11, ఫిబ్రవరి 2024, ఆదివారం

మార్చి 3న జిల్లా పద్మశాలి సంఘం ఎన్నికలు

 మార్చి మూడున నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు దికొండ యాదగిరి అన్నారు శనివారం నగరంలోని పద్మశాలి సంఘం భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా పద్మశాలి సంఘం సలహాదారుడిగా డాక్టర్ సత్యనారాయణ ను ఎన్నికల అధికారిగా నియమించినట్లు చెప్పారు అధ్యక్ష కార్యదర్శులతో పాటు 21 పదవులకు ఎన్నికలు జరుపుతామని అన్నారు ఈ నెల 14 నుంచి 16 వరకు నామినేషన్ల స్వీకరణ 17న స్కూటీని 18 నుంచి 19 వరకు ఉపసంహరణ ఉంటుందన్నారు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నవారు ఎన్నికల అధికారి డాక్టర్ సత్యనారాయణకు నామినేషన్ పత్రాలను సమర్పించాలని అన్నారు జిల్లాలోని పద్మశాలి సంఘ సభ్యుడు తమ ఓటును వినియోగించుకోవాలని అన్నారు ఈ సమావేశంలో సంఘ ప్రధాన కార్యదర్శి పుల్గం హనుమాన్లు గురు చరణ్ గుడ్ల భూమేశ్వర్ దేవి దాస్ గంగా దాస్ తదితరులు పాల్గొన్నారు




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి