తక్కువ ఆర్థిక వనరులతో పోషకాహార లోపం జార్జ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధ్యయనంలో వెల్లడి
పేద, మధ్యతరగతి వర్గాలకు పోషకాహారం అత్యంత భారంగా మారుతున్నది .తక్కువ ఆదాయం కలిగిన దేశాలతో పాటు మనదేశంలోని పలు ప్రాంతాల్లో ఎక్కువమంది పేద ,మధ్యతరగతి వర్గాలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ప్రముఖ పరిశోధన సంస్థ జార్జి ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ చేసిన అధ్యయనంలో ఈ విషయం వెళ్లడైంది .మొత్తం 26 అధ్యయనాలను విశ్లేషించిన తర్వాత ఇరవై రకాల న్యూట్రిషన్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు .ఆహార ఆధారిత న్యూట్రిషనల్ సప్లిమెంట్లు గర్భిణుల పోషకాహారం, చిన్నారుల పోషకాహారం వంటి సమస్యలపై పరిశోధనల్లో గుర్తించారు. అదేవిధంగా న్యూట్రిషన్ ఫుడ్ వినియోగాన్ని పెంచడంలో అంతర్జాతీయంగా ప్రత్యేక విధివిధానాలు అవసరం ఉన్నాయని ముఖ్యంగా ,ఎన్సిడి వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిందేనని అధ్యయనం తేల్చింది.
No comments:
Post a Comment