గాంధారి మండలం నేరల్ తండాలో ఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు అనంతరం స్వామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఊరేగించారు మాజీ ఎంపీపీ దశరథ నాయక్ మాజీ సర్పంచి కామోజీ బాయ్ తండా నాయకులు చందా నాయక్ భజన లాల్ మ్యాల్ సింగ్ ప్రకాష్ నర్సింగ్ బిచ్చం నెహ్రు భగత్ నారాయణ తదితరులు పాల్గొన్నారు
జుక్కల్ మండలం కౌలాస్ గ్రామంలోని వృషభ లింగ శివాచార్య మత సంస్థాన్ లో మఠాధిపతి బసవలింగ శివాచార్య ఆధ్వర్యంలో వసంత పంచమి రథసప్తమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి శనివారం తెల్లవారుజామున రథాన్ని ఊరేగించారు మహాదేవుని మందిరం వద్ద నిర్వహించిన అగ్నిగుండంలో భగభగ మండే నిప్పురవ్వలపై నడుస్తూ భక్తులు తమ భక్తిని చాటుకున్నారు మరాఠీ కన్నడ భాషలో చేసిన భజనలు కీర్తనలు ఆకట్టుకున్నాయి వ్రతం ఊరేగింపులో భక్తులు శివసత్తుల వేషధారణతో పాల్గొన్నారు అనిత సింగ్ శంకర్ పటేల్ బోడ సాయిలు వీరేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు
19 నుంచి కనకదుర్గమ్మ స్థిర ప్రతిష్ట ఉత్సవాలు బాన్సువాడ పట్టణంలోని కనకదుర్గ అమ్మవారి ఆలయ స్థిర ప్రతిష్ట ఉత్సవాలను ఈ నెల 19 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు సరస్వతి దేవి ఆలయంలో శనివారం ఉత్సవాలకు సంబంధించి కరపత్రాలు ఆవిష్కరించారు అర్చకులు సంతోష్ శర్మ ప్రతినిధులు సత్యనారాయణ తుకారాం రాజు నర్సిగొండ విజయ్ శ్రీనివాస్ సాయిలు తదితరులు పాల్గొన్నార
మండలంలోని తెలంగాణ తిరుమలలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు ఉదయం సుప్రభాతం ఆరాధన అష్టోత్తర నామ పూజలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చే స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు ఆలయ కమిటీ సభ్యులు నాగేశ్వరరావు నరసరాజు అప్పరావు మేనేజర్ విట్టల్ అర్చకుడు నందకిషోర్ పాల్గొన్నారు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వేణుగోపాల స్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు భక్తులు కోవూరి రవికుమార్ జ్యోతి రాణి ఆధ్వర్యంలో 5100 విరాళం శనివారం అందజేశారు ఆలయ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ధర్మకర్త కంచర్ల మధు కోరారు
పిట్ల మండల కేంద్రంలోని రాజరాజేశ్వరాలయం రాజన్న కుంటలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు స్వామి వారికి అర్చనలు అభిషేకాలు చేశారు పిట్లం కు చెందిన సాయి ప్రసాద్ శివ స్వాములకు భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేశారు


కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి