సమాజసేవే మా ఫౌండేషన్ ధ్యేయం తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి వంద రూపాయలకే అవుట్ పేషెంట్ వైద్యం
సమాజసేవే తమ ఫౌండేషన్ ధ్యేయమని నిజామాబాద్ ప్రజలకు తక్కువ రాయితీతో తమ ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య సేవలు అందజేస్తున్నామని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కవితా రెడ్డి హెల్త్ ఫౌండేషన్ చైర్ పర్సన్ కవితా రెడ్డి తెలిపారు శుక్రవారం నిజామాబాద్ నగరంలోని వీక్లీ మార్కెట్లో గల శ్రీ సాయి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కవిత రెడ్డి హెల్త్ ఫౌండేషన్ చైర్ పర్సన్ డాక్టర్ కవిత మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో గత 25 సంవత్సరాలుగా శ్రీ సాయి హాస్పిటల్ ద్వారా వైద్యరంగంలో సేవలు అందిస్తున్నామని అన్నారు నిజామాబాద్ ప్రజలకు సేవ చేయాలని సంకల్పంతో తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తక్కువ రాయితీతో వైద్య సేవలను అందజేస్తున్నామని పేర్కొన్నారు ఎందుకు సంబంధించి ఐడి కార్డులను అందజేశారు 25 ఏళ్లుగా ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు అంతేకాకుండా పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు రక్తహీనత కౌమార దశ సంబంధించిన సమస్యలపై అవగాహన జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం పాఠశాలలో ఆరోగ్యం పై అవగాహన సదస్సులను హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించామని తెలిపారు శ్రీ సాయి హాస్పిటల్స్ స్థాపించి 25 సంవత్సరములు పూర్తి చేసుకున్న సందర్భంగా హెల్త్ ఫౌండేషన్ ద్వారా నిరుపేద మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే వైద్యం అందించేందుకు సంకల్పించామని అన్నారు తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి వంద రూపాయలకే ఓపి వైద్యం అందిస్తున్నాము కేవలం ఓపి కాకుండా ఇతర వైద్య సేవలు శాస్త్ర చికిత్సలు రాయితీపై వైద్య సేవలు అందజేస్తామని పేర్కొన్నారు ప్రత్యేక గుర్తింపు కార్డులు అందుబాటులో తీసుకు వస్తున్నాను అన్నారు గైనకాలజీ తో పాటు పీడియాట్రిక్ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు 25 ఏళ్లుగా ఐద్య సేవలో ముందంజలో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని అన్నారు ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు
No comments:
Post a Comment