Wednesday 31 January 2024

4 న గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష

 గురుకుల ప్రతిభ కళాశాలలో 2024 25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి 4న నిర్వహించనున్నట్లు ప్రాంతీయ సమన్వయ అధికారి అలివేలు బుధవారం తెలిపారు జిల్లాలోని ధర్మారం బి కంజర ఆర్మూర్ బి శుద్ధపల్లి పోచంపాడు నవీపేట్ కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి భిక్కనూరు దోమకొండ తాడువాయి తాడుకు కొయ్యగుట్ట తక్కడపల్లి పెద్ద కోడప్పగల్ కామారెడ్డి డిగ్రీ కళాశాల పెద్దయకులారా బాన్సువాడ బోర్లా నిర్మల్ జిల్లాలో ముధోల్ లెఫ్ట్ పోచంపాడు జాం కడెం భయంసాలోని పరీక్ష కేంద్రాలలో ప్రవేశపరీక్ష ఉంటుందని తెలిపారు విద్యార్థులు తప్పనిసరిగా పరీక్ష కేంద్రాన్ని ఒకరోజు ముందుగానే సందర్శించాలని అన్నారు పరీక్షా కేంద్రాలను గుర్తించడంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే హాల్ టికెట్లో ముద్రించిన ముఖ్య పర్యవేక్షకుని ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం పొందాలని తెలిపారు.




No comments:

Post a Comment