తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నీట్ 2027 లాంగ్ టర్మ్ ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ గురుకుల సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది. 2026-27 విద్యా సంవత్సరంలో హైదరాబాద్ చిలుకూరు సీ ఓ ఈ లో బాలురకు, మహేంద్ర హిల్స్ సిఓఈ లో బాలికలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ తెలిపింది. బాల బాలికలకు 200 సీట్లు ఉన్నాయని ఇందులో బాలురు బాలికలకు చెరో వంద సీట్లు కేటాయించామని తెలిపారు.
2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్ బై పీసీ పాస్ అయి నీట్ 2026 పరీక్షకు హాజరైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ,బీసీ, ఈడబ్ల్యూఎస్ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారాన్ని గురుకుల సొసైటీ అధికారిక వెబ్సైట్ నుంచి పొందాలని పూర్తి వివరాలతో అవసరమైన ధృవ పత్రాలను జత చేసి సంబంధిత జిల్లా కోఆర్డినేటర్ కు సమర్పించాలని తెలిపింది. దరఖాస్తు సమర్పణకు ఈనెల 22 చివరి తేదీ అని స్పష్టం చేసింది. దరఖాస్తు కు ఎలాంటి ఫీజు అవసరం లేదని స్పష్టం చేశారు.
https://tgswrcis.telangana.gov.in
కామారెడ్డి జిల్లా కో ఆర్డినేటర్.. ఉప్పల్వాయి..97045 50256.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి