పర్యావరణ పరిరక్షణకు మానవ మనుగడకు ప్లాస్టిక్ రహితమే ప్రాణప్రదమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల తెలిపారు నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బాసరాజేశ్వర్ వారి తల్లిదండ్రులు భాష పోశెట్టి లక్ష్మీబాయి స్మృతి అర్థం కాటన్ క్లాత్ తో రూపొందించిన హ్యాండ్ బ్యాగులను మంగళవారం జిల్లా కోర్టులోని తన ఛాంబర్ లో సీనియర్ న్యాయవాదులు మంథని రాజేందర్ రెడ్డి ఆకుల రమేష్ నీలకంఠరావు గొర్రెపాటి మాధవరావు శ్రీహరి ఆచార్య కుమార్దాస్ జై వెంకటేశ్వర్ వి భాస్కర్ మాణిక్ రాజ్ ఆశ నారాయణలతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు తాగే నీటి నుండి మొదలు తినే ఆహారం వరకు ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తున్నది అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గించి బట్టలతో తయారుచేసిన వాటిని ఉపయోగించాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు ప్లాస్టిక్ వస్తువులు వాడటం వలన అనేక అనారోగ్య సమస్యలు మనుషులను చుట్టూ ముడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతకాలపు తరం బట్టలతో చేసిన వాటిని ఉపయోగించి ఆరోగ్యంగా జీవించారని వారే నీటి తరానికి ఆదర్శం కావాలని ఆమె అన్నారు ప్రతి పౌరుడు తన తల్లిదండ్రుల పేరున క్లాత్ తో తయారు చేసిన బ్యాగులను ఇతరత్రా చిన్న చిన్న బ్యాగులను ప్రజలకు పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణకు కారకులు కావాలని ఆమె ఆకాంక్షించారు
No comments:
Post a Comment