Friday 25 February 2022

గోవా స్పీకర్ నిర్ణయం సరైందే

 12 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని వచ్చిన అభ్యర్థనలను తిరస్కరిస్తూ గోవా స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని ముంబై హైకోర్టు గోవా ధర్మాసనం సమర్థించింది. కాంగ్రెస్కు చెందిన పది మంది మహారాష్ట్ర వాది gomantak పార్టీ కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు 2019లో ఆ పార్టీలను వీడి బీజేపీలో చేరారు. వీరిని అనర్హులుగా ప్రకటించాలని వచ్చిన దరఖాస్తులను గోవా స్పీకర్ తిరస్కరించారు. దీంతో పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపి గోవా స్పీకర్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ తీర్పు వెలువరించారు.


No comments:

Post a Comment