తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతి యువకులకు కాకా వెంకట స్వామి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వాలని నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం పరిధిలో మందమర్రి, చెన్నూరు పట్టణాల్లో ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
చెన్నూరు మున్సిపాలిటీ లోని మహిళా భవన్, మందమర్రి లోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న భవనం/ షెడ్డు లో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కేంద్రాలను రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ బుధవారం ప్రారంభించారు. సుమారు 3 నెలల పాటు ఈ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు వారు తెలిపారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి