దేశంలోనే తొలి నదీ గర్భ రైలు ప్రయాణం కోల్కతాలో నేడు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం
భారత్లో తొలిసారిగా నీటి అడుగున నడిచే మెట్రో రైలు పరుగులు పెట్టేందుకు సర్వం సిద్ధమైంది పశ్చిమబెంగాల్ రాజధాని నగరమైన కోల్కతాల నిర్మించిన తొలి అండర్ వాటర్ మెట్రో టన్నెల్ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభించనున్నారు కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ కింద దాదాపు 120 కోట్ల వ్యయంతో ఈ సొరంగా రైలు మార్గాన్ని హుగ్లీనది దిగువన నిర్మించారు కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో మార్గం పొడవు మొత్తం 16.6 కిలోమీటర్లు కాగా 10.8 కిలోమీటర్ల భూగర్భంలో ఉంటుంది స్టేషన్ల మధ్యన 4.8 కిలోమీటర్ల మేర ఉన్న లైన్ లో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్ వాటర్ మెట్రో అనిల్ నిర్మించారు నదిలోని ఈ దూరాన్ని 45 సెకండ్లలో దాటి మెట్రో రైలు కోల్కతా ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందించనుంది సొరంగం అంతర్గత వ్యాసం 5.5 మీటర్లు కాగా బాహ్య వ్యాసం 6.1 మీటర్లు నదీ గర్భానికి 16 మీటర్ల దిగువన భూమి లోపలికి 32 మీటర్ల లోతులో దీన్ని నిర్మించారు ప్రస్తుతం ఆవిడ నుంచి సీల్ దాకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే గరిష్టంగా 90 నిమిషాల సమయం పడుతుంది. అండర్ వాటర్ మెట్రో మార్గం ఏర్పాటుతో ఈ ప్రయాణ సమయం 40 నిమిషాలకు తగ్గనున్నది. ఈ కారిడార్ పరిధిలో ఎస్ ప్లానెడ్ మహాకారన్ హావడా , హావ్ డా మైదాన్ వంటి ముఖ్యమైన స్టేషన్లో ఉన్నాయి
బ్రిటన్ సరసన భారత్
మెట్రో టన్ను లోపలికి నీరు చొచ్చుకు రాకుండా ఒకటి. నాలుగు మీటర్ల వెడల్పాటి కాంక్రీట్ రింగులను అమర్చారు నీటిని పీల్చుకునేలా వాటికి హైడ్రోఫిలిక్ గ్యాస్ కేట్లను ఏర్పాటు చేశారు ఈ తరహా సాంకేతికతను యూరోస్టార్ అనే కంపెనీ లండన్ ప్యారిస్ నగరాల మధ్య రాకపోకల కోసం అభివృద్ధి చేసింది ప్రతిష్టాత్మక హుగ్లీ అండర్ వాటర్ మెట్రో ప్రాజెక్టుతో భారత్కు ఈ ఘనత దక్కింది వాడారు జర్మనీలో రూపొందించిన టన్నెల్ బోరింగ్ మిషన్ సహాయంతో నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేశారు కేవలం 66 రోజుల్లోని ఈ యంత్రం సొరంగాన్ని తవ్వింది ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ పనులు 2009లో మొదలుకాగా హుగ్లీ నదిలో టన్నెల్ నిర్మాణ పనులు 2017 లో ప్రారంభించారు ఈ అండర్ వాటర్ మెట్రో మార్గం చుట్టుపక్కల పలు చారిత్రక కట్టడాలు ఉన్నాయి వాటికి ఎటువంటి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మెట్రో అధికారులు పనులు పూర్తి చేశారు
మధ్యలో మెట్రో ఆగితే కొన్నిసార్లు సాంకేతిక కారణాల వలన మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడుతూ ఉంటుంది అలాంటి అత్యవసర సమయాలలో మెట్రో ప్రయాణికులు ఎలాంటి భయాందోళనలకు గురవకుండా పక్కనే నిర్మించిన నడక మార్గాన్ని కూడా వినియోగించుకోవచ్చని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు సాంకేతిక సమస్యల నుంచి సులువుగా బయటపడేలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని కోల్కతా మెట్రో జనరల్ మేనేజర్ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు ప్రతిరోజు కనీసం ఏడు లక్షల మంది ప్రయాణికులు అండర్ వాటర్ మెట్రోలో ప్రయాణిస్తారని అంచనా ఉందన్నారు దేశంలో తొలిసారి 1984లో మెట్రో రైలు సేవలు కోల్కతాలో మొదలయ్యాయి తాజాగా నీటి ఆడుకున్న మెట్రో రైలు పరుగులతోను నగరం మరో సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకోనుంది. ఈ వినూత్న ప్రాజెక్టుతో కోల్కతాలో ట్రాఫిక్ రద్దీ వాయు కాలుష్యం తగ్గుతాయి


No comments:
Post a Comment