29, ఫిబ్రవరి 2024, గురువారం

శ్వేత ప్రసాద్కు బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారము

 తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత కళాకారుని శ్వేతా ప్రసాద్ 2022 23 సంవత్సరానికి ప్రతిష్టాత్మక ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారకు ఎంపికయ్యారు కేంద్ర సంగీత నాటక అకాడమీ ఈ అవార్డును బుధవారం న్యూఢిల్లీలో ప్రకటించింది సంగీత విభాగం కర్ణాటక మ్యూజిక్ లో తెలంగాణ నుంచి శ్వేతా ప్రసాదం ఎంపిక చేశారు శ్వేతా ప్రసాద్ ప్రపంచవ్యాప్తంగా మూడు దశాబ్దాలుగా 2 వేలకు పైగా గాత్ర ప్రదర్శనలు నిర్వహించారు అన్నమాచార్య కృతులు త్యాగరాజ కీర్తనలతో ప్రదర్శనలు ఇచ్చారు దేశ విదేశాలలో భరతనాట్యము ఆంధ్ర నాట్యము కూచిపూడి విభాగాలలో ప్రముఖ నాట్య కళాకారులకు గాత్రము నట్టువాంగా సహకారం అందించారు పలు నృత్య ప్రదర్శనలకు స్వర కల్పన చేశారు అమెరికా చైనా మలేషియా టర్కీ సిరియా వియత్నాం దేశాలలో భారత సాంస్కృతిక మండలి తరఫున పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు

ప్రముఖ సినీ నటుడు రక్త కన్నీరు నాగభూషణం మనవారాలైన శ్వేతా ప్రసాద్ నాలుగేళ్ల ప్రాయంలోనే సంగీతం అభ్యసించారు కర్ణాటక ఓకల్ , లలిత సంగీతంలో ఆకాశవాణి ఏ గ్రేడ్ కళాకారుని ఆయన శ్వేతా ప్రసాద్ ప్రస్తుతం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంపీ చేస్తున్నారు

గంగాధరశాస్త్రికి సంగీత నాటక అకాడమీ అవార్డు

 ప్రసిద్ధ గాయకుడు భగవద్గీత గాన ప్రవచన ప్రచారకర్త భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎల్వి గంగాధరశాస్త్రికి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది 2023 ఏడాదికి గాను ఇతర ప్రధాన సంప్రదాయ సంగీత విభాగంలో ఆయనకు ఈ పురస్కారం దక్కింది తాను అభ్యసించిన కర్ణాటక శాస్త్రీయ సంగీతంతో భగవద్గీతలోని 700 శ్లోకాలలో ఘంటసాల స్వరపరిచి పాడిన 108 శ్లోకాలను ఆయన గౌరవార్థం గంగాధర శాస్త్రి యథాతకంగా పాడారు అంతేకాదు మిగిలిన 594 శ్లోకాలను స్వీయ సంగీతంలో తెలుగు తాత్పర్య సహితంగా గానం చేశారు గతంలో గంగాధర శాస్త్రిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళా రత్న హంస పురస్కారంతో మధ్యప్రదేశ్ లోని మహర్షి పాడిని యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి అవార్డును ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు గంగాధర శాస్త్రి పేర్కొన్నారు అలాగే సంగీత నాటక అకాడమీ చైర్మన్ డాక్టర్ సంధ్యాపురేచతో పాటు జూరీ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు

రేపటినుండి ఎండోమెట్రియాసిస్పై ప్యానల్ డిస్కషన్స్

 పదిమంది మహిళలలో ఒకరు ఎండోమెట్రియోసిస్ వ్యాధి బారిన పడుతున్నారని ఎండోమెట్రియోసిస్ ఫౌండేషన్ పేర్కొన్నది ఈ వ్యాధిపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా రేపటినుండి వర్క్ షాపులు నిర్వహిస్తున్నట్లు ఫౌండర్ డాక్టర్ బింద్ర తెలిపారు మార్చి ఒకటి నుంచి మూడు వరకు సెషన్ల వారీగా వ్యాధి లక్షణాలు గుర్తించడం అందుబాటులో ఉన్న చికిత్స విధానాలు రోబోటిక్ సర్జరీలు తదితర అంశాలపై వైద్య నిపుణులు చర్చించనున్నారని తెలిపారు. జూబ్లీహిల్స్ లోని అపోలో దవాఖాన బేగంపేటలోని మ్యారిగోల్డ్ హోటల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు వర్క్ షాప్ చివరి రోజు మార్చి మూడున నెక్లెస్ రోడ్డులో ఉదయం ఆరు గంటలకు ఎల్లో రిబ్బన్ రన్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు