6, మార్చి 2024, బుధవారం

దరఖాస్తుల ఆహ్వానం

 నిజామాబాద్ జిల్లాలో ఎన్హెచ్ఎం ఆధ్వర్యంలో జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ న్యూట్రిషన్ కౌన్సిలర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నామని డిఎంహెచ్వో సుదర్శనం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు దీనికి సంబంధించిన దరఖాస్తు ఫారాలు నిజామాబాద్ డాట్ తెలంగాణ డాట్ గవ్ డాట్ఇన్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు వాటిని పూర్తిచేసి ఈ నెల 11వ తేదీ వరకు డిఎంహెచ్ఓ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు

ఆధ్యాత్మిక సమాచారం,6-3-2024

 భక్తిశ్రద్ధలతో బోనాలు



కామారెడ్డి జిల్లా కేంద్రంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో గొల్లవాడలో ఎల్లమ్మకు మహిళలు మంగళవారం బోనాలు తీశారు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు

శివ శివరామ మందిరంలో కలశ పూజ 

దోమకొండ శివరామ మందిరంలో గంగ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో భాగంగా మంగళవారం కలిసి పూజ నిర్వహించారు జెడ్పిటిసి తిరుమల గౌడ్ ఆలయ ఈవో ప్రభు అధ్యక్షుడు అబ్రబోయిన రాజేందర్ ధర్మకర్తలు లింగారెడ్డి చిన్న రాజయ్య నర్సింలు సిద్ధ రాములు తిరుపతి పాల్గొన్నారు

వైభవంగా విశ్వశాంతి మహా యజ్ఞం

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టేక్రియాల్లో విశ్వశాంతి మహా యజ్ఞాన్ని మంగళవారం నిర్వహించారు సాధు పరిషత్ ప్రతినిధి కృష్ణానంద స్వామి కార్యక్రమంలో భాగస్వాములయ్యారు భక్తులు కమిటీ ప్రతినిధులు హాజరయ్యారు

అఖండ హరినామ సప్తాహ ప్రారంభం

పెద్ద కోడప్పగల మండలంలోని కాటేపల్లి గ్రామంలో మంగళవారం కాటేపల్లి భజన మండలి అధ్యక్షుడు పిట్టల మహారాజ్ ఆధ్వర్యంలో అఖండ హరినామ సప్తహ కార్యక్రమం నిర్వహించారు 37 గ్రామాల నుంచి భజన మండలిలు పాల్గొంటారని ఆయన తెలిపారు

ఆలయ అభివృద్ధికి విరాళం

కామారెడ్డి జిల్లా కేంద్రంలో పురాతన వేణుగోపాలస్వామి ఆలయ పునరుద్ధరణకు భక్తుడు తాటిపాముల కృష్ణమూర్తి మంగళవారం ఐదువేల ఒక్క రూపాయల విరాళం అందజేశారు

14 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ఈనెల 14 నుంచి 19 వరకు వేల్కూరు శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో నిర్వహించనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కోరారు మంగళవారం శ్రీవారి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసే తీర్థ ప్రసారం స్వీకరించారు అనంతరం బ్రహ్మోత్సవాల కరపత్రాలను విడుదల చేశారు ఆలయ కమిటీ సభ్యులు నాగేశ్వరరావు నరసరాజు కృష్ణారెడ్డి రాజు శరత్ సత్యనారాయణ మేనేజర్ విటల్ అర్చకుడు నందకిషోర్ పాల్గొన్నారు



5, మార్చి 2024, మంగళవారం

పేదలకు అండగా వరల్డ్ విజన్

 లక్ష్మణ చాందా మండలంలోని మునిపల్లి గ్రామానికి చెందిన ముండ్ల మమతా నిరుపేద కుటుంబానికి జీవనోపాధి రీత్యా కిరాణా దుకాణం ప్రారంభించేందుకు వరల్డ్ విజన్ సంస్థ తరఫున 20000 రూపాయలతో పాటు షాపులోని సరుకులను స్టేషనరీని విరాళంగా అందజేశారు కష్టాలలో ఉన్న తమను గుర్తించి ఉపాధి కల్పించిన వరల్డ్ విజన్ వారికి మమతతో పాటు తమ కుటుంబ సభ్యులు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ హనుమన్న నాయకులు శేఖర్ రెడ్డి రమేష్ క్రమ కమిటీ ప్రెసిడెంట్ అశోక్ వరల్డ్ విజన్ సిబ్బంది ఉన్నారు