Thursday 29 February 2024

ఈట్ రైట్ స్టేషన్లుగా హైదరాబాద్ విశాఖ

 భారతదేశపు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశంలో 150 రైల్వే స్టేషనులకు ఈట్ రైట్ ట్యాగ్ను అందించింది విస్తారమైన రైల్వే నెట్వర్క్ లో ప్రయాణించే లక్షలాది ప్రయాణికులకు సురక్షితమైన పరిశుభ్రమైన పోషకమైన ఆహార ఎంపికలను నిర్ధారించే చొరవలో భాగంగా ఈ గుర్తింపును ప్రకటించింది గురువారం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం ఈట్ రైట్ స్టేషన్ ధ్రువీకరణ ప్రక్రియలో ఆహార విక్రతల కఠినమైన ఆడిట్లు ఫుడ్ హ్యాండర్లకు శిక్షణ ఖచ్చితమైన పరిశుభ్రత పారిశుద్ధ్య ప్రోటోకాళ్ళకు కట్టుబడి ఉండడం సమాచారంతో కూడిన ఆహార ఎంపికలపై అవగాహన పెంచే ప్రయత్నాలు ఉంటాయి. ఈ కఠినమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉండే స్టేషన్లకు ఈట్ రైటర్ స్టేషన్ సర్టిఫికేషన్ ఇవ్వబడుతుంది న్యూఢిల్లీ వారణాసి కోల్కతా ఉజ్జయిని అయోధ్య కాంట్ హైదరాబాద్ చండీగఢ్ కొంజికోడ్ గౌహతి విశాఖపట్నం భువనేశ్వర్ వడోదర మైసూర్ సిటీ భూపాల్ లోని రైల్వే స్టేషన్లు ఈట్ రైట్ స్టేషన్ లో జాబితాలో ముందున్నాయి అలాగే ఈగత్పురి ఢిల్లీలోని ఆనంద విహార టెర్మినార్ చెన్నైలోని పురచితలైవర్ ఎంజి రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్లకు కూడా ఈ గుర్తింపు లభించింది కూడా ఈ ట్యాగ్లోకి చేరాయి ఈ ట్రేడ్ స్టేషన్లుగా గుర్తింపు పొందాయి వీటిలో నోయిడా సెక్టార్ 51 ఎస్ప్లనేడ్ కోల్కతా కాన్పూర్ బొటానికల్ గార్డెన్ నోయిడా నోయిడా ఎలక్ట్రానిక్ సిటీ మెట్రో స్టేషన్లు ఉన్నాయి ఈ చొరవ ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా రైల్వే స్టేషన్లో ఆహార విక్రయిదారులను కూడా శక్తివంతం చేస్తుంది ఆహార భద్రత పరిశుభ్రత ప్రమాణాలకు కట్టుబడి ఉండడం ద్వారా వారు విశ్వసనీయతను పొందుతారు ఎక్కువ మంది వినియోగదారులు ఆకర్షిస్తారు చివరికి వారి విశ్వ జీవనోపాధిని పెంచుతారు అని ఈ ప్రకటన పేర్కొంది



ప్రయాణికులకు సురక్షితమైన పరిశుభ్రమైన పోషకాలతో కూడిన ఆహార పదార్థాలు అందిస్తున్న హైదరాబాద్ విశాఖపట్నం స్టేషన్లకు కేంద్ర ఆరోగ్య శాఖ ఈట్రైట్ స్టేషన్ ధృవపత్రం అందజేసింది దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 150 స్టేషన్లకు ఈ విధంగా ధ్రువపత్రాలు అందించినట్లు తెలిపింది ఈట్ రైట్ స్టేషన్గా విజయనగరం శ్రీకాకుళం స్టేషన్లు కూడా గుర్తింపు పొందాయి

No comments:

Post a Comment