FINANCIAL AND BUSINESS AWARENESS లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
FINANCIAL AND BUSINESS AWARENESS లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, ఫిబ్రవరి 2026, బుధవారం

వ్యాపారుల కోసం బిల్డ్..బోయింగ్ ఆఫర్..

 అప్లికేషన్లు కోరిన బోయింగ్..

 విమానాల తయారీ సంస్థ  బోయింగ్ తన యూనివర్సిటీ ఇన్నోవేషన్ లీడర్షిప్ డెవలప్మెంట్ /బిల్డ్  ప్రోగ్రాం 5 ఎడిషన్ కొరకు అప్లికేషన్లను ఆహ్వానిస్తోంది.

భారత విద్యార్థులు మరియు వర్ధమాన పారిశ్రామికవేత్తల వినూత్న ఆలోచనలను వ్యాపారంగా మార్చడమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. 

2019లో ప్రారంభమైన బిల్డ్ ప్రోగ్రామ్ ద్వారా ఇప్పటికే వేలాదిమంది గ్రాడ్యుయేట్లు , స్టార్ట్ అప్ లు ప్రయోజనం పొందాయి.. 

అర్హత..

ఏరో స్పేస్ ,టెక్నాలజీ, డిఫెన్స్ ,సస్టెనేబిలిటీ, సోషల్ ఇంపాక్ట్ రంగాలలో వినూత్న ఆలోచన లు ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 

ప్రయోజనం ఏమిటి?

ఎంపికైన వారికి శిక్షణ ఇస్తారు .విజేతలకు తమ ఆలోచనలను అభివృద్ధి చేసుకోవడానికి పది లక్షల రూపాయల గ్రాంట్ అందజేస్తారని బోయింగ్ తెలిపింది. ఔత్సాహిక అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని ప్రయోజనం పొందాలని కోరింది.

29, మార్చి 2024, శుక్రవారం

ఏప్రిల్ లో వచ్చే మార్పులు ఇవే

 ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్థిక సంబంధ అంశాల్లో పలుమార్పులు జరగనున్నాయి క్రెడిట్ కార్డుల వినియోగం మొదలు జాతీయ పెన్షన్ పథకం వరకు ఏప్రిల్ లో పలు నిబంధనలు మారబోతున్నాయి

ఏప్రిల్ ఒకటి నుంచి అన్ని జీవిత ఆరోగ్య జనరల్ బీమా పాలసీలను డిజిటల్ చేయాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది పెరుగుతున్న ఆన్లైన్ మోసాల నేపథ్యంలో జాతీయ పెన్షన్ పథకం అకౌంట్లకు మరింత భద్రత కల్పించేందుకు ఏప్రిల్ ఒకటి నుంచి 2 ఫ్యాక్టర్ ఆధార్ అదెంటిఫికేషన్ చేరుస్తోంది

పలు డెబిట్ కార్డులపై వార్షిక మెయింటెనెన్స్ చార్జీలను 75 రూపాయల వరకు పెంచుతున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది విదేశీ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లో ఏప్రిల్ ఒకటి నుంచి పెట్టుబడులను నిలిపివేయాలని అసెట్ మేనేజర్లను సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ ఆదేశించింది ఏప్రిల్ ఒకటి నుంచి ఓలా మనీ ని పూర్తిగా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ గా మారుస్తున్నట్లు ఓలా ప్రకటించింది గరిష్టంగా పదివేల రూపాయల నెలవారి లోడ్ లిమిట్ తో సేవలు అందించనున్నట్లు తెలిపింది ఉచితంగా ఎయిర్పోర్ట్ లాంగ్ వినియోగించుకోవడానికి సంబంధించి క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఐసిఐసిఐ బ్యాంకు ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త నిబంధనలను అమలు చేయనున్నది యాక్సిస్ బ్యాంకు మాత్రం డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజులను వినియోగించుకోవడానికి ముందు త్రైమాసికంలో క్రెడిట్ కార్డు నుంచి కనీసం  రూపాయలు 50,000 వెచ్చించాలని తెలిపింది

ఎస్ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగదారులు ఒక త్రైమాసికంలో కనీసం 10,000 రూపాయలు క్రెడిట్ కార్డులో వెచ్చిస్తే తర్వాతి త్రైమాసికంలో ఉచితంగా డొమెస్టిక్ లంజలు వినియోగించుకోవచ్చని తెలిపింది ఏప్రిల్ ఒకటి నుంచి క్రెడిట్ కార్డుల రివార్డ్ పాయింట్స్ లో ఎస్బిఐ కీలక మార్పులు చేయనున్నది ఎస్బిఐ ఆరం ఎలైట్ ఎలైట్ అడ్వాంటేజ్ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డులు వాడుతున్న వారు క్రెడిట్ కార్డు నుంచి చేసే అద్ద చెల్లింపులకు రివార్డ్ పాయింట్స్ ఉండవు ఏప్రిల్ ఒకటిన కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో ఆ ఒక్క రోజున 2000 రూపాయల నోట్లు మార్చుకునే కేంద్రాలు పనిచేయవని ఆర్బిఐ తెలిపింది

27, మార్చి 2024, బుధవారం

ఆర్థికంగా ఎదగాలంటే

 ఎన్ని చదువులు చదివినా ఉద్యోగం చేసిన ఆర్థిక ఎదుగుదల ఎదుగుదల ఉంటేనే మనలో ధైర్యం ఉండే అయితే చిన్నతనంలో ఉంటారుగా పెరిగినవారు ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లండన్ లోని కింగ్స్ కాలేజీ యువతపై చేసిన పరిశోధనలో వెళ్లడైంది అటువంటివారు ఉద్యోగాలు చదువులు శిక్షణ లాంటి పలు అంశాలలో వారిని వారు తక్కువగా భావిస్తున్నారట ఆత్మవిశ్వాసం సన్నగిల్లి ఇతరులతో పోటీపడి ఉద్యోగాలు సాధించలేకపోతున్నారట తద్వారా సామాజికంగాను ఆర్థికంగాను వెనుకబడుతున్నారు అందుకే చిన్నతనం నుంచి పిల్లలు ఒంటరిగా ఉండకుండా నలుగురిలోనూ కలిసేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి అప్పుడే అన్ని నైపుణ్యాలను వెంటపట్టించుకుని అవకాశాలు అందిపుచ్చుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు

26, మార్చి 2024, మంగళవారం

కీ చైన్ తో పేమెంట్.. ఫెడరల్ బ్యాంక్

 ఫ్లాష్ పే పేరుతో అందుబాటులోకి పిన్ నెంబర్ ఎంటర్ చేయకుండా 5000 రూపాయల వరకు చెల్లింపులకు ఛాన్స్ రోజుకు ఐదు లావాదేవీలు చేయవచ్చు ఓ పి ఎస్ మెషిన్ల వద్ద రోజుకు గరిష్టంగా లక్ష రూపాయలకు అవకాశం ఫెడరల్ బ్యాంక్ వినూత్న ఆవిష్కరణ డెబిట్ క్రెడిట్ కార్డు తరహాలోనే వినియోగం స్మార్ట్ కీ చైన్ ధర 499 రూపాయలు మాత్రమే. ఏడాదికి రుసుము 199 రూపాయలు



ప్రైవేట్ రంగానికి చెందిన ఫెడరల్ బ్యాంక్ ఫ్లాష్ పై పేరుతో రూపే స్మార్ట్ కీ చైన్లు తీసుకువచ్చింది ఈ స్మార్ట్ కీ చైన్ తో కాంట్రాక్టు లెస్ చెల్లింపులు చేయవచ్చు ప్రస్తుతం క్రెడిట్ డెబిట్ కార్డులో ఉన్న టాప్ అండ్ పే ఫీచర్ తరహాలోనే ఇది పనిచేస్తుంది ఈ చిన్న కీ చైన్ ఉంటే సులభంగా చెల్లింపులు చేయవచ్చు పిన్ని ఎంటర్ చేయకుండానే ఐదువేల రూపాయల వరకు కాంటాక్ట్ పేమెంట్లు చేయవచ్చు ఆపై మొత్తానికి పిన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది గరిష్టంగా లక్ష రూపాయల వరకు చెల్లింపులు చేయవచ్చు ఫ్లాష్ పేరు స్మార్ట్ కీ చైన్ ఉంటే బయటకు వెళ్ళినప్పుడు క్రెడిట్ డెబిట్ కార్డు వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం లేదని బ్యాంక్ తెలిపింది ఎంపీ సీఐతో కలిసి ఈ స్మార్ట్ కి చైను తీసుకువచ్చినట్లు తెలిపింది ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లు దీన్ని తీసుకోవచ్చు సేవింగ్స్ కరెంట్ ఖాతా ఉన్న కస్టమర్లు నెట్ బ్యాంకింగ్ లోకి వెళ్లి ఈ స్మార్ట్ కీ చైన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఫెడరల్ బ్యాంక్ మొబైల్ నెట్ బ్యాంకింగ్ ఐ.వి.ఆర్ కాలింగ్ ద్వారా పిన్ సెట్ చేసుకోవచ్చు. క్రెడిట్ డెబిట్ కార్డ్ తరహాలోని ఏ క్షణంలోనైనా బ్లాక్ చేసుకోవచ్చు అన్బ్లాక్ చేసుకోవచ్చు. నీ స్మార్ట్ కీ చైన్ ధరను 499 రూపాయలుగా బ్యాంక్ నిర్ణయించింది తర్వాత ఏడాదికి 199 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఈ స్మార్ట్ కీ చైన్ ద్వారా 5000 రూపాయల వరకు పెన్ అవసరం లేకుండానే చెల్లింపులు చేయవచ్చు టర్మినల్ కు మూడు నాలుగు సెంటీమీటర్ల దూరం నుంచి చెల్లింపులు చేయవచ్చు రోజుకు ఇలా అయిదు లావాదేవీల వరకు అనుమతిస్తారు


25, మార్చి 2024, సోమవారం

పెళ్లి కోసం పెట్టుబడి ఎక్కడ

 మనదేశంలో వివాహాలు సాధారణంగా చూస్తే తక్కువ ఖర్చుతో ముగిసేవి కావు మీరు అనుకుంటున్నాట్లు ప్రతినెలా 45 వేల రూపాయల చొప్పున వచ్చే ఆరేళ్ల పాటు ఇన్వెస్ట్ చేసినట్లయితే గననీయమైన మొత్తం సమకూర్తుంది వివాహం లక్ష్యం విషయంలో రాజీ పడలేము అనుకున్న సమయానికి కావాల్సినంత చేతికి అందాల్సిందే వాయిదా వేయడానికి ఉండదు తక్కువ రిస్కు కోరుకునేవారు మధ్యమార్గాన్ని అనుసరించాలి 50 శాతాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీని వల్ల పెట్టుబడికి రెస్క్ ఉండదు మిగిలిన 50 శాతాన్ని వృద్ధి కోసం ఈక్విటీలకు కేటాయించుకోవాలి డెట్ విషయంలో షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ లేదా టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్ను ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీ పెట్టుబడులకు లార్జ్ క్యాప్ ఫండ్స్ లేదా లో కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్ నుంచి ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ అధిక రిస్కు తీసుకునే సామర్థ్యం ఉంటే అప్పుడు కాస్త దూకుడుగా పెట్టుబడిన సాధనాలను ఎంపిక చేసుకోవచ్చు ఆటుపోట్లను తట్టుకునేట్లయితే ఈక్విటీలకు 65% నుంచి 80 శాతాన్ని కేటాయించుకోవచ్చు మిగిలిన మొత్తాన్ని డెట్ సాధనాలకు కేటాయించుకోవాలి బంగారం కోసమే అయితే సార్వభౌమ బంగారం బాండ్లలో ఎస్జీబీలు కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు బంగారం విలువ పెరుగుదలకు తోడు పెట్టుబడి విలువపై ఏటా 2.5% వడ్డీ రేటు లభిస్తుంది ఈ బంగారంతో సోదరి పెళ్లి కోసం కావాల్సిన ఆభరణాలు చేయించవచ్చు

22, మార్చి 2024, శుక్రవారం

ఒకటి నుంచి క్రెడిట్ కార్డుల కొత్త రూల్స్

 కొత్త ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ కార్డుల విషయంలో కొన్ని మార్పులు రానున్నాయి ఎస్బిఐ ఐసిఐసిఐ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఎస్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు లాంచ్ యాక్సెస్ రివార్డ్ పాయింట్ల విషయంలో మార్పులు తీసుకువస్తున్నాయి దీనిపై ఆయా బ్యాంకులో కార్డుదారులకు సమాచారం అందించాయి ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బిఐ క్రెడిట్ కార్డుల రివార్డు పాయింట్ల విధానంలో మార్పులు చేసింది ఇప్పటివరకు అర్థ చెల్లింపులపై రివార్డ్ పాయింట్లు అందిస్తున్న బ్యాంక్ ఇకపై ఈ చెల్లింపులకు రివార్డ్ పాయింట్లు నిలిపివేసింది ఏప్రిల్ ఒకటి నుంచి ఈ నిబంధనలు వర్తించనున్నాయి. ఎస్బిఐ ఎందిస్తున్న అన్ని అరుణ్ ఎస్బిఐ కార్డ్ ఎలైట్ సింప్లీ క్లిక్ కార్డులు వినియోగిస్తున్న వారికి ఈ కొత్త నిబంధన వర్తించనుంది. ఐసిఐసిఐ బ్యాంకు కూడా కంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ విషయంలో నిబంధనలను సవరించింది రానున్న త్రైమాసికంలో ఈ సదుపాయం పొందాలంటే అంతకుముందు త్రైమాసికంలో కనీసం 35వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది కోరల్ క్రెడిట్ కార్డు మెక్మైట్రిప్ ప్లాటినం క్రెడిట్ కార్డు తో పాటు అన్ని రకాల కార్డులకు ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది. ఎస్ బ్యాంకు కూడా లాంచ్ యాక్సెస్ లో నిబంధనలను సవరించింది అంతకుముందు త్రైమాసికంలో 10,000 వ్యయం చేసిన వారికి లాంచ్ యాక్సిస్ ఇవ్వనుంది యాక్సిస్ బ్యాంక్ మాగ్నస్ క్రెడిట్ కార్డు పై రివార్డ్ పాయింట్ల లాంచ్ యాక్సెస్ తో పాటు వార్షికోత్సవంలో కీలక మార్పులు చేసింది బీమా గోల్డ్ ఆభరణాలు ఇంధనం కోసం క్రెడిట్ కార్డు ద్వారా జరిపే చెల్లింపులపై ఇకనుంచి ఎలాంటి రివార్డు పాయింట్లు ఇవ్వడం లేదని తెలిపింది

19, మార్చి 2024, మంగళవారం

సాంసంగ్ హోలీ సేల్ ప్రారంభం

 కనీసం మరి ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్ హోలీ సేల్ను ప్రారంభించింది స్మార్ట్ ఫోన్స్ లాప్టాప్ లు టాబ్లెట్స్ వేరేబుల్స్ శాంసంగ్ టీవీలు ఇతర డిజిటల్ యాక్సిసరి లపై బంపర్ ఆఫర్లు ప్రకటించింది ఆఫర్లు శాంసంగ్ వెబ్సైట్ సాంసంగ్ షాప్ యాప్ సాంసంగ్ ఎక్స్ క్లూజివ్ స్టోర్ లలో అందుబాటులో ఉంటాయి ప్రముఖ బ్యాంక్ డెబిట్ క్రెడిట్ కార్డులపై కస్టమర్లు గరిష్టంగా 22.5% క్యాష్ బ్యాక్ గరిష్టంగా 25 వేల రూపాయల వరకు పొందుతారు ఈ సేల్ ఈనెల 26న ముగుస్తుంది గెలాక్సీ సిరీస్ ఫోన్లపై 60 శాతం వరకు లాప్టాప్ లపై 45% తగ్గింపు ఇస్తామని కంపెనీ ప్రకటించింది టీవీ కొంటె పాత టీవీ ని ఎక్స్చేంజి చేసుకోవచ్చు

18, మార్చి 2024, సోమవారం

బీమా పాలసీల మోసపూరిత అమ్మకాలు ఆపండి

 బీమా పాలసీల మోసపూరిత అమ్మకాలను నిలువరించి ఖాతాదారుల ప్రయోజనాలు కాపాడాలని ప్రభుత్వరంగ బ్యాంకులకు ఆర్థిక శాఖ సూచించింది ఆర్థిక సర్వేసుల శాఖ కార్యదర్శి వివేక్ జోషి ఈ విషయం చెబుతూ బీమా పాలసీల విక్రయంలో మోసపూరిత అనైతిక విధానాలు అనుసరిస్తున్నారు అన్న ఫిర్యాదులు తమకు నిరంతరం అందుతూనే ఉన్న నేపథ్యంలో బ్యాంకులకు ఈ సూచన చేసినట్లు తెలిపారు బ్యాంకు కస్టమర్ల నుంచి పాలసీలు చేయించడం కోసం జీవిత బీమా కంపెనీలు బ్యాంకులు కూడా ఈ తరహా విధానాలు అనుసరిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని ఆయన అన్నారు కస్టమర్లు ఏదైనా రుణం తీసుకునేందుకు టర్మ్ డిపాజిట్ చేసేందుకు బ్యాంకుకు వెళ్లిన సమయంలో వారికి పాలసీలు అంటగడుతూ ఉంటారు ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలలో 75 సంవత్సరాల వయసు పైబడిన కస్టమర్లకు కూడా జీవిత బీమా పాలసీలు అంటగట్టిన సందర్భాలు ఉన్నాయని తేలింది పాలసీ తీసుకునే విషయంలో కస్టమర్లు ప్రతిఘటించిన తమకు పైనుంచి ఒత్తిడిలు వస్తున్నట్లు బ్యాంకు అధికారులు చెబుతున్న విషయం కూడా వెలుగులోకి వచ్చింది ఇలాంటి ధోరణులపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ అభ్యంతరం ప్రకటించింది భీమా ఉత్పత్తులు విక్రయించినందుకు ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల బ్యాంకు సిబ్బందిపై ఒత్తిడి పెరగడంతో పాటు ప్రధాన వ్యాపార లక్ష్యం దెబ్బతింటుందని వ్యాఖ్యానించింది

7, మార్చి 2024, గురువారం

గోల్డ్ బాండ్లు అంటే ఏమిటి

 నగలు కడ్డీలు నాణేలు తదితర భౌతిక బంగారానికి చట్టబద్ధ పత్ర రూపమే ఈ సావరిన్ గోల్డ్ బాండ్లు కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిని జారీ చేస్తుంది కాబట్టి అత్యంత సురక్షితమైన పెట్టుబడులుగా వీటిని పేర్కొనవచ్చు ఈ బాండ్లకు 8 ఏళ్ల లాకింగ్ పీరియడ్ ఉంటుంది అయినప్పటికీ ఐదేళ్ల తర్వాత నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు వీలుంటుంది సెకండరీ మార్కెట్లో అప్పటి గోల్డ్ రేట్ ప్రకారం తిరిగి అమ్ముకోవచ్చు బ్యాంకులు, కొన్ని పోస్ట్ ఆఫీస్ ల ద్వారా ఈ బాండ్లను కొనుక్కోవచ్చు. బాంబే స్టాక్ చేంజ్ నేషనల్ స్టాక్ చేంజ్ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లు కూడా విక్రయిస్తాయి ఇక బాండ్ల ధరను వాటిని జారీ చేయడానికి ముందున్న మూడు రోజుల 24 క్యారెట్ బంగారం ముగింపు ధర భారతీయ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ నిర్దేశించిన రేట్లు ల సగటు ఆధారంగా నిర్ణయిస్తారు 2.5% వార్షిక కూపన్ వడ్డీ రేటు ఉంటుంది మధుపర్లకు ఆరు నెలలకు ఒకసారి దీని ప్రకారం చెల్లింపులు జరుగుతాయి కాగా ఇండివిజువల్స్ హిందూ అవిభాజ్య కుటుంబాలకైతే గ్రాము నుంచి నాలుగు కిలోల దాకా సంస్థలు ట్రస్టులకైతే గరిష్టంగా 20 కిలోల వరకు పెట్టుబడికి అవకాశం ఉంటుంది బాండ్ కున్న మార్కెట్ విలువలో 75% వరకు రుణంగా పొందవచ్చు బాండ్లను పూర్తికాల పరిమితైన ఎనిమిదేళ్లు ఉంచుకుంటే ఆ తర్వాత వచ్చే దానిపై క్యాపిటల్ గేయిన్స్ టాక్స్ ఉండదు. అయితే ఈ ఎనిమిదేళ్ల కాలంలో వాయిదాలలో పొందే వడ్డీ ఆదాయంపై మాత్రం పన్ను పడుతుంది. మీ మీ ఆదాయ పన్ను స్లాబుల ప్రకారం ఇది వర్తిస్తుంది

5, మార్చి 2024, మంగళవారం

ఐఐఎఫ్ఎల్ గోల్డ్ లోన్లపై ఆర్.బి.ఐ బ్యాంక్

 ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ గోల్డ్ లోన్లు ఇవ్వడాన్ని ఆపాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది కంపెనీ తన గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియోను సరిగా పట్టించుకోవడంలేదని పేర్కొంది కస్టమర్లు నష్టపోకుండా ఉండేందుకు ఆర్బిఐ ఈ చర్యలు తీసుకుంది కంపెనీ ఆర్థిక పరిస్థితులను చెక్ చేసేందుకు కింద తేడాది మార్చి 31న ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ బుక్ లను ఆర్బిఐ తనిఖీ చేసింది లోన్లను ఇచ్చేటప్పుడు డిఫాల్ట్ల బంగారాన్ని వేలం వేసేటప్పుడు గోల్డ్ ప్యూరిటీ నేటి వెయిట్ కొలవడంలో తేడాలు ఉన్నాయని ఆర్బిఐ పేర్కొని అలానే గోల్డ్ వేల్యూలో ఇచ్చే లోన్ పరిమితులను క్యాష్ రూపంలో అప్పులు రికవరీ చేయడంలో అప్పుల పంపిణీలో లిమిట్స్ ను ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ ఉల్లంఘించిందని ఆర్బిఐ వెల్లడించింది స్టాండర్డ్ యాక్షన్ ప్రాసెస్ను ఫాలో కావడం లేదని కస్టమర్లపై వేసే చార్జీలో పారదర్శకత లేదని తెలిపింది ఇప్పటికే ఉన్న గోల్డ్ లోన్ కస్టమర్లకు ఐ ఎఫ్ఎఎల్ తన సర్వేలను కొనసాగించవచ్చని ఆర్బిఐ పేర్కొంది లోన్ రికవరీ ప్రాసెస్ కలెక్షన్స్ కొనసాగించవచ్చని తెలిపింది. రెగ్యులేషన్స్ను ఉల్లంఘించడంతోపాటు ఇటువంటి చర్యల వలన కస్టమర్లు తీవ్రంగా నష్టపోతారు. అని ఆర్బిఐ కామెంట్ చేసింది కంపెనీ సీనియర్ మేనేజ్మెంట్ ఆడిటర్లతో టచ్ లో ఉన్నామని ఈ లోపాలపై చర్చించామని అన్నది లోపాలను సరిదిద్దుకోవడానికి కంపెనీ ఇంకా చర్యలు మొదలుపెట్టలేదని కస్టమర్ల సేఫ్టీ ని దృష్టిలో పెట్టుకొని కాజా రెస్ట్రిక్షన్లు పెట్టామని ఆర్బిఐ పేర్కొంది స్పెషల్ ఆడిట్ చేపడుతున్నామని ఇది పూర్తయ్యాక మరోసారి రివ్యూ చేపడతామని తెలిపింది



4, మార్చి 2024, సోమవారం

మార్చి 31 లో ఇలా చేయండి

 31 లోగా పిపిఎఫ్ సుకన్య ఖాతాలలో కనీస మొత్తాన్ని జమ చేయండి మార్చి 31 లోపు ఇలా చేయకపోతే ఇబ్బందులు తప్పవు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023 24 చివరి నెల మార్చి ప్రారంభమైనది ఈ నెలలో చాలా ముఖ్యమైన పనులను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు యాక్టివ్గా ఉండేందుకు వాటిలో కనీస పెట్టుబడి పెట్టాలి 2024 మార్చి 31 వరకు పిపిఎఫ్ ఎస్ఎస్వై లో కనీసం మొత్తం డబ్బు డిపాజిట్ చేయకపోతే ఈ ఖాతాలు పనిచేయవు వాటికి మళ్లీ యాక్టివేట్ చేయడానికి మీరు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది ఈ పథకాలలో కనీస పెట్టుబడి తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా ఉన్నవారికి కనీస డిపాజిట్ 500 రూపాయలు అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 500 రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది కనీసం మొత్తం డిపాజిట్ చేయకపోతే సదర్ కస్టమర్ ఖాతా మూసివేస్తారు దీనిలో డబ్బు డిపాజిట్ చేయడానికి మార్చి 31 చివరి తేదీ గడువు ఉంటుంది ఈ తేదీలోగా డబ్బు డిపాజిట్ చేయకపోతే ఖాతాను తిరిగి తెరవడానికి సరి మన చెల్లించాలి ఏడాదికి 50 రూపాయల చొప్పున ఈ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది అంటే రెండు సంవత్సరాలు డబ్బు పెట్టుబడి పెట్టకపోతే ఒక సంవత్సరంలో 50 రూపాయలకే బదులుగా 100 రూపాయలు జరిమానా చెల్లించాలి

టీపీఎఫ్ వివరాలు ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలలో జమ చేసిన మొత్తం పై 7.1 శాతం వడ్డీ వస్తోంది

డిపాజిట్లపై వడ్డీ వార్షిక ప్రాతిపదికన లెక్కిస్తారు అంటే ప్రతి సంవత్సరం ప్రధాన మొత్తానికి ఈ వడ్డీని కలుపుతారు పిపిఎఫ్ పథకంలో మొత్తం మూడు రిటర్న్లు మెచ్యూరిటీ మొత్తం వడ్డీ పై ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది దానిని మరో ఐదు సంవత్సరాలు పొడిగించవచ్చు పిపిఎఫ్ పథకం కింద కనీసం 500 రూపాయలతో కాసాను తెరవచ్చు ఏడాదిలో గరిష్టంగా ఒకటిన్నర లక్షల వరకు ఖాతాలో పెట్టుబడి పెట్టవచ్చు

సుకన్య సమృద్ధి యోజన లో ఖాతాలో ప్రతి సంవత్సరం కనీసం 20050 డిపాజిట్ చేయాలి ఈ డబ్బును డిపాజిట్ చేయకపోతే 50 రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన ఖాతాపై 8.2% వడ్డీ లభిస్తుంది

ఎస్ఎస్వై వివరాలు ఆడపిల్లవచ్చు. 250 రూపాయలకే ఈ ఖాతాను తెరవచ్చు దీనిలో ఏడాదికి 8.2% వడ్డీ లభిస్తుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుకన్య సమృద్ధి యోజన కింద గరిష్టంగా 1,50,000 డిపాజిట్ చేయవచ్చు ఈ కాదని  ఏదైనా పోస్ట్ ఆఫీస్ లో లేదా బ్యాంకు శాఖలో తెరవచ్చు

ఇకనుండి ఫ్లిప్కార్ట్ తో పేమెంట్లు

 ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్ యూపీఐ సర్వీస్ లను ప్రారంభించింది యాక్సిస్ బ్యాంక్ సపోర్టుతో ఈ యూపీఐ సేవలో నడుస్తాయి ప్రారంభంలో ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంటాయి యూజర్లు@fkaxis హ్యాండిల్ తో రిజిస్టర్ అవ్వచ్చు ఫ్లిప్కార్ట్ యాప్ ద్వారా ఫాన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కస్టమర్లు ఆకర్షించేందుకు సూపర్ కాయిన్స్ క్యాష్ బ్యాక్ మైల్స్టోన్ బెనిఫిట్స్ బ్రాండ్ ఓచర్ వంటివి ఫ్లిప్కార్ట్ ఆఫర్ చేయనున్నది ప్రస్తుతం ఈ కామర్స్ కంపెనీకి 50 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు ఈ కంపెనీ కూడా ఆన్లైన్ పేమెంట్స్ ఎక్కువ సిస్టం లోకి ఎంటర్ అవ్వడంతో యూపీఐ మరింతగా విస్తరించి ఉన్నది

3, మార్చి 2024, ఆదివారం

ఆదాయ పన్ను ఎలా ఆదా చేయాలి

 ఆర్థిక సంవత్సరం ముగుస్తుందంటే చాలు చాలామంది పన్ను ఆదా సహా టాక్స్ ప్లానింగ్ పై దృష్టి పెడతారు కొత్త పాత పనుల విధానాలు వచ్చినప్పటికీ సెక్షన్ 80c విషయంలో ఎప్పటికీ కొంత సందేహితతో పాటు ఆప్షన్స్ విషయంలో క్లారిటీ కోసం ఎదురు చూస్తూనే ఉంటారు ప్రజలలో పొదుపు అలవాటులను పెంచడానికి ఆదాయపన్ను చట్టంలో గల పన్ను రాయితీ విధానమే సెక్షన్ 80c దీని కింద గల పెట్టుబడి సాధనాలలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏటా గరిష్టంగా ఒకటిన్నర లక్షల రూపాయల దాకా పన్ను చెల్లింపులను ఆదా చేసుకోవచ్చు కానీ పాత పనుల విధానాన్ని ఎంపిక చేసుకున్న వాళ్ళకి ఈ ప్రయోజనం అందుతుంది టాక్స్ పేయర్స్ కు పన్ను ఆదా కోసం ఉన్న వివిధ సాధనాలను పరిశీలిస్తే

ఫిక్స్డ్ డిపాజిట్లు ..ఇదొక సులువైన పన్ను తగ్గింపు సాధనం కానీ లాకిన్ పీరియడ్ ఉంటుంది గరిష్టంగా ఒకటిన్నర లక్షల దాకా పన్ను ప్రయోజనం పొందవచ్చు ఇక బ్యాంకు ఫిక్స్ డిపాజిట్లు సురక్షితమైన విషయం తెలిసింది

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం.. ఇది సీనియర్ సిటిజెన్లకు వర్తిస్తున్న పన్ను విధానము 60 ఏళ్లకు పైబడిన వాళ్లకు మాత్రమే ఇందులో ఇన్వెస్ట్ చేసే వీలున్నది ఐదేళ్ల లాకిన్ పీరియడు ఉంటుంది అయితే మరో మూడేళ్ల గడువును కూడా పొడిగించుకుని ఎసులుబాటు ఉంది సెక్షన్ 80 సి కింద పన్ను ప్రయోజనాలు గరిష్టంగా ఒకటిన్నర లక్షల వరకు ఉంటాయి. ఏడాదికి 50 వేల రూపాయలకు పైగా వడ్డీ వస్తే అది ట్యాక్స్ బుల్ ఇన్కమ్ అవుతుందని గమనించండి

సుకన్య సమృద్ధి స్కీం

సుకన్య సమృద్ధి స్కీం ఒక అత్యద్భుత పెట్టుబడి సాధనం ఆడపిల్లలున్న తల్లిదండ్రులు దీనిని ఉపయోగించుకోవచ్చు సుదీర్ఘ లార్యను పీరియడ్ ఉన్నప్పటికీ ఆడపిల్లల ఉన్నత చదువు పెండ్లిలకు ఉపయోగపడుతుంది 21 ఏళ్లు వచ్చినప్పుడు పెళ్లికి నిధులను వాడుకోవచ్చు 18 ఏండ్లు లేదా పదవ తరగతి పూర్తయిన తర్వాత ఉన్నత చదువులకు పాక్షికంగా ఈ నిధులను తీసుకోవచ్చు ఇందులో ఇన్వెస్ట్ చేసే మొత్తానికి సెక్షన్ 80c కింద భాను ప్రయోజనం పొందవచ్చు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నప్పటికీ గరిష్టంగా ఒకటిన్నర లక్షల వరకే టాక్స్ బెనిఫిట్స్ అందుకోవచ్చు మెచ్యూరిటీ సమయంలో వచ్చే ప్రయోజనంపై ఎలాంటి టాక్స్ కట్టాల్సిన అవసరం లేకపోవడం మరోదనపు బెనిఫిట్

రకరకాల రుణాలు

గృహ విద్యా రుణాలు తీసుకోవడం వలన కూడా కొన్ని పన్ను రాయితీలను పొందవచ్చు ఐటి చట్టంలోని సెక్షన్ 24b కింద గృహ రుణం పై చెల్లించే వడ్డీలు రెండు లక్షల రూపాయల వరకు మినహాయింపు పొందవచ్చు అలాగే సెక్షన్ 80cc కింద అసలు మొత్తం పై కూడా గరిష్టంగా ఒకటిన్నర లక్షల రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు సెక్షన్ 80 ఈ ప్రకారం ఉన్నత విద్య కోసం తీసుకుని రుణాలపై కూడా ప్రయోజనాలు అందుకోవచ్చు పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వాళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది

ఈ ఎల్ ఎస్ ఎస్ ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ పన్ను లాభాలను పొందాలని అనుకునే వాళ్లకు ఈక్విటీ లింకెడ్ సేవింగ్స్ స్కీం ఈ ఎల్ ఎస్ ఎస్ ఉత్తమ సాధనము మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసే ఈ స్కీం కింద కూడా గరిష్టంగా ఒకటిన్నర లక్ష చేసుకోవచ్చు దీనికి కూడా మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పద్ధతిలో దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి రిటర్న్స్ దీని నుంచి ఆశించవచ్చు

చివరగా సాధారణంగా ఏడాది ప్రారంభం నుంచే మనం టాక్స్ ప్లానింగ్ పై దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఆఖరిలో సిద్ధమైతే అనుకున్న లక్ష్యాలను సాధించడం కష్టమే అలాగే ఐటీ చట్టంలోని సెక్షన్ 80c తో పాటు 80 సిసి 80 సిసిడి 80ఈ ,80 ఈ ఈ లతో పన్ను ప్రయోజనాలు ఉంటాయి

80 డి కింద ఆరోగ్య భీమాకు చెల్లించే ప్రీమియములపై పని చేసుకోవచ్చు ఐదు వేల రూపాయలకు లోబడి కుటుంబ సభ్యులు తల్లిదండ్రుల హెల్త్ చెకప్లకు చెల్లించే సముపైన క్లైమ్ చేసుకోవచ్చు. ఇక 80జి కింద వచ్చే నెల మార్చి ఆఖరిలోగా అర్హత ఉన్న చారిటీ సంస్థలకు ఇచ్చే విరాళాలను పన్ను ఆధార్ కోసం ప్లేన్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటేనే ఉంటాయి

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ అనేది ఒక స్మాల్ సేవింగ్స్ పెట్టుబడి విధానం కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉండడంతో ఇది చాలా సేఫ్ ఇతర పన్ను సాధనాలతో పోల్చితే దీనికి లాక్ ని పీరియడ్ చాలా ఎక్కువ అయితే ఏడవ సంవత్సరం తర్వాత కొద్ది మొత్తాన్ని మన కార్పస్ నుంచి విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది మనం పొందే వడ్డీ పైన ఎలాంటి పన్ను ఉండదు

నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ ఎన్ ఎస్ సి ఇదొక కేంద్ర ప్రభుత్వ స్పాన్సర్ట్ సేవింగ్స్ ప్రోగ్రాం ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ ఛాయిస్ అయితే ప్రభుత్వం దీనికి ఒక నిర్దిష్టమైన వడ్డీ రేటు నిర్ణయిస్తుంది ఎన్ఎస్ఈ కింద ఇన్వెస్ట్ చేసినప్పుడు టాక్స్ డిడక్షన్ లభిస్తుంది. దీనికి కూడా 500 లాకింగ్ పీరియడ్ ఉంటుంది అయితే ఈ పథకం కింద లభించే వడ్డీ పై మాత్రం ట్యాక్స్ ఉంటుంది మన స్లాబ్స్ కు తగ్గట్టు పన్ను పడుతుందని గమనించాలి


అత్యాశకు పోతే ఉన్నది పోయింది

 అమెరికాలో ఐదుగురు గుజరాతి సోదరుల వ్యాపార వివాదం హస్తగతం చేసుకొని మిగిలిన వారిని వెళ్లగొట్టిన హరీష్ జోగాని తప్పుబట్టిన కోర్టు సోదరులకు 20వేల కోట్లు చెల్లించాలని తీర్పు

ఐదుగురు అన్నదమ్ములు వేలకోట్ల వజ్రాల వ్యాపారం దానికి తోడు రియల్ ఎస్టేట్ కంపెనీ అందరూ కలిసికట్టుగా నిర్మించుకున్న వ్యాపార సామ్రాజ్యాన్ని ఒక్కడే సొంతం చేసుకోవాలని భావించాడు మిగిలిన వారు కోర్టుకెక్కరు 21 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు అన్నదమ్ములకు వాటాలు పంచి ఇచ్చింది సోదరులను మోసగించినందుకు 20వేల కోట్ల రూపాయల పరిహారం వారికి చెల్లించాలని ఆ ఒక్కడికి షాక్ ఇచ్చే తీర్పునిచ్చింది గుజరాత్కు చెందిన శశికాంత్ జుగాని 22 ఏళ్ళ వయసులో 1969లో అమెరికాలోని కాలిఫోర్నియాకు వచ్చి వజ్రాల వ్యాపారం ప్రారంభించాడు తర్వాత కాలంలో తన నలుగురు సోదరులు హరీష్ రాజేష్ చేతన్లను గుజరాత్ నుంచి తీసుకొచ్చి వ్యాపారంలో భాగస్వామ్యం ఇచ్చాడు వ్యాపారం అమెరికాతో పాటు యూరప్ ఆఫ్రికా మధ్యప్రత్యానికి విస్త రించింది అయితే తర్వాత సోదరుల మధ్య ఆస్తి వివాదాలు పెరిగాయి వ్యాపారం మొత్తాన్ని హరీష్ జోగాని హస్తగతం చేసుకున్నాడు శశికాంత్ తో పాటు మిగిలిన ముగ్గురిని కంపెనీ నుంచి తొలగించాడు దీనిపై 2003లో న్యాయపోరాటం మొదలైనది 21 ఏళ్లలో ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. అప్పెళ్ళ మీద అప్పిళ్లు దాఖలయ్యాయి మొత్తం మీద లాస్ ఏంజెల్స్ సుపీరియర్ కోర్టు దీనిపై తాజాగా తీర్పునిస్తూ అన్నదమ్ముల మధ్య వ్యాపార భాగస్వామ్యం యజమాని నిర్ధారిస్తూ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు గాను నలుగురు సోదరులకు హరీష్ జోగాని 20050 కోట్ల డాలర్లు దాదాపు 20వేల కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది రియల్ ఎస్టేట్ కంపెనీలో సగం వాటా శశికాంత్ దేనిని మిగిలిన సగంలో హరీష్ కు 24 శాతం రాజేష్కు పది శాతం స్టైలిష్కు 9.5% చేతన్కు 6.5% వాటా ఉంటుందని తీర్పు చెప్పింది


2, మార్చి 2024, శనివారం

2000 నోట్లు ఇప్పటికీ చెల్లుతాయి

 ఇప్పుడు కూడా 2000 రూపాయల నోట్లు చెల్లుతాయని ఆర్బిఐ ప్రకటించింది 2000 బ్యాంకు నోట్లలో దాదాపు 97.62% బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయని కేవలం 8470 కోట్ల విలువైన నోట్లు మాత్రమే జనం దగ్గర ఉన్నాయని శుక్రవారం తెలిపింది గతమే 19న ఆర్బిఐ రెండు వేల డినామినేషన్ బ్యాంకు నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది అప్పటికి చలామణిలో 356 వేల కోట్ల విలువైన నోట్లు ఉన్నాయి గత నెల 24 నాటికి వీటి విలువ 8470 కోట్లకు తగ్గింది అంటే మే 19 2023 నాటికి చలామణిలో ఉన్న 2000 నోట్లలో 97.62% తిరిగి వచ్చాయి దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్.బి.ఐ కార్యాలయాలలో ప్రజలు రెండువేల బ్యాంకు నోట్లో డిపాజిట్ చేయవచ్చు వారి బ్యాంకు ఖాతాలకు క్రెడిట్ కోసం ఏదైనా పోస్ట్ ఆఫీస్ నుంచి ఏదైనా ఆర్బిఐ ఇష్యూ ఆఫీసులకు ఇండియా పోస్ట్ ద్వారా 2000 బ్యాంకు నోట్లను పంపవచ్చు 200 నోట్లను కలిగి ఉన్నవాళ్లు సంస్థలు వాటిని సెప్టెంబర్ 30 2023 లోగా మార్చుకోవాలని లేదా బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయాలని ఆర్బీఐ సూచించింది ఆ తర్వాత గడువు అక్టోబర్ 7 వరకు పొడిగించింది

28, ఫిబ్రవరి 2024, బుధవారం

మోబిక్విక్ పాకెట్ యూపీఐ

 దేశీయ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ మోబిక్విక్ ఒకసారి కొత్త ఫీచర్ నూతన వినియోదారుల కోసం తీసుకువచ్చింది బ్యాంకు ఖాతాతో అనుసంధానం లేకుండానే చెల్లింపులు జరిపేలా ప్యాకెట్ యూపీఐ సౌకర్యాన్ని పరిచయం చేసింది ఇకపై కస్టమర్లు తమ ఖాతాలను లింకు చేసుకోకుండానే మోబిక్విక్ వ్యాలెట్ ద్వారా యూపీఐ పేమెంట్స్ ను ఈ ప్యాకెట్ యూపీఐ తో చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. బ్యాంకు ఖాతా నుంచి నిధుల బదిలీ కంటే మోబిక్విక్ వ్యాలెట్ నుంచి బదిలీయే సురక్షితమని ఆర్థిక మోసాలకు తావు ఉండదని ఈ సందర్భంగా మోబిక్విక్ తెలిపింది

26, ఫిబ్రవరి 2024, సోమవారం

ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విజయవంతం చేయాలి

 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 26 నుంచి మార్చి 1వ తేదీ వరకు నిర్వహించే ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ నిజామాబాద్ తెలిపారు వారోత్సవాలను పురస్కరించుకుని లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో రూపొందించిన గోడ ప్రతులను సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మేక్ ఎ రైట్ స్టార్ట్ బికమ్ ఫైనాన్షియల్లి స్మార్ట్ అని థీమ్తో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు ప్రధానంగా పొదుపు చక్రవడ్డీ శక్తిపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలతోపాటు స్లోగన్లు డిజిటల్ సైబర్ భద్రత పోస్టర్ రూపకల్పన అనే అంశాలపై పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు విజేతలను రాష్ట్రస్థాయికి పంపుతామన్నారు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా ఈనెల 27న జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ మైదానం నుండి ప్రగతి హాస్పిటల్ వరకు 2కె నడక 28న ఆర్థిక అక్షరాస్యత శిబిరము 29న అన్ని పాఠశాలలు కళాశాలలో విద్యార్థులతో సమావేశమై ఆర్థిక అక్షరాస్యత ప్రాముఖ్యతపై ప్రసంగాలు కార్యక్రమాలు ఉంటాయని ఎల్డీఎం వివరించారు పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యుటి కిరణ్మయి జెడ్పి సీఈవో ఉషా తదితరులు పాల్గొన్నారు


ఎఫ్ పీ ఐ ల పేరుతో మోసపు ట్రేడింగ్ స్కీములు

 విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు వాటి అనుబంధ సంస్థల ఉద్యోగులము అంటూ కొంతమంది మోసపూరిత ట్రేడింగ్ స్కీములను ఆఫర్ చేస్తున్నారంటూ ఇన్వెస్టర్లను మార్కెట్ రెగ్యులేటర్ సెబి హెచ్చరించింది సెబీ రిజిస్టర్డ్ ఎఫ్ బి ఐ సంబంధితమైన అంటూ ప్రచారం చేసుకుంటున్న మోసపూరిత ట్రేడింగ్ ప్లాట్ఫాములపై తమకు పాల ఫిర్యాదులు అందాయని అవి విదేశీ సంస్థ గత ఇన్వెస్టర్ల సభ అకౌంట్స్ లేదా ఇన్స్టిట్యూషనల్ అకౌంట్స్ ద్వారా ట్రేడింగ్ అవకాశాల్ని ఆఫర్ చేస్తున్నాయని సోమవారం సబి విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది ఆన్లైన్ ట్రేడింగ్ కోర్సులు సెమినార్లు స్టాక్ మార్కెట్లో మెంటార్స్ ప్రోగ్రాములు అందిస్తామంటూ వాట్సాప్ లైవ్ బ్రాడ్కాస్టర్తో ప్రచారం చేసి అమాయక ఇంస్టార్లకు వల వేస్తున్నట్లు వివరించింది అంతేకాకుండా ఆ మోసపూరిత వ్యక్తులు అధికారిక ట్రేడింగ్ డిమార్ట్ అకౌంట్ లేకుండానే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని షేర్లు కొనుగోలు ఐపిఓలకు దరఖాస్తు చేయడం వంటివి అనుమతిస్తామని అంటున్నారని సెబి తెలిపింది ఈ కార్యకలాపాలు నకిలీ పేర్లతో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ల ద్వారా నిర్వహిస్తున్నారని అన్నది దేశీయ ఇన్వెస్టర్లు సెక్యూరిటీ మార్కెట్లో చేసే పెట్టుబడులకు సంబంధించి ఎఫ్ బి ఐ లకు ఏ సరళీకరణలు లేవన్నది.

25, ఫిబ్రవరి 2024, ఆదివారం

ఎల్ఐసి పాలసీ మెచ్యూరిటీ క్లెయిమ్ ఎలా చేసుకోవాలి

 ఒక్కసారి మీ ఎల్ఐసి పాలసీ గడవు తీరిపోతే మెచ్యూరిటీ నగదు మొత్తాన్ని తీసుకోవలసి ఉంటుంది .అయితే కస్టమర్లు ఎందుకోసం క్లెయిమ్ చేసుకోవాలి .ఆన్లైన్లోనూ ఈ మెచ్యూరిటీ క్లెయిమ్ను దాఖలు చేయవచ్చు ఎల్ఐసి అధికారిక వెబ్సైట్ ద్వారా ఇన్దుకు వీలున్నది.

 పాలసీదారులు ఏం చేయాలంటే ..

ముందుగా పాలసీదారులు తమ బ్యాంకు వివరాలను అప్డేట్ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వరంగ భీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సూచిస్తుంది. అలాగే పాలసీ సొమ్మును పొందేందుకు కేవైసీ ని కూడా దాఖలు చేయాల్సి ఉంటుంది.

 ఎండోమెంట్ మెచ్యూరిటీ క్లెయిమ్స్..

 ఎండోమెంట్ పాలసీలు గడవు తీరిన తర్వాత చెల్లింపులు జరుగుతాయి. ఈ మేరకు పాలసీ వ్యవధి పూర్తవడానికి కనీసం రెండు నెలల ముందు అయినా సంస్థ తమ కస్టమర్లను అలర్ట్ చేస్తుంది. కావాల్సిన పత్రాలను సమర్పిస్తే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో నగదు జమ అవుతుంది. పూర్తయిన డిశ్చార్జి ఫామ్, పాలసీ డాక్యుమెంట్, నెఫ్ట్ ఫార్మ్, కేవైసీ వంటివి అవసరము .

మనీ బ్యాక్ పాలసీలలో..

 ఐదు లక్షల రూపాయల దాకా మొత్తాల చెల్లింపులకు పాలసీ డాక్యుమెంట్తో పనిలేదు .జీవనా నంద్ ప్లాన్ కింద రెండు లక్షల రూపాయల వరకు కూడా పాలసీ బాండ్ల అవసరం లేదు. ఈ రకమైన పాలసీలలో పాలసీ వ్యవధి మొత్తంగా నగదు భరోసా ఉంటుంది. కాలానుగున చెల్లింపులు  ఉంటాయి.

డెత్ క్రైమ్ లు ..

బకాయిలు లేకుండా ప్రీమియంలు చెల్లించాల్సి ఉంటుంది. పాలసీ వ్యవధిలోనే మరణం సంభవించాలి .అలాగే క్లైమ్ ఫామ్ ఎల్లో క్లెయిమ్ చేస్తున్నవారు మృతుల వివరాలన్నింటినీ పేర్కొనాలి .డెత్ సర్టిఫికెట్ను సమర్పించాలి .ఒరిజినల్ పాలసీ డాక్యుమెంట్ ఉండాలి. ఒకవేళ పాలసీదారు ని వయస్సు పేర్కొనకపోతే ఏజ్ సర్టిఫికెట్ అవసరము . రిస్క్ లేదా పాలసీ పునరుద్ధరణ జరిగిన మూడేళ్ల లోపు మరణం సంభవిస్తే క్లైమ్ ఫామ్ బి అవసరము. ఇందులో పాలసీదారుడు చనిపోయిన చివరి రోజులలో వారికి సేవలందించిన వారి ద్వారా మెడికల్ అటెండెన్స్ సర్టిఫికెట్ని ఇవ్వాలి .దవాఖానాలో చికిత్స తీసుకుంటే క్లెయిమ్ ఫామ్ బి వన్ అవసరము. ఆఖరి రోజుల్లో చికిత్సలు అందించిన వైద్యుడు చె క్లెయిమ్ఫా ఫామ్ బి టు తీసుకోవాలి. తెలిసిన వారిచే గుర్తింపు అంత్యక్రియలకు సంబంధించి క్లీన్ ఫామ్ సీ నీ ఇవ్వాల్సి ఉంటుంది .చనిపోయిన పాలసీ దారుడు ఉద్యోగి అయితే వారి సంస్థ చేత క్లెయిమ్ ఫామ్  ఈ నీ ఇప్పించాలి.

శ్రీ రామ్ ఫైనాన్స్ లిమిటెడ్ కామారెడ్డి బ్రాంచ్

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ 

కామారెడ్డి బ్రాంచ్ 

డోర్ నెంబర్ 5-3-53 

సెకండ్ ఫ్లోర్

  ఎస్బిఐ పైన 

ఎన్హెచ్ 7 రోడ్ 

కామారెడ్డి50 3111

కాంటాక్ట్ ..బ్రాంచ్ మేనేజర్ ..9948863165

శ్రీరామ్ ఫైనాన్స్ మనసుతో అడగండి.. శ్రీరామ్ నుండి లోన్ పొందండి ..మీరు కొత్త లేదా పాత వాహనాలు కొనాలనుకున్నారా అయితే మీరు శ్రీరామ్ ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందగలరు .

ఇతర ప్రయోజనాలు ..టైర్ లోన్ సదుపాయం ..పెట్రోల్ డీజిల్ కొనుగోలు పై రుణాలు ..ఆరోగ్య భీమా ..వ్యక్తిగత భీమా.. వాహన బీమా సదుపాయం.

 పర్సనల్ లోన్స్, వ్యాపార రుణాలు,

 మీ ప్రస్తుత వ్యాపార అభివృద్ధి కొరకు రుణాలు.. 50 లక్షల వరకు.. చిన్న మరియు మధ్య హోల్సేల్ రిటైల్ డీలర్స్ జనరల్ మర్చంట్స్ బిల్డర్స్ మరియు ఉత్పత్తిదారులకు రుణ సౌకర్యం కలదు..

 కొలాటరల్ సెక్యూరిటీస్ రిక్వైర్డ్ ..ఫాస్ట్ అండ్ ఈసీ ప్రాసెసింగ్ .రీసనబుల్ ఇంట్రెస్ట్ రేట్ .ఫ్లెక్సిబుల్ కండిషన్స్.

 నూతన ద్విచక్ర వాహనాల కొనుగోలు పై రుణాలు.. తక్కువ వడ్డీ రేటు.. సులభ డాక్యుమెంటేషన్ ..

శ్రీరామ్ ఫైనాన్స్ నందు డిపాజిట్లు చేసి అత్యధిక వడ్డీ రేట్లు పొందగలరు..

ఐ సి ఆర్ ఏ రేటింగ్ ద్వారా ఏ ఏ ప్లస్  స్టేబుల్. అత్యున్నత స్థాయి భద్రతను సూచిస్తుంది.

ఒక సంవత్సర కాలం నుండి ఐదు సంవత్సరంల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ సౌకర్యం

 నెలవారి వడ్డీ తీసుకుని సౌకర్యం

 బ్యాంకు పోస్ట్ ఆఫీస్ కన్నా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు

క్యుములేటివ్ అండ్ నాణిక్యుములేటివ్ స్కీమ్స్ సౌకర్యం

 శ్రీరామ గోల్డ్ లోన్స్ .స్పీడీ గోల్డ్ లోన్ ..గ్రామ బంగారమునకు అధిక రుణము

 మీ అత్యవసర ఆర్థిక అవసరాలకు బంగారు ఆభరణాలపై సులభంగా రుణ సౌకర్యం.

 అతి తక్కువ వడ్డీ.. తక్షణ నగదు రుణ సౌకర్యం..