25, మార్చి 2024, సోమవారం

రెండువేల కిలోల ద్రాక్షతో గణేశుడు ఆలయం ముస్తాబు

 మహారాష్ట్రలోని పూణేలు ప్రసిద్ధిగాంచిన దగడు సేటు వినాయక ఆలయం హోలీ సందర్భంగా ద్రాక్ష పనులతో ముస్తాబయింది సుమారు రెండువేల కిలోల నలుపు ఆకుపచ్చని ద్రాక్షలతో ఆదివారం ఆలయ ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దారు సంకటహర చతుర్థి రోజున ద్రాక్ష మహోత్సవం వైభవంగా జరుపుకుంటారు గణపతి వద్ద ఉంచిన పండ్లను భక్తులు పలు సంస్థలతో పాటు ససుమూన్ దవాఖాన పితాశ్రీ వృద్ధాశ్రమాలకు పంపిణీ చేస్తామని నిర్వాహకులు తెలిపారు

హనుమాన్ దీక్షను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలి

 


హనుమాన్ దీక్షను తీసుకున్న స్వాములు భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని తోపుట పీఠాధిపతి స్వామి మాధవానంద అన్నారు మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయం ఆయన సందర్శించారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు హనుమాన్ స్వాములను ఉద్దేశించి మాట్లాడారు ప్రతి ఏడాది వేసవికాలంలో హనుమాన్ దీక్ష తీసుకున్న వారు అభివృద్ధి చెందుతారన్నారు దీక్ష తీసుకున్న వారికి ఆశీర్వాదం అందజేశారు




మద్నూర్ మండలంలోని శాఖాపూర్ గేటు వద్ద మైనారిటీలు హనుమాన్ స్వాములకు పండ్లను పంపిణీ చేశారు జుక్కల్ మండలం తిమ్మరాజు కల్లాలి నుంచి మద్నూర్ మండలం సలాబత్ కు ఆంజనేయస్వామి ఆలయానికి పాదయాత్రగా వస్తున్న స్వాములకు కాంగ్రెస్ యువ నాయకులు అజీమ్ పటేల్ ఆధ్వర్యంలో అల్పాహారం కింద పండ్లను పంపిణీ చేశారు దేశ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పడానికి మైనారిటీ సోదరులు హిందూ ముస్లింలు భాయి భాయిగా కొనసాగాలన్నారు మాజీ సర్పంచ్ రమేష్ దేశాయి హనుమాన్ స్వాములకు పంటను పంపిణీ చేసిన మైనారిటీలకు కృతజ్ఞతలు తెలిపారు

నియమ నిష్ఠలతో కొనసాగుతున్న రంజాన్ ఉపవాస దీక్షలు

 


ముస్లింల పవిత్ర మాసం రంజాన్ మాసంలో చేపట్టే ఉపవాస దీక్షలు నియమా నిష్టల మధ్య కొనసాగుతున్నాయి ఈనెల 12 నుంచి ప్రారంభమైన ఈ ఉపవాస దీక్షలు ఏప్రిల్ 10 రాత్రికి ముగుస్తాయి శవ్వాళ మాసం చంద్ర దర్శనంతో ఏప్రిల్ 11న ముస్లింలు రంజాన్ ఈద్-ఉల్-ఫితర్ పర్వదినాన్ని జరుపుకోవాలని సన్నద్ధమవుతున్నారు. ఈ మాసంలోనే దివ్య ఖురాన్ ముస్లింల పవిత్ర గ్రంథం దివి నుంచి భూమికి పంపబడిందిగా విశ్వసిస్తూ అత్యంత పవిత్ర రాత్రిగా కొలిచే షబ్బీ ఖద్రి జాగరణ రాత్రిని అత్యంత భక్తిశ్రద్ధలతో దైవారాధనలో గడుపుతారు రంజాన్ ప్రారంభంలో మొదలుపెట్టిన తరావీ నమాజులు దివ్య ఖురాన్ పట్టణం రాత్రి నమాజ్తో ముగిసింది రంజాన్ మాసంలో అన్ని రాత్రుల కన్నా ఈ రాత్రిని శుభాల రాత్రిగా పరిగణిస్తారు రంజాన్ మాసం ఆరంభం నుండి చిన్న పెద్దల నమాజులతో మసీదులు ముస్లింల ఇల్లు దైవారాధనలతో కలకలలాడుతాయి రంజాన్ మాసంలో ముస్లింలు పరస్పర ఇఫ్తార్ విందులలో పాల్గొంటున్నారు. కాగా ఎన్నికల కూడా అమలు ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఇఫ్తార్ విందు ఈసారి లేనట్టుగానే కనిపిస్తుంది. ఈ దఫా ఎండలు దంచి కొట్టడంతో కొంతమేర ఇబ్బందులు తప్పడం లేదు అయినా దీక్షపరులు దైవారాధనలు ఉత్సాహంగా ఈ ఉపవాస దీక్షలో పాల్గొనడం గమనార్హం