ఔషధీయ యజ్ఞ సహిత యోగ కార్యక్రమంతో క్యాన్సర్ బ్రెయిన్ ట్యూమర్ లాంటి తీవ్ర వ్యాధులు దరి చేరవని స్వామి రాందేవ్ బాబా శిష్యుడు రాష్ట్ర ఇంచార్జి స్వామి యజ్ఞదేవ్ అన్నారు జిల్లా కేంద్రంలోని జిల్లా యోగా అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ భవన్ ఆయన సోమవారం సందర్శించి ప్రతినిధులతో మాట్లాడారు 916 రోజులుగా కామారెడ్డిలో ప్రతిరోజు ఔషధీయ యజ్ఞసైత యోగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు జిల్లా ప్రతినిధులను అభినందించారు కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గడ్డం రామిరెడ్డి యోగాచార్యులు జి అంజయ్య గుప్తా ప్రతినిధులు బి రఘుకుమార్ కే సిద్ధా గౌడ్ ఎల్లంకి సుదర్శన్ సురేష్ ఎల్లయ్య వెంకటేశం కాసర్ల రామచంద్రం తదితరులు పాల్గొన్నారు
తెలంగాణ యోగ స్పోర్ట్స్ అసోసియేషన్ సిద్దిపేట వ్యాసమహర్షి యోగ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో కామారెడ్డి ప్రతినిధులు పాల్గొని సూర్య నమస్కారాల పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి స్వర్ణ పథకాలు సాధించారు అజయ్ వద్దమనిల్ రెడ్డి స్వర్ణ పథకాలు సాధించారు వీరిని స్వామి యజ్ఞదేవ్ అభినందించారు
దైవభక్తిని పెంచుకోవాలి ప్రతిరోజు యోగా చేస్తే ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉంటామని చెడు వ్యసనాలకు దూరంగా ఉండి యోగాతో పాటు దైవభక్తి పెంపొందించుకొని మంచి పేరు ప్రతిష్టలు పొందాలని కోరారు రాందేవ్ బాబా శిష్యుడు హరిద్వార్ యజ్ఞతేశ్వర స్వామి అన్నారు బిచ్కుందలో స్కాలర్షిప్ పాఠశాలలో సోమవారం స్వామి దయానంద సరస్వతి 2 జయంతిని ఘనంగా నిర్వహించారు హరిద్వార్ కు చెందిన యజ్ఞేశ్వర స్వామి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు రాందేవ్ బాబా యోగాతో ఎన్నో దీర్ఘకాలిక ఇతర వ్యాధులు తగ్గించారు మీరు ప్రతిరోజు సూర్యోదయం కన్నా ముందు యోగా చేసి అలవాటు చేసుకోవాలని సూచించారు అనంతరం యజ్ఞం పూజా కార్యక్రమంలో నిర్వహించారు స్వామి దయానంద సరస్వతి జీవిత చరిత్ర గురించి వివరించారు ఈ కార్యక్రమంలో రఘుకుమార్ కిషోర్ ప్రిన్సిపాల్ సత్యవీర్ యోగా పతాంజలి సభ్యులు పాల్గొన్నారు.



కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి