Thursday 21 March 2024

విద్యుత్ ఉద్యోగుల సంఘం కార్యవర్గం ఎన్నిక

 కామారెడ్డి జిల్లా విద్యుత్ ఉద్యోగుల సంఘం 1104 నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు స్థానిక వరలక్ష్మి గారిలో విద్యుత్ ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశ్వర్లు సాయిబాబా హాజరయ్యారు జిల్లా అధ్యక్షుడిగా బోయ కమలాకర్ ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ అదనపు కార్యదర్శిగా పార్వయ్య కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జగదీశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కమలాకర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు కార్మికుల సమస్యల కోసం యాజమాన్యంతో పోరాడడానికి 1104 జిల్లా కార్యవర్గం ముందు ఉంటుందని అన్నారు అనంతరం నూతనంగా ఎన్నికైన వారిని రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సన్మానించారు ఎన్పీడీసీఎల్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు



No comments:

Post a Comment