17, మార్చి 2024, ఆదివారం

ఇహ లోకంలో అహంకారం పనికిరాదు

 ఇహ లోకంలో అహంకారి పనికిరానిదని దేవుడు అన్నిటిని క్షమిస్తాడు కానీ అహంకారాన్ని క్షమించడని అనంతశ్రీ విభజిత్ శ్రీ జగద్గురు రామానందాచార్య శ్రీ స్వామి నరేంద్ర జి మహారాజ్ అన్నారు శనివారం చుక్కల మండలంలోని తెలంగాణ ఉపపీఠంలో సమస్య మార్గదర్శనం దర్శన భాగ్యంతో పాటు ఉపాసక దీక్ష కార్యక్రమంలో పాల్గొని స్వామి అశేష భక్తజన వాహిని ఉద్దేశించి ప్రవచించారు ప్రపంచంలో అన్ని ప్రాణుల కంటే మానవ జీవితం అతి ముఖ్యమైనదని ఇందులో మానవునికి ఆలోచన శక్తి ఉంటుంది కాబట్టి ప్రతి మానవుడు సన్మార్గాన్ని అవలంబించాలని అన్నారు మంచిని పంచాలని ఇతరుల గురించి నిందలు వేయడం చెడు చేయడం మానుకుని తాము జీవిస్తూ ఇతరులు కూడా తమలాగే జీవించే విధానం విధంగా జీవితాన్ని గడపాలన్నారు ఇహలోక జీవితం శాశ్వతం కాదని పరలోక జీవితం శాశ్వతం కాబట్టి ఈ జన్మలో ఆధ్యాత్మిక చింతన దానధర్మాలు తల్లిదండ్రుల సేవ ఆలయాల్లో గ్రామాలలో స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తూ దుర్వేసనాలకు దూరంగా ఉంటే పుణ్యం ప్రాప్తించి మంచి జన్మ లభిస్తుందన్నారు ఈ సందర్భంగా వేలాదిగా వచ్చిన భక్తులకు ఉచితంగా ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి భక్తులకు మందులను పంపిణీ చేశారు దీంతో పాటు తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక నుండి సైతం వేలాదిక భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు తెలంగాణ ఉపపీఠం సేవాసమితి భక్తులకు అన్నదానం తో పాటు సకల సౌకర్యాలు కల్పించార. స్వామివారి నేడు ఆదివారం సైతం ఉప పీఠంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారని ఇట్టి అవకాశాన్ని రెండవ రోజు భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఉపపీఠం సేవా సమితి కోరింది





తోకతో జన్మించిన శిశువు

 చైనాలో అరుదైన ఘటన జరిగింది ఒక మగ శిశువు తోకతో జన్మించాడు హాంగ్జౌ చిల్డ్రన్స్ హాస్పిటల్ లో జన్మించిన ఈ శిశువును చూసి డాక్టర్లు సైతం ఆచారి పోయారు దాదాపు పది సెంటీమీటర్లు 3.9 ఇంచులు పొడవుతో మృదువుగా ఎలాంటి ఎముక లేకుండా ఈ తోక ఉంది దీనిని టేధర్డ్ స్పైనల్ కార్డ్ అంటారని వైద్యులు తెలిపారు వెన్నెముక చివరి భాగం చుట్టుపక్కల ఉండే కణజాలంతో అనుసంధానం అయినందునై టేదర్డ్  స్పైనల్ కార్డ్ ఏర్పడిందని చెప్పారు తోకతో జన్మించిన శిశువును చూసి ఆందోళన చెందిన తల్లి సర్జరీ చేసి తొలగించాల్సిందిగా డాక్టర్లను కోరారు అయితే ఇది బాలుడు నాడీ వ్యవస్థతో ముడిపడి ఉన్నందున తొలగిస్తే సమస్యలు రావచ్చని భావిస్తున్నారు. గత జూన్ద లో దక్షిణ అమెరికాలోని గయానాలో కూడా ఒక శిశువు ఇలాగే జన్మించగా సర్జరీ చేసి తొలగించారు




ఆధ్యాత్మిక సమాచారం మార్చి 17 2024

 వెంకటేశ్వర ఆలయంలో పూజలు తాడ్వాయి మండల కేంద్రంలోని శబరిమాత ఆశ్రమంలో ఉన్న వెంకటేశ్వర ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తిశ్రద్ధలతో భజన చేసుకుంటూ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఆలయ ఆవరణలో శాంతిశారు హనుమాన్ స్వాములు సంజీవరెడ్డి రాంరెడ్డి కృష్ణమూర్తి పరమేశ్వర్ భక్తులు సిద్ధరాములు తదితరులు ఉన్నారు

మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయాభివృద్ధి కోసం శనివారం ముంబాయికి చెందిన కంచర్ల సమీరా నైయురాలు 516 రూపాయలు విరాళంగా అందజేశారు ఆలయ అర్చకుడు పరంధామాచార్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు



దోమకొండ మండల కేంద్రంలోని మల్లికార్జున స్వామి ఉత్సవాలలో భాగంగా శనివారం ఘనంగా గంగ భౌనం నిర్వహించారు ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఆదివారం మందగంపలు సోమవారం మల్లన్న స్వామి కళ్యాణం భక్తులకు అన్నదానం చేస్తారు ఆలయ కమిటీ ప్రతినిధులు నేతల మల్లేశం యాదవ్ సుధాకర్ యాదవ్ తదితరులు ఉన్నారు

వేద పట్టణం మనిషికి జీవన ఆధారం వివిధ మతాల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ ధర్మం విషయంలో ఏ భేదం లేదని విషయాన్ని గ్రహించాలని విదేశీయమని కవిత ఆర్య అన్నారు స్థానిక సిరిసిల్ల రోడ్డులోని శ్రీకృష్ణ గీతా మందిరం 22వ వార్షికోత్సవం ఈ నెల 19న నిర్వహిస్తున్న సందర్భంగా ప్రతిరోజు సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఏడు గంటల వరకు ఆచార్య సత్యమిత్ర విదేశీయమని కవిత ఆర్య వేదజ్ఞానామృత ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు పాత అశోకు అర్వపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు

గిరిజనులు తమ ఆరాధ్య గురువు శ్రీ రామారావు మహారాజు సూచించిన భక్తి మార్గాన్ని అనుసరిస్తూ గురువు బోధనలను పాటించాలని శ్రీసంత సేవాలాల్ దీక్ష గురువు ప్రేమ్ సింగ్ మహారాజు సూచించారు శనివారం రాంపూర్ తండాలో శ్రీరామారావు మహారాజు విగ్రహం ఆవిష్కరించి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన భోగ్ బండారుకు హాజరై మాట్లాడారు శ్రీ రామారావు మహారాజ్ బోధనలతో గిరిజనుల జీవితాలు బాగుపడ్డాయి అన్నారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి గ్రహ దాతలు జవాన్ రవి చవాన్ మోహన్లతో తదితరులతో కలిసి వేద పండితుల పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ రావు కొత్తకొండ భాస్కర్ మాసాని శ్రీనివాస్ రెడ్డి వెంకట్ రెడ్డి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నాయకులు ప్రతాప్ సింగ్ తదితరులు ఉన్నాచేశారు



సిద్ధిరామేశ్వరాలయం ఉత్సవ కమిటీ ఏర్పాటు దక్షిణ కాశీగా పేరుందిన భిక్కనూరు సిద్ధిరామేశ్వరాలయం బ్రహ్మోత్సవాల నిర్వహించేందుకు దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు ఈ మేరకు శనివారం ఉత్తర్వులను జారీ చేశారు ఉత్సవ కమిటీ సభ్యులుగా తాటిపాముల లింబాద్రి ఎన్ శివయ్య జి బాలమని ఆయన అంజయ్య ఏ అమృత సామ సంతోష్ రెడ్డి ఆర్ ప్రవీణ్ గౌడ్ పి ఈశ్వర్ రెడ్డి ఎమ్ కిష్టయ్య ఎం రమేష్ రెడ్డి జి నారాయణ ఎల్ బాలయ్య ఎం బాపురెడ్డి కాశీనాథుని నియమిస్తూ ఉత్తర్వులను కమిషనర్ జారీ చేశారు ఆలయ బ్రహ్మోత్సవాలు ఈనెల 30వ తేదీ నుంచి ఏప్రిల్ మూడవ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు