7, ఫిబ్రవరి 2024, బుధవారం

యూపీఐతో రైలు టికెట్లు

 రైల్వే స్టేషన్లలోని టికెట్ కౌంటర్ల వద్ద డిజిటల్ లావాదేవీలు

రైల్వే ప్రయాణికులకు శుభవార్త జనరల్ టికెట్ కొనుగోలు సమయంలో ప్రయాణికులు ఇకపై చిల్లర కోసం జేబులు తడుముకోవాల్సిన పనిలేదు రైల్వే స్టేషన్లోని టికెట్ కౌంటర్ ల వద్ద యూపీఐ లావాదేవీలు చేయవచ్చు రైల్వే స్టేషన్లో టికెట్ కౌంటర్ వద్ద ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి యూపీఐ యాప్ ద్వారా చెల్లింపులు చేసేలా దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది యూపీఐ యాప్ లేదా డెబిట్ క్రెడిట్ కార్డులతో చెల్లింపులు చేసేందుకు చర్యలు తీసుకుంది ఇందుకోసం తమ పరిధిలోని రైల్వే స్టేషన్లలో ఇప్పటికే 466 పిఓఎస్ కేంద్రాలు యూపీఐ క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేశామని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు దాదాపు అన్ని స్టేషన్లలో ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం అండ్ రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టం కౌంటర్లలో ఇవి అందుబాటులో  ఉన్నాయని తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి