22, ఆగస్టు 2026, శనివారం

వెల్డర్ కోర్సులో.. ఉచిత శిక్షణ

 యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పురంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ లో " మేధ చారిటబుల్ ట్రస్ట్ " ఆధ్వర్యంలో మూడు నెలల కాల వ్యవధి గల "వెల్డర్ కోర్సులో ఉచిత శిక్షణ" ఇస్తున్నట్లు సంస్థ ఛైర్మన్ ఎన్ కిశోర్ రెడ్డి తెలిపారు. 

ఎస్సెస్సీ విద్యార్హతతో పాటు 18-25 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారు ఈ నెల 27 లోపు సంస్థ లో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో " ఉచిత హాస్టల్, ఉచిత భోజన సదుపాయం కూడా కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం తప్పని సరిగా ఉద్యోగం కూడా కల్పిస్తామని తెలిపారు 

పూర్తి సమగ్ర వివరాలకు 9133908000,9948466111 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి