద్రాక్ష పనులతో ముస్తాబయింది సుమారు రెండువేల కిలోల నలుపు ఆకుపచ్చని ద్రాక్షలతో ఆదివారం ఆలయ ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దారు సంకటహర చతుర్థి రోజున ద్రాక్ష మహోత్సవం వైభవంగా జరుపుకుంటారు గణపతి వద్ద ఉంచిన పండ్లను భక్తులు పలు సంస్థలతో పాటు ససుమూన్ దవాఖాన పితాశ్రీ వృద్ధాశ్రమాలకు పంపిణీ చేస్తామని నిర్వాహకులు తెలిపారు

హనుమాన్ దీక్షను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలి

 


హనుమాన్ దీక్షను తీసుకున్న స్వాములు భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని తోపుట పీఠాధిపతి స్వామి మాధవానంద అన్నారు మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయం ఆయన సందర్శించారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు హనుమాన్ స్వాములను ఉద్దేశించి మాట్లాడారు ప్రతి ఏడాది వేసవికాలంలో హనుమాన్ దీక్ష తీసుకున్న వారు అభివృద్ధి చెందుతారన్నారు దీక్ష తీసుకున్న వారికి ఆశీర్వాదం అందజేశారు




మద్నూర్ మండలంలోని శాఖాపూర్ గేటు వద్ద మైనారిటీలు హనుమాన్ స్వాములకు పండ్లను పంపిణీ చేశారు జుక్కల్ మండలం తిమ్మరాజు కల్లాలి నుంచి మద్నూర్ మండలం సలాబత్ కు ఆంజనేయస్వామి ఆలయానికి పాదయాత్రగా వస్తున్న స్వాములకు కాంగ్రెస్ యువ నాయకులు అజీమ్ పటేల్ ఆధ్వర్యంలో అల్పాహారం కింద పండ్లను పంపిణీ చేశారు దేశ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పడానికి మైనారిటీ సోదరులు హిందూ ముస్లింలు భాయి భాయిగా కొనసాగాలన్నారు మాజీ సర్పంచ్ రమేష్ దేశాయి హనుమాన్ స్వాములకు పంటను పంపిణీ చేసిన మైనారిటీలకు కృతజ్ఞతలు తెలిపారు

నియమ నిష్ఠలతో కొనసాగుతున్న రంజాన్ ఉపవాస దీక్షలు

 


ముస్లింల పవిత్ర మాసం రంజాన్ మాసంలో చేపట్టే ఉపవాస దీక్షలు నియమా నిష్టల మధ్య కొనసాగుతున్నాయి ఈనెల 12 నుంచి ప్రారంభమైన ఈ ఉపవాస దీక్షలు ఏప్రిల్ 10 రాత్రికి ముగుస్తాయి శవ్వాళ మాసం చంద్ర దర్శనంతో ఏప్రిల్ 11న ముస్లింలు రంజాన్ ఈద్-ఉల్-ఫితర్ పర్వదినాన్ని జరుపుకోవాలని సన్నద్ధమవుతున్నారు. ఈ మాసంలోనే దివ్య ఖురాన్ ముస్లింల పవిత్ర గ్రంథం దివి నుంచి భూమికి పంపబడిందిగా విశ్వసిస్తూ అత్యంత పవిత్ర రాత్రిగా కొలిచే షబ్బీ ఖద్రి జాగరణ రాత్రిని అత్యంత భక్తిశ్రద్ధలతో దైవారాధనలో గడుపుతారు రంజాన్ ప్రారంభంలో మొదలుపెట్టిన తరావీ నమాజులు దివ్య ఖురాన్ పట్టణం రాత్రి నమాజ్తో ముగిసింది రంజాన్ మాసంలో అన్ని రాత్రుల కన్నా ఈ రాత్రిని శుభాల రాత్రిగా పరిగణిస్తారు రంజాన్ మాసం ఆరంభం నుండి చిన్న పెద్దల నమాజులతో మసీదులు ముస్లింల ఇల్లు దైవారాధనలతో కలకలలాడుతాయి రంజాన్ మాసంలో ముస్లింలు పరస్పర ఇఫ్తార్ విందులలో పాల్గొంటున్నారు. కాగా ఎన్నికల కూడా అమలు ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఇఫ్తార్ విందు ఈసారి లేనట్టుగానే కనిపిస్తుంది. ఈ దఫా ఎండలు దంచి కొట్టడంతో కొంతమేర ఇబ్బందులు తప్పడం లేదు అయినా దీక్షపరులు దైవారాధనలు ఉత్సాహంగా ఈ ఉపవాస దీక్షలో పాల్గొనడం గమనార్హం


భక్తిశ్రద్ధలతో కామ దహనం

 జిల్లా ప్రజలు ఆదివారం రాత్రి భక్తిశ్రద్ధలతో కామ దహనం నిర్వహించారు నీటితో నిండిన బిందెలతో మహిళలు కామెడీకి నీళ్లు పోసి భక్తీశ్రద్ధలతో కామ దహనం నిర్వహించారు హోలీ పండుగను పురస్కరించుకొని రంగులు చల్లుకునే ఒకరోజు ముందు రాత్రి కామ దహనం జరపడం మానవాహితీ కామారెడ్డి బాన్సువాడ ఎల్లారెడ్డి తదితర ప్రాంతాలు కామ దహనం నిర్వహించారు మద్నూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ ఎల్లమ్మ తల్లి తులా వారి గల్లీలతో పాటు ఆయా కాలనీలో కామ దహనం చేశారు ఆనవాయితీగా వస్తున్న కామదానం కోసం పిడకలు కట్టెలు పొగ చేసి కుప్పగా పోస్తారు పౌర్ణమి రోజు అర్ధరాత్రి ఆ కుప్పకు మహిళలు పూజలు నిర్వహించి బోనాలు సమర్పించి మంట పెట్టారు. మానవులు ఇంద్రయాలను నియంత్రించడానికి కామన్కి దహనం చేస్తారని నీతి బోధిస్తోంది అందుకే గ్రామంలో పెద్దలు పిల్లలు కామన్ కి పూజించి కామ దహనం తర్వాత మిగిలిన బూడిదని తీసుకెళ్లి తమలో ఉన్న అహంకారం కాముని లాగా కాల్చివేసి మానవ జన్మ సార్థకం చేసుకున్నారు కామ దహనం అయిన తెల్లారి రంగుల ఆట ఆడుకోవడం జరుగుతుంది గతంలో రంగులను వసంత రుతువులలో చెట్లు చెదిరించే వాటి ద్వారా తయారు చేసే రంగులు చల్లుకునేవారు ఇప్పట్లో రసాయనాలతో తయారైన రంగులను వాడి ఆరోగ్యానికి హాని చేసుకుంటున్నారు 

కొబ్బరి పేర్లు చక్కర పేర్లు ఈ పండుగ ప్రత్యేక

 హోలీ పండుగలు ముఖ్యమైనవి కొబ్బరి పేర్లు చక్కర పేర్లు తమ ఆడపడుచులకు హోలీ పండుగ నుంచి ఉగాది పండుగ వరకు కొబ్బరితో తయారుచేసిన పేర్లు చక్కెర పేర్లు అందచేస్తుంటారు హోలీ పండుగ రోజు బోనాలకు ఈ పేర్లు వేసి వాటిని తమ పిల్లలకు వేస్తుంటారు ఈ ఆచారం మహారాష్ట్ర సరిహద్దు మండలాలైన మద్నూర్ బిచ్కుంద జుక్కల్ మండలాల్లో అధికంగా ఉంటుంది తమ ఆడపడుచులకు నాగపంచమికి బట్టలు రక్షాబంధన్ కు కానుకలు ఇస్తున్న విధంగానే హోలీ పండుగకు కొబ్బరి పేర్లు చక్కర పేర్లు ఇచ్చి దీవెనలు తీసుకుంటారు



డ్రగ్ పార్సెల్ పేరుతో కేటుగాళ్ల ఫోన్ కాల్స్

 ఐఐటిపిహెచ్డీ స్కాలర్కు 31 లక్షల రూపాయల కుచ్చుటోపి జాగ్రత్తగా ఉండాలన్న ఆర్టీసీ ఎండీ సజ్జనర్ మధుర నగర్లో తాజాగా మరో కేసు నమోదు

డ్రగ్ పార్సెల్ పేరుతో కేటుగాళ్లు పోలీసులుగా చెప్పుకుంటూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్టీసీ ఎండీబీసీ సజ్జనర్ హెచ్చరించారు ఈ తరహాలో మోసపోయిన ఓ బాధితుడు సజ్జనాలను కలిసి తన గూడు వెళ్లబోసుకున్నారు ఈ క్రమంలో ప్రజల్లో అవగాహన పెంచేందుకు సజ్జన ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు హలో మేము ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాము. మీ పేరుతో ఫెడెక్స్ లో పార్సిల్ బుక్ అయ్యింది అందులో నకిలీ పాస్పోర్టులు డ్రగ్స్ ఉన్నాయి మీకు ఉగ్రవాదుల మాస్టర్ మైండ్ మహమ్మద్ తో కలిపి పలు బ్యాంకుల్లో జాయింట్ అకౌంట్ ఉన్నాయి అంటూ కేటుగాళ్లు ఫోన్ చేస్తారని సజ్జనార్ వివరించారు అంతటితో ఆగకుండా తాము పోలీసులమేనని నమ్మించేందుకు ఐడి కార్డులు ఎఫ్ఐఆర్ కాపీలను వాట్సాప్ లో పంపుతూ బెదిరిస్తారన్నారు హైదరాబాదుకు చెందిన ఐఐటీ పిహెచ్డి స్కాలర్ నుంచి కేటుగాళ్లు ఇలా విడతల వారీగా 31 లక్షల దోచుకున్నట్లు చెప్పారు ఆ పి హెచ్ డి స్కాలర్ లాప్టాప్ ఫోన్ ను కేటుగాళ్లు హ్యాక్ చేశామంటూ భయపెట్టారు హౌస్ అరెస్ట్ చేస్తున్నామంటూ ఆరు రోజులు ఇంట్లోంచి బయటకు రాకుండా చేశారు అసలు ఈ కేసు ఏంటి నాకేం సంబంధం అని బాధితులు ప్రశ్నిస్తున్న బెదిరింపులను పెంచుతూ పోయారు జాయింట్ అకౌంట్ లో అనుమానాస్పద లావాదేవీల పేరుతో బాధితుడు కుటుంబ సభ్యులు పొదుపు చేసుకున్న 30 ఒక్క లక్ష్యాలను తమ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు జాయింట్ అకౌంట్ లో లావాదేవీలు సక్రమంగా ఉంటే ఆ మొత్తం తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించార అని సజ్జనర్ వివరించారు ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఒకవేళ మోసం జరిగితే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి ఫోన్ చేయాలని వివరించారు

మధుర నగర్ లో 98 వేలకు టోపీ

పైన పేర్కొన్న తరహాలోనే మధురానగర్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఒక కేసు నమోదు అయింది బాధ్యత రాతలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంగళరావు నగర్ లో నివసించే షిఫాలీ పులి అనే మహిళకు ఈనెల 21న ఒక కాల్ వచ్చింది ప్రొడక్ట్స్ నుంచి ఫోన్ చేస్తున్నాం మీ ఆధార్ ఫోన్ నెంబర్తో ముంబై నుంచి ఇరాన్ కు ఓ కొరియర్ బుక్ అయింది ముంబై అంటూ అవతలి వ్యక్తి బెదిరించాడు తాను ఎలాంటి కొరియర్ బుక్ చేయలేదని బాధితురాలు చెప్పగా ముంబై నార్కటిక్స్ బ్యూరో వారితో కాన్ఫరెన్స్ కలిపాడు అవతలి వ్యక్తి మీరు వెంటనే ముంబై రావాలని విచారణకు హాజర అవ్వాలని ఆదేశించారు తాను అక్కడికి రాలేనని బాధితురాలు చెప్పగా స్కైప్ లో విచారిస్తామని చెప్పారు వీడియో కాల్ లో పోలీసు యూనిఫామ్ చేసుకున్న వ్యక్తి బెదిరింపులకు దిగుతూ మీ ఆధార్ కార్డుకు టెర్రరిస్ట్ అకౌంట్లో లింకులు ఉన్నాయి మీ ఖాతాను అందులోని లావాదేవీలను పరిశీలించాలి అని డిమాండ్ చేశాడు ఆమె అకౌంట్లో 98000 ఉన్నట్లు స్క్రీన్షాట్ పంపగా ఆ మొత్తాన్ని తమ ఖాతాకు బదిలీ చేయించుకున్నాడు మీ లావాదేవీలు సభ్యంగా ఉన్నట్లు తేలితే మీ డబ్బు తిరిగి వస్తుందని చెప్పాడు తర్వాత డబ్బు ఇంతకీ రాకపోవడం అవతలి వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు

వాట్సాప్ కు ఏ ఐ హంగు

 ఇమేజ్ ఎడిటింగ్ అస్క్ మెటా ఫీచర్లు త్వరలో అందుబాటులోకి

ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న వాట్సాప్ తాజాగా ఏఐ హంగులు కూడా సమకూర్చుకునే పనిలో పడింది కృత్రిమ మేధ ఏఐ ఆధారిత ఇమేజ్ ఎడిటింగ్ మనకు వచ్చే రకరకాల సందేహాలకు సమాధానం ఇచ్చే ఆస్క్ మెటా ఫీచర్ను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకటించింది ప్రస్తుతానికి ఏఐ ఆధారిత ఇమేజ్ ఎడిటింగ్ కోసం మనం క్రోమ్ బింగ్ లాంటి బ్రౌజర్ అని వాడాల్సి వస్తుంది. ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే వాట్సాప్ లోని ఏఐ సహాయంతో మన చిత్రాలను ఎడిటింగ్ చేసుకోవచ్చు వాటిని పద్యాలను మార్చుకోవచ్చు అలాగే ఇప్పుడు మనకు ఏదైనా సమాచారం కావాలంటే గూగుల్ లో సెర్చ్ చేసి చూసుకుంటాం కదా అలా వాట్సాప్ లో ఆస్క్ మీద అందుబాటులోకి వస్తే మన సందేహాలు అన్నింటిని అక్కడే తీర్చుకోవచ్చు ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ టీచర్లను త్వరలోనే తొలత బీటా వెర్షన్ వాడేవారికి తర్వాత అందరికీ అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం



దోశ నిమ్మరసం అమితాబచ్చన్

 ఇటీవల భారత్ నేపాల్లో పర్యటించిన ఇటలీ రాయబారి విన్సెంట్ లీ లూకా తో కలిసి ఉన్న ఆకర్షణీయమైన వీడియోను ఇటాలియన్ వ్యాసకర్త గివ్లియా సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు నేటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్న ఈ వీడియోలో గీయులియా డీలుక మధ్య జరిగిన సంభాషణలను వివరిస్తుంది భారతీయ సంస్కృతిలోని తనకు నచ్చిన వివిధ అంశాలను ఇటలీ రాయబారి ఈ సందర్భంగా ప్రస్తావించారు భారతదేశంలోని సందడిగా ఉండే వీధుల్లో కలియ తిరగడం నుండి ఆటో రిక్షా టక్ టక్ రైడ్ల వరకు దోష వంటి రుచికరమైన వంటకాల నుంచి నిమ్మరసం వంటి ఆరోగ్యకరమైన పానీయాల వరకు అనేక అంశాలను డీలుక అనుభవాల్లో పేర్కొన్నారు భారత దేశ విభిన్న సాంస్కృతిక వస్త్రాల పట్ల మక్కువను వెల్లడించారు ముఖ్యంగా బాలీవుడ్ దిగ్గజం అమితాబచ్చన్ గురించి ఇటాలియన్ అంబాసిడర్ ప్రస్తావించడం ద్వారా వీరి సంభాషణ బాలీవుడ్ ను కూడా తాగింది ఈ వీడియోకు 52 వేలకు పైగా లైకులు అనేక స్పందనలు వచ్చాయి భారతదేశంలో ఇటలీ రాయబారి వారి ప్రేమకు ప్రజలు ముగ్ధు లయ్యారు.



నియామకాల్లో కొత్త ట్రెండ్ ఘోస్ట్ జాబ్స్

 ప్రపంచవ్యాప్తంగా జాబ్ మార్కెట్లో కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది దీని పేరు ఘోస్ట్ జాబ్స్ ఉద్యోగ ఖాళీలు లేకున్నప్పటికీ నియామకాల కోసం ప్రకటనలు జారీ చేయడం దరఖాస్తులు స్వీకరించడం పరీక్షల నుంచి ఇంటర్వ్యూల దాకా అన్ని ప్రక్రియలు సీరియస్గా నిర్వహించడం ఆ తర్వాత దాన్ని ఎక్కించడానికి ఘోస్ట్ జాబ్స్ అని పిలుస్తున్నారు ప్రస్తుతం మార్కెట్లో ఈతరహాట్ రెండు కొనసాగుతోంది కంపెనీలకు చెలగాటంలో ఉన్న నిరుద్యోగులకు మాత్రం ఇది ఆందోళన కలిగిస్తోంది తాజాగా ఈ పరిణామం గురించి మౌర్యం డబ్బులు క్లాస్ అనే మహిళ సామాజిక మాధ్యమం యాప్ థ్రెడ్లో ఈ తరహా జాబ్స్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు తాను పనిచేసే కంపెనీలోని హెచ్ఆర్ సిబ్బంది ఇలాంటి జాబ్ల కోసం అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయాలని తనను కోరినట్లు ఆమె చెప్పుకొచ్చారు అయితే ఒక రకంగా మోసపూరితంగా కనిపించే ఈ విధానానికి తాను ఒప్పుకోలేదని ఆమె వెల్లడించారు అయితే కంపెనీలు ఈ ఉత్తుత్తి నియామక ప్రక్రియను ఎందుకు చేపడతాయని దానిపై నిపుణులు వేరువేరు కారణాలు చెబుతున్నారు ప్రధానంగా వినిపిస్తున్నది ఏమిటంటే ఇలాంటి ఓపెనింగ్స్ తో అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయడం ద్వారా జాబ్ మార్కెట్స్థితిగతులు అభ్యర్థుల టాలెంట్ స్థాయిలు భవిష్యత్తు అవసరాలకు గల వాతావరణం వంటి వాటిని ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి చాలా కంపెనీలు ఈ విధంగా వ్యవహరిస్తున్నాయని తేలింది

మక్కా మసీదులో ప్రతిరోజు 1500 మందికి ఇస్తారు విందు

 రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని చారిత్రక మక్కా మసీదులు మజిలీ శాసనసభ పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు రంజాన్ పండుగ వరకు 1500 మందికి ఇఫ్తార్ ఏర్పాట్లు ఉంటాయని అక్బరుద్దీన్ తనయుడు నూరుద్దీన్ ఓవైసీ ప్రకటించారు ఆదివారం నుంచి ప్రారంభమైన ఇఫ్తార్ కార్యక్రమాలు సాలారే మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ హబీబీఏ మిల్లర్ పొలిటికల్ రీసర్చ్ సెంటర్ల సంయుక్త ఆధ్వర్యంలో కొనసాగుతాయి అన్నారు ప్రతిరోజు మక్కా మసీదుకు హాజరయ్యే స్థానికులు వ్యాపారులు కొనుగోలుదారులు ఇఫ్తార్ విందు చేసుకోవాలని సదుద్దేశంతో ఏర్పాటు చేసినట్లు నూరుద్దీన్ తెలిపారు తన తండ్రి అక్బరుద్దీన్ ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేయాలని ఆయన కోరారు

కవితల పోటీలకు ఆహ్వానం

 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాల సందర్భంగా డిహెచ్పిఎస్ శ్రీ సత్య సాయి జిల్లా రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో అంబేద్కర్ ఇజం దళిత బహుజన తత్వం పై కవితల పోటీలు 2024 నిర్వహిస్తున్నారు

గెలుపొందిన మొదటి కవితకు 5000 రూపాయలు రెండవ కవితకు 3000 రూపాయలు మూడవ కవితకు 2000 రూపాయలు నగదు బహుమతితో పాటు అంబేడ్కర్ కవితా పురస్కారంతో ఘనంగా సత్కరించడం జరుగుతుంది. అంబేడ్కర్ రీజన్ దళిత బహుజన వాదం అంశంపై రాసిన కవితలు మాత్రమే పంపాలి. 25 పంతులకు మించకుండా రాసిన కవితలని పోటీలకు స్వీకరించబడతాయి ఇదివరకు ఎక్కడా ప్రచురణ పొందినవి కాకుండా ఈ పోటీలకు మాత్రమే రాసిన దయ్యం ఉండాలి. హామీ పత్రం చితపరచాలి ఎంపికైన కవితలతో పాటు 133 మంది కవులను ప్రశంసా పత్రం జ్ఞాపికతో సత్కరించడం జరుగుతుంది. పురస్కారానికి ఎన్నికైన వారు స్వయంగా వచ్చే సత్కారాన్ని స్వీకరించవలెను ఎంపికైన కవితలను జాబిలి మాసపత్రికలో ప్రచురించడం జరుగుతుంది

కవితలను ప్రధాన కార్యదర్శి డాక్టర్ శివన్న 9440805955 వాట్స్అప్ చరవాలని సంఖ్యకు ఏప్రిల్ 5వ తేదీ 2024 వ తేదీ లోపు పంపాలి

జాబిలి చాంద్ భాషా అధ్యక్షులు శ్రీ సత్యసాయి జిల్లా రచయితల సంఘం

పిడుగు ఎప్పుడు పడుతుంది

 చెప్పడం కష్టం కదా భారత వాతావరణ విభాగం మాత్రం మరీ అంత కష్టం కాదని చెబుతోంది మీ తల వెనకాల మెడకు పై భాగంలో వెంట్రుకలు కాస్త నిక్కబడుచున్నట్లు పైకి లేచినట్టు అయిందంటే మీకు అతి  దగ్గరలో పిడుగు పడే అవకాశం చాన్స్ ఉందని అర్థమట అలాగే వాన రాకడ ప్రాణం పోకడ కూడా ఎవరికీ తెలియదనేది సామెత అయితే ఉరుములు మెరుపులతో జడివాన కురిసే పరిస్థితిని కొన్ని అంశాలతో ముందే గుర్తించవచ్చని ఐఎండి పేర్కొంది ఈ మేరకు ఎక్స్ లో సూచనలు చేసింది ఈ సమయంలో ఆకాశంలో బాగా ఎత్తుగా కాలీఫ్లవర్ వంటి ఆకృతిలోని దట్టమైన నల్లటి మేఘాలు అలాగే నిలువుగా మేఘాలు కమ్ముకుంటాయట అప్పటికప్పుడు చల్లటి గాలివీయడం మొదలవుతుందని ఐఎండి తెలిపింది



మొసలి ఎముకలైనా 30 సెకండ్లలో ముటాష్

 ప్రమాదకరమైన చేపలు అనగానే షార్క్ లు , ఫిరాన గుర్తుకు రావడం కామనే కానీ వాటికన్నా ప్రమాదకరమైన ఒక చేప గురించి తెలుసా పెద్దపెద్ద కోరలాంటి పదునైన పళ్ళతో దొరికితే చాలు చీల్చి పడేసే ఆ చేపలు టైగర్ ఫిష్లు ఆఫ్రికా ఖండంలోని సరస్సులు నదుల్లో కనిపించే ఈ చేపలు టార్గెట్ చేశాయంటే ఎంత పెద్ద చేప అయినా నిమిషాల్లో మఠాషల్సిందే ఈ చేపలు మరీ క్రూరంగా దూకుడుగా వ్యవహరిస్తాయి కేవలం 30 సెకండ్లలో ముసళ్ళ ఎముకలను కూడా కొరికిపడేయగలవు చూడడానికి కూడా కాస్త భయం గోలిపేలా ఉన్న ఈ చేపలు మందలు మందలుగా వేటాడుతాయి

నీటి కోసం వచ్చే పక్షులను పట్టేసి 



ప్రపంచంలో అత్యంత క్రూర ప్రవృత్తి ఉన్న చేపలుగా టైగర్ ఫిష్ లకు పేరు ఉన్నది అడుగు నుంచి మూడు అడుగుల వరకు ఉండే ఈ చేపలు సరస్సులు నదులు ఉపరితలానికి కాస్త కింద ఆ మాట వేస్తాయి నీళ్లు తాగడానికి వచ్చే పక్షులు చిన్నపాటి జంతువులను చుట్టుకుని పట్టేసి కొరికి తినేస్తాయి

ఆన్లైన్లో రామయ్య కళ్యాణం టికెట్లు

 భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఏప్రిల్ 17న జరగనున్న రామయ్య కళ్యాణం శ్రీరామనవమి 18న స్వామివారి మహా పట్టాభిషేకం కార్యక్రమాలకు సెక్టార్ టికెట్లను ఆన్లైన్ ద్వారా భక్తులు పొందే అవకాశం కల్పించినట్లు ఈవో రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు కళ్యాణ మహోత్సవానికి 7500 దంపతులు 2500 2000 1000 300 150 పట్టాభిషేకం టికెట్లు 1500 500 రూపాయలుగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు

భక్తులు భద్రాద్రి దేవస్థానం వెబ్ సైట్ https://bhadradritemple.Telangana.gov.in ద్వారా సోమవారం నుంచి బుక్ చేసుకోవచ్చని వివరించారు దేవస్థానంలో నేరుగా టికెట్లు పొందాలని భక్తులకు ఆలయం వద్ద తాళించా కళ్యాణ మండపం బ్రిడ్జి పాయింట్ సి ఆర్ వో కార్యాలయం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు భక్తులు గుర్తింపు కార్డు సిబ్బందికి చూపించి టికెట్లు పొందవచ్చు అని ఈవో సూచించారు

పెళ్లి కోసం పెట్టుబడి ఎక్కడ

 మనదేశంలో వివాహాలు సాధారణంగా చూస్తే తక్కువ ఖర్చుతో ముగిసేవి కావు మీరు అనుకుంటున్నాట్లు ప్రతినెలా 45 వేల రూపాయల చొప్పున వచ్చే ఆరేళ్ల పాటు ఇన్వెస్ట్ చేసినట్లయితే గననీయమైన మొత్తం సమకూర్తుంది వివాహం లక్ష్యం విషయంలో రాజీ పడలేము అనుకున్న సమయానికి కావాల్సినంత చేతికి అందాల్సిందే వాయిదా వేయడానికి ఉండదు తక్కువ రిస్కు కోరుకునేవారు మధ్యమార్గాన్ని అనుసరించాలి 50 శాతాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీని వల్ల పెట్టుబడికి రెస్క్ ఉండదు మిగిలిన 50 శాతాన్ని వృద్ధి కోసం ఈక్విటీలకు కేటాయించుకోవాలి డెట్ విషయంలో షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ లేదా టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్ను ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీ పెట్టుబడులకు లార్జ్ క్యాప్ ఫండ్స్ లేదా లో కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్ నుంచి ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ అధిక రిస్కు తీసుకునే సామర్థ్యం ఉంటే అప్పుడు కాస్త దూకుడుగా పెట్టుబడిన సాధనాలను ఎంపిక చేసుకోవచ్చు ఆటుపోట్లను తట్టుకునేట్లయితే ఈక్విటీలకు 65% నుంచి 80 శాతాన్ని కేటాయించుకోవచ్చు మిగిలిన మొత్తాన్ని డెట్ సాధనాలకు కేటాయించుకోవాలి బంగారం కోసమే అయితే సార్వభౌమ బంగారం బాండ్లలో ఎస్జీబీలు కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు బంగారం విలువ పెరుగుదలకు తోడు పెట్టుబడి విలువపై ఏటా 2.5% వడ్డీ రేటు లభిస్తుంది ఈ బంగారంతో సోదరి పెళ్లి కోసం కావాల్సిన ఆభరణాలు చేయించవచ్చు

పోక్సో ఈ బాక్స్ తో బాధితులకు భరోసా

 మైనర్లు మహిళలపై దాడులు వేధింపుల ఘటనలు ప్రతిరోజు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి పలు కారణాలతో చాలా ఘటనలు బయటకు రాకుండా రాజులతో ముగిసిపోతున్నాయి వీటిపై ఫిర్యాదు చేసేందుకు ప్రజలు భయపడుతున్నారు ఇలాంటి వాటికి చెక్ పెడుతూ ఫిర్యాదుదారుల వివరాలు పోలీసులకు సైతం తెలియకుండా రహస్యంగా ఉంచి బాధ్యతలు బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల సరికొత్త యాప్ అందుబాటులోకి తెచ్చింది ఆన్లైన్ వేదికగా ఫోక్సో ఈ బాక్స్ పేరిట యాప్ ను రూపొందించింది కళ్ళ ముందు వేధింపులు అఘాయిత్యాలు జరిగితే ధైర్యంగా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు



కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ యాప్ లో వచ్చే ఫిర్యాదులను ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తుంది. యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి రాష్ట్ర జిల్లా కార్యాలయానికి ఒకేసారి సమాచారం ఇస్తారు బాలల సంరక్షణ అధికారి సిబ్బంది విచారణ చేపడతారు 100% పారదర్శకతతో కేసు నమోదు అవుతుంది ఫిర్యాదుదారులకు రక్షణ ఉండేలా నేరానికి పాల్పడిన వారికి శిక్షపడేలా యంత్రాంగం తోడ్పాటునందిస్తుంది. యాప్ పై అధికారులు గ్రామీణ స్థాయి నుంచి అవగాహన కల్పిస్తే చాలా వరకు వేధింపుల కేసులకు అడ్డుకట్ట వేయవచ్చు అని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది

కాలికలు మహిళల సంరక్షణను సామాజిక బాధ్యతగా భావించే ప్రతి ఒక్కరు స్మార్ట్ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఫోక్సో ఈ బాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలు తెలిస్తే ఈ యాప్ ఓపెన్ చేసి ఈ బాక్స్ పై క్లిక్ చేయాలి చిన్నారులకు ఎదురయ్యే ఆరు రకాల హింసలకు సంబంధించిన చిత్రాలు ఇందులో కనిపిస్తాయి ఘటనకు సంబంధించిన హింస స్వభావాన్ని గమనించి చిత్రంపై క్లిక్ చేయాలి అనంతరం ఫిర్యాదు పత్రంలో బాధితులకు జరిగిన ఘటన వివరాలు పొందుపరిచి సమర్పించాలి