కరీంనగర్ లో వినాయక చవితి ఉత్సవాలకు ఏర్పాటు చేయబోయే గణేష్ మండపాలకు వినియోగిస్తున్న కరెంట్ కు బిల్లులు తాము చెల్లించి మండపాలకు" ఉచితంగా కరెంట్ " అందించాలని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడించారు.
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ప్రతి ఏడాది దాదాపు రెండు వేల గణేశ్ మండపాలను ఏర్పాటు చేస్తుండగా గత మూడేళ్లుగా ఈ మండపాలకు వినియోగిస్తున్న కరెంట్ ఛార్జీలను మొత్తం బండి సంజయ్ కుమార్ తన సొంత డబ్బులతో చెల్లిస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం కార్పొరేషన్ మేయర్ పదవి బీజేపీ ఆధీనంలో ఉండటంతో బిల్లులను కార్పొరేషన్ చెల్లిస్తుందని ప్రకటించారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి