22, ఆగస్టు 2026, శనివారం

వెల్డర్ కోర్సులో.. ఉచిత శిక్షణ

 యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పురంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ లో " మేధ చారిటబుల్ ట్రస్ట్ " ఆధ్వర్యంలో మూడు నెలల కాల వ్యవధి గల "వెల్డర్ కోర్సులో ఉచిత శిక్షణ" ఇస్తున్నట్లు సంస్థ ఛైర్మన్ ఎన్ కిశోర్ రెడ్డి తెలిపారు. 

ఎస్సెస్సీ విద్యార్హతతో పాటు 18-25 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారు ఈ నెల 27 లోపు సంస్థ లో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో " ఉచిత హాస్టల్, ఉచిత భోజన సదుపాయం కూడా కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం తప్పని సరిగా ఉద్యోగం కూడా కల్పిస్తామని తెలిపారు 

పూర్తి సమగ్ర వివరాలకు 9133908000,9948466111 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

21, ఆగస్టు 2026, శుక్రవారం

ఫ్రీ నీట్ కోచింగ్.. గిరిజన విద్యార్థులకు

 తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన గురుకులాలు ప్రభుత్వ జూనియర్ కళాశాల ల నుండి 2026 లో ఇంటర్ బై పీసీ ఉత్తీర్ణులై , నీట్ పరీక్ష లో 200 కు పైగా మార్కులు పొందిన గిరిజన విద్యార్థులకు నీట్ లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు గిరిజన గురుకుల సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది. 

అర్హులైన గిరిజన అభ్యర్థులు గిరిజన గురుకుల సొసైటీ ని సంప్రదించి దరఖాస్తులు సమర్పించాలని సొసైటీ అధికారులు తెలిపారు.

తిరుగు ప్రయాణం టికెట్ బుక్ చేస్తే.. 10% రాయితీ

 తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టికెట్ల పై రాయితీ ప్రకటించింది. ప్రయాణికులు తాము వెళ్లవలసిన గమ్య స్థానం, తిరుగు ప్రయాణం టికెట్లు ఒకే సారి బుక్ చేసుకుంటే రిటర్న్ జర్నీ టికెట్ ధర లో 10% రాయితీ కల్పిస్తామని తెలిపింది. ఒక బుకింగ్, రెండు ప్రయాణాలు, ఎక్కువ మిగులు నినాదంతో RTC ఈ విధానం అందుబాటులోకి తెచ్చింది. కాగా అన్ని రకాల బస్సులలో ఈ రాయితీ సౌకర్యం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.