18, మార్చి 2024, సోమవారం

మానవత్వానికి జీవం పోయాలి సీనియర్ సివిల్ న్యాయాధికారి

 సభ్య సమాజంలో మనుషులు మానవత్వాన్ని మరిచిపోతున్నారని మానవత్వానికి జీవం పోయాలని సీనియర్ సివిల్ న్యాయాధికారి నసీం సుల్తానా అన్నారు ఆదివారం పట్టణంలోని చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఉచిత ఆపరేషన్లు కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అంటూ ఎం జె ఆస్పత్రి డాక్టర్ మధుశేఖర్ చేయూత సంస్థ ద్వారా సేవ చేయడం అభినందనీయమన్నారు తల్లిదండ్రులను మరిచిపోతున్న సమాజం ఇలాంటి డబ్బులను ఆశించకుండా పేదవారికి సేవలు చేస్తున్నారని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని తనకు నచ్చిన సేవలను చేస్తూ ముందుకు సాగాలని ఆమె అన్నారు ఈ ఉచిత క్యాంపు ద్వారా సుమారు వందమంది మహిళలకు ఆపరేషన్లు చేసినట్లు డాక్టర్ మధు శేఖర్ తెలిపారు అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా సీనియర్ సివిల్ న్యాయాధికారి నసీం సుల్తానా తో పాటు మరికొందరు మహిళా డాక్టర్లను పట్టు శాలువా పూలమాల మేమంటోతో డాక్టర్ మధు శేఖర్ దంపతులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో చేయూత స్వచ్ఛంద సంస్థ సభ్యులు కలిగుట గంగాధర్ బి నాగరాజు ఐడియా సాగర్ డాక్టర్ శ్రీలత ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు



పదో తరగతి విద్యార్థులకు ఉచిత ప్రయాణం

 పదో తరగతి పరీక్షల నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్య విద్యార్థులకు ఆర్టీసీ ఆధ్వర్యంలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు డిఎం ఇందిరా ఒక ప్రకటనలో తెలిపారు హాల్ టికెట్ చెబితే సిబ్బంది విద్యార్థులను అనుమతించాలని సూచించారు హాల్ టికెట్ ను ఆర్టీసీ సిబ్బందికి చూయించి పదవ తరగతి విద్యార్థులు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు

24న సైలని బాబా ఉరుసు ఉత్సవాలు

 కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం కౌలాస్ గ్రామంలో ఉరుసు ఉత్సవాలు

ఈ నెల 24న కౌలాస్ గ్రామంలో సైలని బాబా ఉర్సు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు షేక్ ఐనుల్లాహ్ ఖాద్రి ఒక ప్రకటనలో తెలిపారు