11, ఫిబ్రవరి 2024, ఆదివారం

అయ్యప్ప ఆలయంలో వసంత పంచమి వేడుకలకు తీర్మానం

 ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో ఈనెల 14వ తేదీ వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించాలని కమిటీ తీర్మానించింది శనివారం కమిటీ అధ్యక్షుడు పద్మ శ్రీకాంత్ అధ్యక్షతన సమావేశం జరిగింది ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి వి రాజేంద్రనాథ్ ఆదాయవేయాలు చదివి వినిపించారు ఆలయ శాశ్వత కమిటీ సభ్యులు 18 వేల రూపాయలుగా నిర్ణయించి తీర్మానించారు అలాగే ఆలయ నిర్మాణం ప్రారంభం నుంచి 18 వేల కంటే ఎక్కువ శాతం చందాలు అందించిన ప్రతి సభ్యుడు శాశ్వత సభ్యులుగా పరిగణింపబడతారని తీర్మానించారు ఆలయం చుట్టూ బండల పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తామన్నారు ఆలయం వద్ద బాత్రూంలో నిర్మాణం చేపట్టాలని సభ్యులు కోరారు ఈ సమావేశంలో కమిటీ గౌరవ అధ్యక్షుడు ముదిగొండ చంద్రం ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి కోశాధికారి ఈశ్వర్ గౌడ్ సభ్యులు ప్రశాంత్ గౌడ్ ఓర భీమయ్య మురళి నాగం సాయిబాబా నవీన్ భూపాల్ పంతులు శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి