19, మార్చి 2024, మంగళవారం

జిల్లా మైన్స్ అధికారిగా నగేష్

 కామారెడ్డి జిల్లా మైన్స్ జియాలజీ సహాయ సంచాలకులుగా నగేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు ఇక్కడ పని చేసిన క్రాంతి కుమార్ ఇటీవల బదిలీ అయ్యారు ఆయన స్థానంలో నగేష్ నారాయణపేట జిల్లా నుంచి బదిలీ వచ్చారు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను కలసి మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు

కురుమ సంఘం నూతన కార్యవర్గం

 కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి కురుమ సంఘం నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా చిందం మల్లేష్ ఉపాధ్యక్షులుగా దొడ్ల చిన్న సాయిలు నాగల్ల బీరయ్య క్యాషియర్గా ఒగ్గు నర్సింలు రైటర్గా బుల్లి శ్రీశైలం కార్యవర్గ సభ్యులుగా మచ్చ గంగాధర్, బండారి మహేష్ భాస్కర్, దుమాల మల్లేష్ గౌరవ ఉపాధ్యక్షుడిగా గండాల రవి ఎన్నికయ్యారు



నేడు గీతా మందిర 22వ వార్షికోత్సవం

 కామారెడ్డి పట్టణంలోని స్థానిక సిరిసిల్ల రోడ్డులోని శ్రీకృష్ణ గీతా మందిరం 22వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 19న మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జీవిత తత్వార్త జ్ఞాన సత్సంగం కార్యదర్శి అర్వపల్లి రమేష్ తెలిపారు మధ్యాహ్నం మహాప్రసాదం సాయంత్రం వేదగాన ప్రవచనాలు ఉంటాయన్నారు