కవలలను ఒక చోట ఒక జంటను లేదా రెండు మూడు జంటలను చూస్తుంటాం. అలాంటిది నిజామాబాద్ జిల్లాలోని చందూర్ మండల కేంద్రంలోని విక్టరీ పాఠశాలలో ఎల్కేజీ మొదలుకొని తొమ్మిదవ తరగతి వరకు మొత్తం 19 కవల జంటలు ఉన్నాయి. మొత్తం 38 మంది చిన్నారులు రోజు పాఠశాల సిబ్బంది, తోటి విద్యార్థులను తికమక పెడుతూ సందడి చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున కవలల దినోత్సవం సందర్భంగా గురువారం పాఠశాల యాజమాన్యం, పిల్లలతో ముచ్చటించగా ఇంత మంది కవలలు బడిలో చదువుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పాఠశాల యాజమాన్య ప్రతినిధి కొడాలి రామచంద్ర రావు చెప్పారు.
No comments:
Post a Comment