26, ఫిబ్రవరి 2024, సోమవారం

ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విజయవంతం చేయాలి

 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 26 నుంచి మార్చి 1వ తేదీ వరకు నిర్వహించే ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ నిజామాబాద్ తెలిపారు వారోత్సవాలను పురస్కరించుకుని లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో రూపొందించిన గోడ ప్రతులను సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మేక్ ఎ రైట్ స్టార్ట్ బికమ్ ఫైనాన్షియల్లి స్మార్ట్ అని థీమ్తో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు ప్రధానంగా పొదుపు చక్రవడ్డీ శక్తిపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలతోపాటు స్లోగన్లు డిజిటల్ సైబర్ భద్రత పోస్టర్ రూపకల్పన అనే అంశాలపై పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు విజేతలను రాష్ట్రస్థాయికి పంపుతామన్నారు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా ఈనెల 27న జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ మైదానం నుండి ప్రగతి హాస్పిటల్ వరకు 2కె నడక 28న ఆర్థిక అక్షరాస్యత శిబిరము 29న అన్ని పాఠశాలలు కళాశాలలో విద్యార్థులతో సమావేశమై ఆర్థిక అక్షరాస్యత ప్రాముఖ్యతపై ప్రసంగాలు కార్యక్రమాలు ఉంటాయని ఎల్డీఎం వివరించారు పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యుటి కిరణ్మయి జెడ్పి సీఈవో ఉషా తదితరులు పాల్గొన్నారు


ఎఫ్ పీ ఐ ల పేరుతో మోసపు ట్రేడింగ్ స్కీములు

 విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు వాటి అనుబంధ సంస్థల ఉద్యోగులము అంటూ కొంతమంది మోసపూరిత ట్రేడింగ్ స్కీములను ఆఫర్ చేస్తున్నారంటూ ఇన్వెస్టర్లను మార్కెట్ రెగ్యులేటర్ సెబి హెచ్చరించింది సెబీ రిజిస్టర్డ్ ఎఫ్ బి ఐ సంబంధితమైన అంటూ ప్రచారం చేసుకుంటున్న మోసపూరిత ట్రేడింగ్ ప్లాట్ఫాములపై తమకు పాల ఫిర్యాదులు అందాయని అవి విదేశీ సంస్థ గత ఇన్వెస్టర్ల సభ అకౌంట్స్ లేదా ఇన్స్టిట్యూషనల్ అకౌంట్స్ ద్వారా ట్రేడింగ్ అవకాశాల్ని ఆఫర్ చేస్తున్నాయని సోమవారం సబి విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది ఆన్లైన్ ట్రేడింగ్ కోర్సులు సెమినార్లు స్టాక్ మార్కెట్లో మెంటార్స్ ప్రోగ్రాములు అందిస్తామంటూ వాట్సాప్ లైవ్ బ్రాడ్కాస్టర్తో ప్రచారం చేసి అమాయక ఇంస్టార్లకు వల వేస్తున్నట్లు వివరించింది అంతేకాకుండా ఆ మోసపూరిత వ్యక్తులు అధికారిక ట్రేడింగ్ డిమార్ట్ అకౌంట్ లేకుండానే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని షేర్లు కొనుగోలు ఐపిఓలకు దరఖాస్తు చేయడం వంటివి అనుమతిస్తామని అంటున్నారని సెబి తెలిపింది ఈ కార్యకలాపాలు నకిలీ పేర్లతో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ల ద్వారా నిర్వహిస్తున్నారని అన్నది దేశీయ ఇన్వెస్టర్లు సెక్యూరిటీ మార్కెట్లో చేసే పెట్టుబడులకు సంబంధించి ఎఫ్ బి ఐ లకు ఏ సరళీకరణలు లేవన్నది.

గర్భాశయ క్యాన్సర్ సూచనలు ఏమిటి

 పూనం పాండే పబ్లిసిటీ స్టంట్ కావచ్చు కేంద్ర ప్రభుత్వం టీకాల ప్రస్తావన కావచ్చు ఒక్కసారిగా సర్వికల్ క్యాన్సర్ గురించి దేశవ్యాప్తంగా చర్చ పెరిగింది ఈ నేపథ్యంలో సర్వికల్ క్యాన్సర్ ఎందుకింత ప్రాణాంతకం అవుతున్నది అనే అధ్యయనం మొదలైనది తొలి రోజులలో పసిగట్టకపోవడమే ఈ మహమ్మారి విగ్రహం పడకు అసలు కారణమని గుర్తించారు నిపుణులు లక్షణాలను కనిపెట్టి సరైన వైద్యుడిని సంప్రదిస్తే తొలి దశలోనే సమర్థమైన చికిత్స సాధ్యం అంటున్నారు

రుతుస్రావ సమయంలో రక్తం ఎక్కువగా పోవడం రోజుల తరబడి రక్తస్రావం కొనసాగడం

పీరియడ్స్ మధ్యలో బహిష్టు తర్వాత కూడా రక్తస్రావము జరగడం

రక్తం రంగు మారుతూ దుర్వాసనతో కూడిన స్రావాలు వెలువడము

గర్భాశయం దగ్గర నొప్పి దురదగా ఉండడం, మూత్రానికి వెళ్ళినప్పుడు, రతి సమయంలో ఆసౌకర్యం కలగడం

ఈ లక్షణాలు ఇతర వ్యాధులలో కూడా కనిపించవచ్చు అదే సమయంలో గర్భాశయ క్యాన్సర్కు కూడా సూచనగానూ భావించాలి 9 నుంచి 14 సంవత్సరాల వయసులో వ్యాక్సిన్ వేయించుకోవడం పాతికేళ్ల వయసు వచ్చిన తర్వాత ప్రతి మూడు నుంచి ఐదు ఏళ్లకు ఒకసారి స్క్రీనింగ్ చేయించుకోవడం ఉత్తమమని నిపుణులు సలహా ఇస్తున్నారు