మాచారెడ్డి గ్రామంలో ఫిబ్రవరి 13వ తారీకున నిర్వహించిన హెల్త్ క్యాంపులో కంటి పరీక్షలు నిర్వహించి ఎవరికైతే కంటి అద్దాలు అవసర పడ్డాయి వారికి శ్రీ ముత్యాల లక్ష్మీనరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నరసింహ రెడ్డి కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఎవరికి ఆపరేషన్ అవసరమయ్యే వారికి కూడా అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేటలో పదిమందికి మొదటి విడుదల ఆపరేషన్ చేయించడం జరిగింది. ఈ రోజుల్లో పేదవారిని గుర్తించి ఆపరేషన్లు చేపిస్తూ అవసరమున్నవారికి కంటి అద్దాలు ఇస్తున్న ముత్యాల నరసింహారెడ్డి లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని గ్రామస్తులు వృద్ధులు ధన్యవాదాలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో మండల రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బంజారా నవీన్ రెడ్డి సంతోష్ రెడ్డి రామిరెడ్డి రాజిరెడ్డి కిషన్ గౌడ్ పాల్గొన్నారు
No comments:
Post a Comment