28, ఫిబ్రవరి 2024, బుధవారం

హెల్త్ టిప్స్ 28-2-2024

 వాల్ నట్స్ తో కొత్త శక్తి

పిల్లలకు ఏం పెట్టాలనే విషయంలో కన్నవారికి ఎప్పుడూ గందరగోళమే చిన్నారుల ఆహారంలో వాల్నట్స్ చేరిస్తే మంచిది అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇది పిల్లల శరీరం మెదడుకు కావాల్సినంత శక్తిని సమకూరుస్తాయి వీటిలో ఒమేగాత్రి ఫ్యాటీ ఆమ్లాలు ప్రోటీన్లు ఫైబర్ పుష్కలం దీంతో పిల్లలు చురుగ్గా బలంగా సంతోషంగా ఉంటారు మిగిలిన వారితో పోలిస్తే వారంలో కనీసం మూడుసార్లు వాల్నట్స్ తిన్న పిల్లల జ్ఞాపకశక్తి జాగరుకత పెరిగాయని ఈ క్లినికల్ మెడిసిన్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది వాల్నట్స్లో ఉండే ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ అనే ఒక రకం ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లం మెదడు అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా పిల్లలు కౌమార దశలో ఉన్నప్పుడు అవసరం మరీ ఎక్కువ ఈ సమయంలో పిల్లల శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి అయితే పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టాలని విషయంలో డాక్టర్ల సలహా తప్పనిసరి వాల్నట్స్ అలర్జీ లేకపోతే మాత్రం పిల్లలకు ఇది ఒక సూపర్ ఫుడ్

తల్లుల ఆందోళన పిల్లలకు

గర్భణులు కొంగుబాటుకు గురైతే ఆ ఒత్తిడి అంతా పుట్టబోయే పిల్లలకు బదిలీ అవుతుందట దీనికి సంబంధించి బెంగళూరు చైల్డ్ హెల్త్ అండ్ డెవలప్మెంట్ స్టడీ ఒక పరిశోధన నిర్వహించింది 2016లో మొదలైన ఈ అధ్యయనం తాజాగా ముగిసింది బెంగళూరులోని వివిధ ప్రభుత్వ వైద్యశాలలో పేర్లు నమోదు చేసుకున్న 912 మంది గర్భిణులపై ఈ పరీక్షలు జరిపారు కొంగుబాటు ఉన్న గర్భిణులకు పుట్టిన పిల్లలు తక్కువ బరువుతో ఉన్నారట గృహహింస పరోక్ష దుమపానం కూడా గర్భిణీలో పిల్లల మీద దుష్ప్రభావం చూపుతాయట వీటి వల్ల ముందస్తుప్రసాదాలు పిల్లలు ప్రవర్తన సమస్యలు తలెత్తయటం ప్రసవానికి ముందు ఆ తర్వాత కూడా ఇంటి వాతావరణం గర్భిణుల మీద ప్రభావం చూపుతుందని అధ్యయనం తెలిపింది కాబోయే తల్లికి ఇంటా బయట స్నేహపూర్వక వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మనదే

క్యాన్సర్ కు ఏరోబిక్స్ తో చెక

ప్రింటింగ్ రోయింగ్ లాంటి ఏరోబిక్ వ్యాయామాల వల్ల క్యాన్సర్ ముప్పు తగ్గుతుందట యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం వ్యాయామంతో మన శరీర అవయవాలు మరింత గ్లూకోస్ ను వినియోగించుకుంటాయి కణాల్లో శక్తికి ప్రధాన వనరు గ్లూకోజ్ అనే విషయం తెలిసింది దీంతో వ్యాయామం చేసే వాళ్ళలో వ్యాధి వృద్ధి చెందుతున్న దశలో క్యాన్సర్ కణాలు వ్యాపించడానికి అవసరమైన గ్లూకోజ్ అందుబాటులో ఉండదు అటే క్యాన్సర్ కణాలు ఇతర వాళ్లకు వ్యాపించే అవకాశం తక్కువ అన్నమాట

మరో పావుగంట పెంచాల్సిందే

 రోజులో ఎక్కువ సమయం కూర్చునే పనిచేస్తున్నారా అయితే మామూలు కన్నా మీరు మరో పావుగంట ఎక్కువసేపు వ్యాయామం చేయాల్సిందేనట ఉదాహరణకి ఈరోజు 20 నిమిషాలు ఏదైనా వ్యాయామం చేస్తే మంచిదని చెబుతుంటారు కానీ రోజంతా కూర్చుని ఉండేవారు అందరిలా ఆ 20 నిమిషాలకే పరిమితం కాకుండా మరో 15 నిమిషాలు అదనంగా వ్యాయామం చేయాలంటున్నారు పరిశోధకులు దీనిని ఉదయం సాయంత్రం 7 8 నిమిషాలుగా విభజించుకున్న చాలు ఆఫీసులో ఎనిమిది గంటలకు కూర్చుంటే గంటకోసారి లేచి ఒకటి రెండు నిమిషాలు నడిచిన కొంతవరకు ఫలితం ఉంటుందట అమెరికన్ మెడికల్ అసోసియేషన్ కి చెందిన జామా నెట్వర్క్ పత్రిక ఇటీవల ఈ సూచనలు చేసింది శారీరక శ్రమ ఉన్నవాళ్లకన్నా ఎప్పుడూ కూర్చునే ఉండే వాళ్లకి రుద్రోక సమస్య వల్ల 34% ఎక్కువగా ఇతరత్రా వ్యాధుల వల్ల 16% ఎక్కువగా మరణం సంభవించే ప్రమాదం ఉందని ఈ అధ్యాయం చెబుతోంది ప్రపంచవ్యాప్తంగా సు మారు ఎనిమిది లక్షల మందిని దశాబ్దం పాటు అధ్యయనం చేశాక ఈ హెచ్చరికల్ని జారీ చేసింది ఈ సంస్థ శారీరక శ్రమని పెంచుకోవడమే దీనికి పరిష్కారమని సూచిస్తుంది

అతినిద్ర ఆరుదేమి కాదుఆ

 ఏడు ఎనిమిది గంటల పాటు నిద్రపోయిన సరే కొందరు రోజంతా నిద్రమత్తులోనే ఉంటారు బద్ధకిస్తూ సోమరి అంటూ వీళ్ళ పైన ఇట్టే ముద్ర వేసేస్తారు కానీ ఏదో తీవ్రమైన వ్యాధి ఆడియో పతిక్ హైపర్ సోమియా అంటారు దీన్ని కాకపోతే శాస్త్రవేత్తలు ఇంతకాలం ఇదో అరుదైన సమస్యగానే భావిస్తూ వచ్చారు. లక్ష మందిలో కేవలం 37 మందికే ఉంటుందన్నది వాళ్ళాంచన అంటే 0.037% మాత్రమే అన్నమాట అది నిజం కాదని తెలిసింది తాజా అధ్యయనం ఒకటి అమెరికాలోని విస్కాన్షిన్ మెడిసిన్ వర్సిటీ నిర్వహించిన ఈ పరిశోధనలో 800 మందిని పరీక్షిస్తే వాళ్లలో 12 మందికి ఈ తీవ్ర సమస్య ఉన్నట్లు గుర్తించారట దీనిని లక్ష మందికి వర్తింప చేస్తే ఒకటి పాయింట్ ఐదు శాతం అవుతుంది ఏ రకంగా చూసిన అది ఇదివరకటి అంచనా కన్నా చాలా ఎక్కువ ప్రపంచమంతా నిద్రలేని సమస్యపైనే ఎక్కువ దృష్టి పెట్టడం వల్లే ఈ సమస్య బయట పడట్లేదు అంటూ అతినిద్ర సమస్య ఉన్నవాళ్లందరూ ఐడియోపతి హైపర్ సౌమ్య పరీక్ష చేయించుకోవాలని సలహా ఇస్తున్నారు పరిశోధకులు