29, ఫిబ్రవరి 2024, గురువారం

పులగం ఎలా చేయాలి

 బియ్యం ఒక కప్పు పెసరపప్పు అరకప్పు ఉల్లిగడ్డ ఒకటి పచ్చిమిర్చి ఆరు మిరియాలు అర టీ స్పూన్ ఆవాలు జీలకర్ర ఒక టీ స్పూన్ చొప్పున పసుపు పావు టీ స్పూన్ నూనె రెండు టేబుల్ స్పూన్లు కరివేపాకు రెండు రెబ్బలు ఉప్పు తగినంత

బియ్యం పెసరపప్పు కడిగి విడివిడిగా గంటసేపు నానబెట్టుకోవాలి కుక్కర్లో నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు జీలకర్ర మిరియాలు తరిగిన ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు వేయాలి బాగా వేగాక పసుపు కలపాలి నానబెట్టిన పెసరపప్పు బియ్యం తగినంత ఉప్పు జోడించి రెండు నిమిషాలు బాగా కలిపి మూడు కప్పుల నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికిస్తే నోరూరించే పులగం సిద్ధమవుతుంది

జీవన ప్రమాణాల పెంపునకు సైన్స్ దోహదము

 సైన్స్ మానవజీవన ప్రమాణాల పెంపునకు దోహదపడుతుందని నోబెల్ బహుమతి గ్రహీత జెనెటిక్ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ అన్నారు ఎన్నో ఆవిష్కరణలకు బాటలు వేసిన సైన్సు కెరీర్ గా ఎంచుకోవాలని విద్యార్థులకు సూచించారు బుధవారం జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గీతం డేముడు యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో సెమింజాతో మాట్లాడుతూ సృజనాత్మకతతో ప్రయోగాలను ఆవిష్కరించాలని చెప్పారు శరీరకణాలు ఆక్సిజన్ ను ఎలా అందజేస్తున్నాయో అర్థం చేసుకోవాలని ఆక్సిజన్ స్థాయిలను నియంత్రిస్తున్న ప్రోటీన్ హై ఫైక్స్ ప్రేరేపించగల కారకాన్ని కనుగొనడానికి చేపట్టిన సంచలనాత్మక పరిశోధన తనకు నోబెల్ బహుమతి తెచ్చిపెట్టిందని వివరించారు ఈ సందర్భంగా గ్రీకును డిఎస్పీ కార్యదర్శి డాక్టర్ ఎస్ చంద్రశేఖర్ గీతం అదనపు కులపతి ప్రొఫెసర్ డిఎస్ రావు సత్కరించారు కార్యక్రమంలో శ్రీనిధ ఇంటర్నేషనల్ స్కూలు కీసర పల్లవి ఇంటర్నేషనల్ స్కూలు జనసిస్ స్కూల్లో ప్రతినిధులు పాల్గొన్నారు



హైదరాబాదులో అమెరికన్ ప్రీస్కూల్

 వేల కోట్లు పెట్టుబడులను స్వాగతిస్తూ అనే కానేక జాతీయ అంతర్జాతీయ సంస్థలు కంపెనీలకు నిలవుగా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు అమెరికన్ స్కూల్లను ఆకర్షిస్తుంది ఇప్పటికే గూగుల్ అమెజాన్ అంటే సంస్థలు హైదరాబాద్కు తరలిరాగా తాజాగా ఒక అమెరికన్ స్కూల్ హైదరాబాదులో ఏర్పాటయింది గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఏర్పాటు చేసిన సఫారీ కీడు ప్రీ స్కూల్ డే కేర్ సెంటర్ ను పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని బుధవారం ప్రారంభించారు సఫారీ కిడ్ ప్రీస్కూల్ను 2005లో సిలికాన్ వ్యాలీలో తీసుకొచ్చారు ఆ తర్వాత అమెరికా కెనడా వరకు విస్తరించిన ఈ స్కూల్ ఇప్పుడు మనదేశంలోని హైదరాబాద్లో పాఠశాల నెలకొల్పింది. వచ్చే విద్యా సంవత్సరం వరకు దేశంలోని 10 ప్రముఖ పట్టణాలలో ఈ స్కూలు నెలకొల్పుతామని సఫారీ కిడ్ ఇండియా చైర్మన్ జితేంద్ర కర్సన్ తెలిపారు