25, ఫిబ్రవరి 2022, శుక్రవారం

గోవా స్పీకర్ నిర్ణయం సరైందే

 12 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని వచ్చిన అభ్యర్థనలను తిరస్కరిస్తూ గోవా స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని ముంబై హైకోర్టు గోవా ధర్మాసనం సమర్థించింది. కాంగ్రెస్కు చెందిన పది మంది మహారాష్ట్ర వాది gomantak పార్టీ కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు 2019లో ఆ పార్టీలను వీడి బీజేపీలో చేరారు. వీరిని అనర్హులుగా ప్రకటించాలని వచ్చిన దరఖాస్తులను గోవా స్పీకర్ తిరస్కరించారు. దీంతో పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపి గోవా స్పీకర్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ తీర్పు వెలువరించారు.


27 న కబడ్డీ ఎంపిక పోటీలు

 రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల కోసం  జట్ల ఎంపిక ఈనెల  27న చేపట్టనున్నట్లు కామారెడ్డి జిల్లా కబడ్డీ ప్రధాన కార్యదర్శి శ్రీ లింబా రెడ్డి తెలిపారు . కామారెడ్డి శ్రీ సరస్వతి శిశు మందిర్ క్రీడా మైదానంలో జరిగే ఈ ఎంపిక లో పాల్గొని బాలురు 70 కిలోలు లోపు, బాలికలు 65 కిలోలు లోపు ఉండాలని తెలిపారు. విద్యార్థులు తమ వెంట పదవతరగతి మెమో ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావాలని తెలిపారు ప్రతిభగల విద్యార్థులను ఎంపిక చేసి రాష్ట్రస్థాయికి పంపుతామన్నారు. పూర్తి వివరాలకు వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీ ఎస్ నగేష్ 9492013365,ఏ.నాగరాజు9441042622 లను సంప్రదించాలని సూచించారు.