తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టికెట్ల పై రాయితీ ప్రకటించింది. ప్రయాణికులు తాము వెళ్లవలసిన గమ్య స్థానం, తిరుగు ప్రయాణం టికెట్లు ఒకే సారి బుక్ చేసుకుంటే రిటర్న్ జర్నీ టికెట్ ధర లో 10% రాయితీ కల్పిస్తామని తెలిపింది. ఒక బుకింగ్, రెండు ప్రయాణాలు, ఎక్కువ మిగులు నినాదంతో RTC ఈ విధానం అందుబాటులోకి తెచ్చింది. కాగా అన్ని రకాల బస్సులలో ఈ రాయితీ సౌకర్యం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి