అయోధ్య రామాలయ సందర్శనకు బుధవారం కామారెడ్డి నుంచి భక్తులు ప్రత్యేక రైలులో బయలుదేరి వెళ్లారు రైలు బిజెపి జిల్లా అధ్యక్షురాలు అరుణతార ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని భక్తుల కోసం రైలు ఏర్పాటు చేశారని అన్నారు ఈ రైలు 1 345 మంది భక్తులతో కామారెడ్డి నుంచి బయలుదేరిందని అన్నారు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రాష్ట్ర కన్వీనర్ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు భక్తులు దర్శనం పూర్తి చేసుకుని ఈ నెల 26 వరకు కామారెడ్డికి చేరుకుంటారన్నారు కార్యక్రమంలో బిజెపి నాయకులు ఆలయ భాస్కర్ పైడి ఎల్లారెడ్డి జైపాల్ రెడ్డి రంజిత్ మోహన్ మర్రి రామ్ రడ్డి తేలు శ్రీనివాస్ బాపురెడ్డి రాము భరత్ సురేష్ నరేందర్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment