Wednesday, 6 March 2024

12 నుంచి రైలు ప్రయాణికులకు స్విగ్గి సేవలు

 ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గి రైలు ప్రయాణికులకు కూడా తమ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది ఈనెల 12వ తేదీ నుంచి దక్షిణాదిలో తమ సేవలు అందించేందుకు సిద్ధమైంది తొలి విడతలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ విశాఖపట్నం తో పాటు కర్ణాటకలోని బెంగళూరు ఒడిశాలోని భువనేశ్వర్ రైల్వే స్టేషన్లలో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. రాబోయే రోజుల్లో మరో 59 స్టేషనులకు ఈ సేవలు విస్తరించి ఉన్నట్లు స్విగ్గి తెలిపింది. ఫుడ్ డెలివరీకి స్విగ్గి ఐఆర్సిటిసి మధ్య మంగళవారం అవగాహన ఒప్పందం కుదిరింది ప్రయాణికులు స్విగ్గిలో ఫుడ్ ఆర్డర్ చేయాలంటే ఐఆర్సిటిసి యాప్ ను వినియోగించాల్సి ఉంటుంది అందులో టిఎన్ఆర్ నంబర్ ని ఎంటర్ చేసి తమ కోరుకున్న ఆహారాన్ని కావాల్సిన స్టేషన్లో డెలివరీ తీసుకోవచ్చు

No comments:

Post a Comment