పుస్తకప్రియలకు పండగే పండగ 200కు పైగా ఇంగ్లీషు 110 కి పైగా తెలుగు 30కి పైగా హిందీ తదితర భాషలతో 360కు పైగా స్టాళ్లతో కూడిన హైదరాబాద్ జాతీయ పుస్తక మహోత్సవం ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం ప్రారంభం కానుంది పది రోజులపాటు అంటే 19వ తేదీ వరకు నిర్వహించనున్నారు శని ఆదివారాల్లో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 9 గంటల వరకు మిగతా రోజుల్లో మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శకులను అనుమతిస్తారు ఈ మేరకు బుక్ ఫైర్ సొసైటీ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్ వెల్లడించారు ఎన్టీఆర్ స్టేడియంలో కొలువుతీరిన గద్దర్ స్మారక పుస్తక ప్రదర్శన ప్రాంగణాన్ని శుక్రవారం మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభిస్తారని పేర్కొన్నారు అమరవీరుల స్మారకంగా ఇక్కడ ఏర్పాటు చేయనున్న 12 అడుగుల స్థూపాన్ని తెలంగాణ ఉద్యమ నేత కోదండరాం సుప్రీంకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి ప్రారంభించనున్నట్లు కార్యదర్శి ఆర్ శ్రీనివాస్ తెలిపారు ఫిబ్రవరి 10 18 వరకు రోజు మధ్యాహ్నం బాలవికాస్ పేరుతో రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యక్షుడు కోయ చంద్రమోహన్ వివరించారు వారం పాటు రోజు సాయంత్రం సాహిత్య చర్చ పోస్టులు రచయితలతో ముఖాముఖి కార్యక్రమాలు ఉన్నట్లు తెలిపారు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి