3, మార్చి 2024, ఆదివారం

రూపాయి కే పెండ్లి

 ఒక్క రూపాయితో రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు దివ్యాంగులకు వివాహం చేస్తామంటున్నది రూపాయి ఫౌండేషన్ ఆదివారం ఒక జంటను ఒకటి చేయనున్నది కూడా సామాజిక సేవలో భాగంగా 15 ఏళ్లుగా దాదాపు 100కు పైగా అనాధలు దివ్యాంగ జంటలకు వివాహాలు జరిపించిన అమ్మ ఫౌండేషన్ నిర్వాహకులు నాగమళ్ళ అనిల్ కుమార్ అరుణ ఇటీవల రూపాయి ఫౌండేషన్ పేరుతో మరో సేవా సంస్థను స్థాపించారు రూపాయితో తమ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకుంటే దివ్యాంగ జంటకు ఉచితంగా పెళ్లి చేస్తామని చెప్తున్నారు సంగారెడ్డికి చెందిన ప్రవళికకు మేడ్చల్కు చెందిన మట్టా రమేష్ తో సైదాబాద్ మెయిన్ రోడ్డు పై ఉన్న ఎస్బిఐ బిల్డింగ్ ఆర్య ఈవెంట్స్ లో ఆదివారం ఉదయం 11 గంటలకు వివాహం జరిపించేందుకు ఏర్పాటు చేశారు దాచిన రూపాయి నిన్ను ధనవంతుడిని చేస్తుంది దానం చేస్తే అదే రూపాయి నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది అన్న నినాదంతో వివాహాలకు అవసరమైన విరాళాలను సేకరిస్తున్నది రూపాయి ఫౌండేషన్ ఇలాంటి వివాహాలకు ఆర్థిక చేయుట నిచ్చేందుకు తమ వంతుగా ఒక్క రూపాయి విరాళంగా ఇవ్వాలని నాగమల్ల అని అరుణ విజ్ఞప్తి చేశారు 9246576070 గూగుల్ పే.

సజాతి ధ్రువాలు ఆకర్షిస్తాయి

 ఆక్స్ఫర్డ్ అధ్యయనంలో గుర్తింపు

సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. అనేది ఇంత కాలంగా భౌతిక శాస్త్రంలో ఉన్న ప్రాథమిక సిద్ధాంతం అయితే ఇప్పుడు యూకే లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రసాయన శాస్త్ర విభాగానికి చెందిన పరిశోధకులు సిద్ధాంతం తప్పని రుజువు చేస్తున్నారు తాజాగా వీరు చేసిన ఒక అధ్యయనంలో ద్రావకంలో ఒకే రకంగా చార్జ్ చేసిన సజాతి కణాలు కూడా పరస్పరం ఆకర్షిస్తాయని తేలింది ద్రావకం స్వభావం ఆమ్లత్వాన్ని బట్టి ఇది ఉంటుందని పరిశోధకులు గుర్తించారు నీటిలో విజాతి కణాలు సమూహంగా ఏర్పడితే ఇతనాల్లో మాత్రం సజాతి కణాలు సమూహంగా ఏర్పడుతున్నట్లు పరిశోధకులు తేల్చారు ఈ అధ్యయన వివరాలు నేచర్ నానో టెక్నాలజీ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి


గర్భశోకం గజరాజుకు తెలుసు

 మనుషుల్లాగే బిడ్డ మరణం అని ఏమాత్రం తట్టుకోలేవు మరణించిన పిల్ల ఏనుగు ముందు గట్టిగా ఏడుస్తాయి మనుషులకు చేసినట్లే అంత్యక్రియలు నిర్వహిస్తాయి గొయ్యి తీసి పోడ్చి తర్వాత నీటిలో స్నానాలు చేస్తాయి

భారీ కాయంతో గంభీరంగా కనిపించే ఏనుగులకు కూడా మనుషులకు ఉన్నట్లే భావోద్వేగాలు అమితంగా ఉంటాయని బిడ్డ చనిపోతే తట్టుకోలేనంత గర్భశోకానికి అవి గురవుతాయని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పరిశోధకులు తాజా అధ్యయనంలో తేలింది మనుషులు చేసినట్లే చనిపోయిన పిల్ల ఏనుగుల మృతదేహాలకు పద్ధతి ప్రకారం ఏనుగులు అంత్యక్రియలను నిర్వహిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు ఈ మేరకు 2022 2023లో బెంగాల్లో ఉండే 15 నుండి 2 ఏనుగులకు సంబంధించి ఐదు కేసులను విశ్లేషించినట్లు అధ్యయనంలో భాగమైన ఐఎఫ్ఎస్సి అధికారి ప్రవీణ్ కళ్యాణ్ ఆకాశదీప్ రాయి పేర్కొన్నారు ఈ వివరాలు త్రెటైండ్ టాక్స్ జర్నల్లో  ప్రచురితమయ్యాయి

అంత్యక్రియలు ఇలా

చనిపోయిన బిడ్డ ఏనుగును చూసిన తల్లి ఏనుగు తండ్రి ఏనుగు ఆ మృతదేహాన్ని తొండం ముందరి కాళ్ళతో నెమ్మదిగా తడుముతూ గట్టిగా రోదిస్తాయని పరిశోధకులు తెలిపారు ఆ తర్వాత మానవ సంచారం లేని ప్రాంతానికి ఆ బిడ్డ మృతదేహాన్ని తొండం సహాయంతో ఏనుగుల గుంపు తరలిస్తుంది పొలాలు లేదా టిఎస్టి లేదా కాలువ గట్టున ఉన్న నిర్మాణస్యమైన చదువునైనా ప్రాంతంలో గోతిని తవ్వి పిల్ల ఏనుగు ముందరి కాళ్లు పైకి కనిపించేలా ఉంచి నెమ్మదిగా కప్పి పెడుతుంది ఆ తర్వాత దగ్గరలోని నీటిలో ఏనుగుల గుంపు స్నానాలు ఆచరిస్తాయి పిల్ల ఏనుగును పూడ్చిపెట్టిన ప్రాంతానికి ఇంకెప్పుడూ ఆ గుంపు రాబోదని పరిశోధకుల బృందం తెలిపింది మరణించిన పిల్ల ఏనుగుల విషయంలోని ఏనుగులు ఈ క్రతువులు జరుపుతాయని పెద్ద ఏనుగుల విషయంలో జరిపినట్లు ఆధారాలు లేవని వెల్లడించింది పెద్ద ఏనుగును తరలించడం పోడ్చడం కష్టమైన పని కావడమే దీనికి కారణమై ఉండవచ్చని అభిప్రాయపడింది