25, మార్చి 2024, సోమవారం

ఆన్లైన్లో రామయ్య కళ్యాణం టికెట్లు

 భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఏప్రిల్ 17న జరగనున్న రామయ్య కళ్యాణం శ్రీరామనవమి 18న స్వామివారి మహా పట్టాభిషేకం కార్యక్రమాలకు సెక్టార్ టికెట్లను ఆన్లైన్ ద్వారా భక్తులు పొందే అవకాశం కల్పించినట్లు ఈవో రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు కళ్యాణ మహోత్సవానికి 7500 దంపతులు 2500 2000 1000 300 150 పట్టాభిషేకం టికెట్లు 1500 500 రూపాయలుగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు

భక్తులు భద్రాద్రి దేవస్థానం వెబ్ సైట్ https://bhadradritemple.Telangana.gov.in ద్వారా సోమవారం నుంచి బుక్ చేసుకోవచ్చని వివరించారు దేవస్థానంలో నేరుగా టికెట్లు పొందాలని భక్తులకు ఆలయం వద్ద తాళించా కళ్యాణ మండపం బ్రిడ్జి పాయింట్ సి ఆర్ వో కార్యాలయం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు భక్తులు గుర్తింపు కార్డు సిబ్బందికి చూపించి టికెట్లు పొందవచ్చు అని ఈవో సూచించారు

పెళ్లి కోసం పెట్టుబడి ఎక్కడ

 మనదేశంలో వివాహాలు సాధారణంగా చూస్తే తక్కువ ఖర్చుతో ముగిసేవి కావు మీరు అనుకుంటున్నాట్లు ప్రతినెలా 45 వేల రూపాయల చొప్పున వచ్చే ఆరేళ్ల పాటు ఇన్వెస్ట్ చేసినట్లయితే గననీయమైన మొత్తం సమకూర్తుంది వివాహం లక్ష్యం విషయంలో రాజీ పడలేము అనుకున్న సమయానికి కావాల్సినంత చేతికి అందాల్సిందే వాయిదా వేయడానికి ఉండదు తక్కువ రిస్కు కోరుకునేవారు మధ్యమార్గాన్ని అనుసరించాలి 50 శాతాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీని వల్ల పెట్టుబడికి రెస్క్ ఉండదు మిగిలిన 50 శాతాన్ని వృద్ధి కోసం ఈక్విటీలకు కేటాయించుకోవాలి డెట్ విషయంలో షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ లేదా టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్ను ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీ పెట్టుబడులకు లార్జ్ క్యాప్ ఫండ్స్ లేదా లో కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్ నుంచి ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ అధిక రిస్కు తీసుకునే సామర్థ్యం ఉంటే అప్పుడు కాస్త దూకుడుగా పెట్టుబడిన సాధనాలను ఎంపిక చేసుకోవచ్చు ఆటుపోట్లను తట్టుకునేట్లయితే ఈక్విటీలకు 65% నుంచి 80 శాతాన్ని కేటాయించుకోవచ్చు మిగిలిన మొత్తాన్ని డెట్ సాధనాలకు కేటాయించుకోవాలి బంగారం కోసమే అయితే సార్వభౌమ బంగారం బాండ్లలో ఎస్జీబీలు కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు బంగారం విలువ పెరుగుదలకు తోడు పెట్టుబడి విలువపై ఏటా 2.5% వడ్డీ రేటు లభిస్తుంది ఈ బంగారంతో సోదరి పెళ్లి కోసం కావాల్సిన ఆభరణాలు చేయించవచ్చు

పోక్సో ఈ బాక్స్ తో బాధితులకు భరోసా

 మైనర్లు మహిళలపై దాడులు వేధింపుల ఘటనలు ప్రతిరోజు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి పలు కారణాలతో చాలా ఘటనలు బయటకు రాకుండా రాజులతో ముగిసిపోతున్నాయి వీటిపై ఫిర్యాదు చేసేందుకు ప్రజలు భయపడుతున్నారు ఇలాంటి వాటికి చెక్ పెడుతూ ఫిర్యాదుదారుల వివరాలు పోలీసులకు సైతం తెలియకుండా రహస్యంగా ఉంచి బాధ్యతలు బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల సరికొత్త యాప్ అందుబాటులోకి తెచ్చింది ఆన్లైన్ వేదికగా ఫోక్సో ఈ బాక్స్ పేరిట యాప్ ను రూపొందించింది కళ్ళ ముందు వేధింపులు అఘాయిత్యాలు జరిగితే ధైర్యంగా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు



కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ యాప్ లో వచ్చే ఫిర్యాదులను ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తుంది. యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి రాష్ట్ర జిల్లా కార్యాలయానికి ఒకేసారి సమాచారం ఇస్తారు బాలల సంరక్షణ అధికారి సిబ్బంది విచారణ చేపడతారు 100% పారదర్శకతతో కేసు నమోదు అవుతుంది ఫిర్యాదుదారులకు రక్షణ ఉండేలా నేరానికి పాల్పడిన వారికి శిక్షపడేలా యంత్రాంగం తోడ్పాటునందిస్తుంది. యాప్ పై అధికారులు గ్రామీణ స్థాయి నుంచి అవగాహన కల్పిస్తే చాలా వరకు వేధింపుల కేసులకు అడ్డుకట్ట వేయవచ్చు అని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది

కాలికలు మహిళల సంరక్షణను సామాజిక బాధ్యతగా భావించే ప్రతి ఒక్కరు స్మార్ట్ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఫోక్సో ఈ బాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలు తెలిస్తే ఈ యాప్ ఓపెన్ చేసి ఈ బాక్స్ పై క్లిక్ చేయాలి చిన్నారులకు ఎదురయ్యే ఆరు రకాల హింసలకు సంబంధించిన చిత్రాలు ఇందులో కనిపిస్తాయి ఘటనకు సంబంధించిన హింస స్వభావాన్ని గమనించి చిత్రంపై క్లిక్ చేయాలి అనంతరం ఫిర్యాదు పత్రంలో బాధితులకు జరిగిన ఘటన వివరాలు పొందుపరిచి సమర్పించాలి