హైదరాబాద్ నగర శివారులో ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న పెద్ద గోల్కొండ గ్రామంలో కళ్యాణి చాళుక్యుల కాలపు గణేశ విగ్రహాన్ని గుర్తించినట్లు చరిత్రకారులు తెలిపారు చరిత్ర పరిశోధకుడు డాక్టర్ ఎస్ జై కిషన్ ఇచ్చిన సమాచారం మేరకు ప్లీజ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి కొత్త తెలంగాణ చరిత్ర బృందం నిర్వాహకులు శ్రీరామోజు హరగోపాల్ బివి భద్రగిరి శనివారం నాడు శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ గ్రామంలోని భగీరథ శివాలయం ఆంజనేయాలయంలోని చారిత్రక శిల్పాలను పరిశీలించారు శివాలయం ముందు మూడు అడుగుల వెడల్పు నాలుగడుగుల ఎత్తు రెండు అడుగుల మందంతో నల్ల శారపు రాతిలో చెక్కిన గణేశుని రెండు చేతుల్లో దంతం కుడుము ఉన్నాయని తలపై చిన్న కిరీటం లలాటహారం ఉదయ బంధం నాగ యజ్ఞోపవీతం బాహుబలి యాలు కంకణాలు కాళ్లకు కడియాలు ధరించి లలితాసనంలో కూర్చుని ఉన్నాడని ప్రతి మా లక్షణాన్ని అనుసరించి ఈ విగ్రహం క్రీస్తు శకం 12వ శతాబ్దికి చెందిన కళ్యాణి చాళుక్య శిల్ప శైలికి అద్దం పడుతుందన్నారు ఇంకా అక్కడ అద్భుతమైన శిల్పాలు ఉన్నాయని చారిత్రక వివరాలతో కలకాలం ఏర్పరిచి భద్రపరిచి భావితరాలకు అందించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి