29, ఫిబ్రవరి 2024, గురువారం

గంగాధరశాస్త్రికి సంగీత నాటక అకాడమీ అవార్డు

 ప్రసిద్ధ గాయకుడు భగవద్గీత గాన ప్రవచన ప్రచారకర్త భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎల్వి గంగాధరశాస్త్రికి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది 2023 ఏడాదికి గాను ఇతర ప్రధాన సంప్రదాయ సంగీత విభాగంలో ఆయనకు ఈ పురస్కారం దక్కింది తాను అభ్యసించిన కర్ణాటక శాస్త్రీయ సంగీతంతో భగవద్గీతలోని 700 శ్లోకాలలో ఘంటసాల స్వరపరిచి పాడిన 108 శ్లోకాలను ఆయన గౌరవార్థం గంగాధర శాస్త్రి యథాతకంగా పాడారు అంతేకాదు మిగిలిన 594 శ్లోకాలను స్వీయ సంగీతంలో తెలుగు తాత్పర్య సహితంగా గానం చేశారు గతంలో గంగాధర శాస్త్రిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళా రత్న హంస పురస్కారంతో మధ్యప్రదేశ్ లోని మహర్షి పాడిని యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి అవార్డును ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు గంగాధర శాస్త్రి పేర్కొన్నారు అలాగే సంగీత నాటక అకాడమీ చైర్మన్ డాక్టర్ సంధ్యాపురేచతో పాటు జూరీ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు

రేపటినుండి ఎండోమెట్రియాసిస్పై ప్యానల్ డిస్కషన్స్

 పదిమంది మహిళలలో ఒకరు ఎండోమెట్రియోసిస్ వ్యాధి బారిన పడుతున్నారని ఎండోమెట్రియోసిస్ ఫౌండేషన్ పేర్కొన్నది ఈ వ్యాధిపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా రేపటినుండి వర్క్ షాపులు నిర్వహిస్తున్నట్లు ఫౌండర్ డాక్టర్ బింద్ర తెలిపారు మార్చి ఒకటి నుంచి మూడు వరకు సెషన్ల వారీగా వ్యాధి లక్షణాలు గుర్తించడం అందుబాటులో ఉన్న చికిత్స విధానాలు రోబోటిక్ సర్జరీలు తదితర అంశాలపై వైద్య నిపుణులు చర్చించనున్నారని తెలిపారు. జూబ్లీహిల్స్ లోని అపోలో దవాఖాన బేగంపేటలోని మ్యారిగోల్డ్ హోటల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు వర్క్ షాప్ చివరి రోజు మార్చి మూడున నెక్లెస్ రోడ్డులో ఉదయం ఆరు గంటలకు ఎల్లో రిబ్బన్ రన్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు

నూతన సాంకేతిక విధానాలపై పొలంబడి

 భిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామంలో రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన సాంకేతిక విధానాలపై పొలంబడి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు డ్రోన్ ద్వారా వారి మొక్కజొన్న ఇతర కూరగాయల పంటలలో వస్తున్న ఆకుపచ్చ పురుగు ఆకుమూడత పేను బంక తదితర తెగుళ్లను నివారించడానికి డ్రోన్ ద్వారా మందులను పిచికారి చేయించడానికి ఎకరాకు 600 అవుతుందని రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు రంజిత్ భూపతి అవగాహన కల్పించారు జంగంపల్లి గ్రామ రైతులు శశికాంత్ నర్సింహులు శ్రీనివాస్ భరత్ రాజ్ తదితరులు పాల్గొన్నారు