నో యువర్ కస్టమర్ కేవైసీ మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని ఆర్బిఐ మరోసారి హెచ్చరించింది స్కామర్లు ఫోన్ కాల్స్ ఎస్ఎంఎస్ ఈమెయిల్ తో బాధితుల వ్యక్తిగత సమాచారం ఖాతా వివరాల వంటివి చోరీ చేస్తున్నారు మోసగాళ్లు ఇలాంటి కమ్యూనికేషన్ పంపి కస్టమర్లు ఆందోళన పడేలా చేస్తారు వెంటనే కేవైసీ అప్డేట్ చేసుకుంటే ఖాతా రద్దు అవుతుందని భయపెడతారు. దీంతో బాధితుడు భయపడి మొత్తం సమాచారం ఇస్తాడు ఫైనాన్షియల్ సైబర్ మోసాలు జరిగితే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ లో లేదా సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ ద్వారా ఫిర్యాదు చేయాలని ఆర్పిఐ తెలిపింది కేవైసీ అప్డేషన్ కోసం ఏదైనా రిక్వెస్ట్ వస్తే నిర్ధారణ కోసం నేరుగా బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థను సంప్రదించాలని పేర్కొంది ఆర్థిక సంస్థ కస్టమర్ కేర్ ఫోన్ నెంబర్ను దాని అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే తీసుకోవాలి ఖాతా లాగిన్ వివరాలు వెరిఫై కానీ యాప్లను ఇన్స్టాల్ చేయడం వల్ల కూడా మోసాలు జరిగే అవకాశాలు ఉంటాయని ఆర్బిఐ తెలిపింది
No comments:
Post a Comment