Thursday, 14 March 2024

కేవైసీ కేటుగాళ్లు ఉన్నారు జాగ్రత్త

 బ్యాంకు రుణాల పేరుతో అమాయకులకు అలా వినియోగదారుడికి తెలియకుండా బ్యాంకు ఖాతాలు వాటి ద్వారా కోట్లలో లావాదేవీలు ఉమ్మడి ఖమ్మం లో పదుల సంఖ్యలో ఏజెంట్లు డబ్బులు ఇచ్చి మరీ కేవైసీల సేకరణ భారీ ఎత్తున సైబర్ నేరాలకు కుట్ర

హైవేలో ప్రమాదాల సృష్టించి ప్రయాణికుల నగదు నగలతో ఉడయించే ముఠాల తీరును చూపించిన రోడ్డు తెలుగు సినిమా గుర్తు ందా గత ఏడాది విడుదలైన ఈ సినిమాలో దొంగల ముఠాకు ఒక భారీ నెట్వర్క్ ఉంటుంది రుణాల పేరుతో గ్రామీణుల కేవైసీ వివరణ సేకరించి వారి పేరుతో బ్యాంకు ఖాతాలను తెరిచి తమ నేరాలకు కావాల్సినట్టుగా లావాదేవులు జరుగుతుంది. దర్యాప్తులో భాగంగా బ్యాంకు ఖాతా ఎవరి పేరుతో ఉందో వారిని సంప్రదిస్తే గొర్రెలను కాచే వేపుతో నిరక్షరాస్యుడైన రోజు కూలీలు దొరకడం ఆ సినిమాలో ట్రస్ట్ ఇప్పుడు అచ్చంగా ఇదే తరహాలో గ్రామీణుల కేవైసీలను కొల్లగొడుతున్న ముఠాలు గుమ్మం ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పుట్టుకొచ్చాయి అయితే ఈ ముఠాలు రుణాలను కూడా ఇస్తున్నాయి కొన్ని ముఠాలు నెలనెలా కిస్తీలను వసూలు చేస్తుండగా మరికొన్ని ఆ డబ్బులు వదిలేసి కే వయసులతో తమకు కావలసిన పనులను చక్కబెడుతున్నాయి .

పదికి పైనే ముఠాలు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవైసీలను కొల్లగొడుతున్న ముఠాలు పదికి పైనే ఉన్నట్లు తెలుస్తోంది ఈ ముఠాలు రుణాల పేరుతో రోజు కూలీలు నిరక్షరాస్యులు ఆర్థికంగా వెనుకబడిన వారికి గాలం వేస్తున్నాయి వారి వద్ద ఆధార్ జిరాక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుంటున్నాయి కొన్ని ముఠాలు లోన్ పేరుతో కాలయాపన చేస్తుండగా మరికొన్ని చిన్న మొత్తంలో 10,000 నుంచి 75 వేల దాకా నగదు రూపంలో అందజేస్తూ బ్యాంకు రుణాలుగా పేర్కొంటున్నాయి ఇలా చిన్న మొత్తంలో రుణాలు ఇచ్చిన ముఠాల్లో కొన్ని నెలల రుణగ్రహితుల ఇళ్లకు వెళ్లి కిస్తీలు వసూలు చేస్తుండగా మరికొన్ని ముఠాలు అసలు ఆ డబ్బును పట్టించుకోవడం లేదు తిరిగి జిల్లా చెల్లించాల్సిన అవసరం లేదని ముందే చెప్పేస్తున్న దాఖలాలు కూడా ఉన్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో ఖమ్మం జిల్లా కేంద్రంలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి

అమాయకుల కేవైసీలను కొట్టేసి బ్యాంకు ఖాతాలు తెరుస్తున్న ముఠాలు సైబర్ నేరాల కోసమే ఈ పని చేస్తున్నాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇప్పటికే కొందరి పేరుతో తెరిచిన బ్యాంకు కరెంటులలో ఇతర రాష్ట్రాల నుంచి కోట్ల రూపాయలలో లావాదేవీలు జరుగుతున్నట్లు తెలిసింది ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ హర్యానా మధ్యప్రదేశ్ నుంచి లావాదేవీలు జరిగిన సమాచారం దీన్ని బట్టి కేవైసీ గ్యాంగ్ అని సైబర్ నీరజాల కోసం పనిచేస్తున్నట్లు స్పష్టమవుతుంది గేమింగ్ యాప్లు నకిలీ ట్రేడింగ్ యాప్లలో బాధితులు చెల్లిస్తున్న డబ్బులు ఈ ఖాతాలకు మలుపుతున్నట్లు వాటిని సైబర్ నేరగాళ్లు వెను వెంటనే  విత్ డ్రా చేసుకుంటున్నట్లు  తెలుస్తోంది ఇటీవల ఇల్లెందులు ఈ కోవాలోని కొన్ని బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు సమాచారం హవాలా ముఠాలు కూడా ఇలాంటి ఖాతాలను వాడుకునే ప్రమాదం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు పోలీసులు ఈ ముఠాల తీగ లాగితే డొంక కదిలే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి

ఇవి కొన్ని ఘటనలు.. ఇల్లెందు మండలానికి చెందిన ఓ గ్రామ దీపిక అదే మండలంలోని ఐదుగురు మహిళలకు 20వేల రూపాయల చొప్పున రుణాలు ఇప్పిస్తానంటూ ఖమ్మంలోని ఒక ప్రైవేటు బ్యాంకులో ఖాతాలు తెరిచారు ఆ ఖాతాల్లో నగదు జమ అవ్వగా సదరు గ్రామ దీపిక వాటిని విత్డ్రా చేసుకుని ఆ మహిళలకు 14 వేల రూపాయల చొప్పున ఇచ్చినట్లు తెలిసింది అక్కడ సీన్ కట్ చేస్తే నెల తర్వాత వేరే బ్యాంకు అధికారులు ఈ ఐదుగురు మహిళల దగ్గరికి వచ్చి వారి కరెంట్ ఖాతాల్లో 30 లక్షల రూపాయలకు పైగా ఉన్నట్లు చెప్పారు చిరునామా పరిశీలనకు వచ్చామని చెప్పడంతో వారంతా అవాక్కయ్యారు వారు బ్యాంకుకు వెళ్ళగా ఆ డబ్బు విత్ డ్రా అయినట్లు తెలుసుకున్నారు నెలరోజుల్లో కోట్లను లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు

ఖమ్మంలోని ఓ వ్యక్తికి 35వేల రూపాయల రుణం తీస్తానని చెప్పిన గ్రామ దీపిక ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని ఒక ప్రైవేటు బ్యాంకు వద్దకు రావాలని సూచించింది బ్యాంకు దగ్గరకు వెళ్లిన తర్వాత సదర్ వ్యక్తితో పాటు మరో ఆరుగురిని చూపించిన ఆ గ్రామా దీపిక బ్యాంకులో 35వేల రూపాయల లోను మంజూరు అయిందని చెప్పి సంతకాలు చేయించుకుంది అదే రోజు సాయంత్రం ఆయనకు పదివేల రూపాయలు ఇచ్చింది అదేంటని ప్రశ్నిస్తే ఆ పదివేల రూపాయలు కూడా తిరిగి చల్లాంచాల్సిన అవసరం లేదని చెప్పడం గమనార్హం.

No comments:

Post a Comment