Wednesday, 21 February 2024

కాలభైరవ స్వామి ఆలయంలో సింధూర పూజలు

 రామారెడ్డి మండలం ఇసనపల్లి రామారెడ్డి గ్రామాల మధ్య వెలసిన కాలభైరవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంగళవారం స్వామి పర్వదినం కావడంతో పురోహితులు శ్రీనివాస్ శర్మ మంత్రోచ్ఛారణల మధ్య భైరవునికి క్షీరాభిషేకం సింధూర పూజలు అర్చనలు హారతి వంటి పూజా కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం మధ్యాహ్నం స్వామి వారి సన్నిధానంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు స్వామివారి దర్శనం కోసం కామారెడ్డి జిల్లా నుంచి కాకుండా నిజామాబాద్ ఆదిలాబాద్ పక్క రాష్ట్రాలను మహారాష్ట్ర కర్ణాటక ల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కలు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ప్రభు రామచంద్రం గుప్తా జూనియర్ అసిస్టెంట్ సురేందర్ గుప్తా మాజీ ధర్మకర్తలు ప్రజాప్రతినిధులు భక్తులు తదితరులు పాల్గొన్నారు



No comments:

Post a Comment